టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్-రైటర్ డ్యుయోల్లో త్రినాథరావు నక్కిన-ప్రసన్నకుమార్ బెజవాడలది ఒకటి. సినిమా చూపిస్త మావ అనే చిన్న సినిమాతో వీళ్లిద్దరి ప్రయాణం మొదలైంది. ఆ సినిమా సూపర్ హిట్టయి వీళ్లకు మంచి డిమాండ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా ఇదే జోడీ ‘నేను లోకల్’ చేస్తే అది ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది.
ఆ తర్వాత ప్రసన్నకుమార్ స్క్రిప్టుతో త్రినాథరావు.. రామ్ హీరోగా ‘హలో గురూ ప్రేమ కోసమే’ చేశాడు. అది కూడా మంచి విజయం సాధించింది. చాలామంది గుర్తించని విషయం ఏంటంటే.. ఈ మూడు చిత్రాల్లోనూ కథలో సారూప్యతలుంటాయి. హీరో.. హీరోయిన్తో ప్రేమలో పడితే ఆమె తండ్రి అడ్డుపడడం.. మామా అల్లుళ్ల మధ్య పోరు నడవడం.. చివరికి మామ మీద అల్లుడు గెలవడం కామన్ పాయింట్.
ఒకే కథను మూడుసార్లు అటు ఇటు తిప్పి తీసినా ప్రేక్షకులకు బోర్ అనిపించలేదు. మంచి ఎంరట్టైన్మెంట్ ఉండడంతో అన్నింటికీ విజయాలు కట్టబెట్టారు. ఇప్పుడు ఇదే జోడీ నుంచి మరో సినిమా రాబోతోంది. సందీప్ కిషన్ అందులో హీరో కాగా.. రావు రమేష్ కీలక పాత్ర చేస్తున్నాడు. మధ్యలో త్రినాథరావు-ప్రసన్నకుమార్ ‘ధమాకా’తోనూ ఘనవిజయాన్నందుకున్నారు.
కాకపోతే రవితేజ ఇమేజ్ వేరు కాబట్టి మామా అల్లుళ్ల ఫార్ములా పక్కన పెట్టి ఆయన కోసం వేరే కథ ట్రై చేశారు. అది వర్కవుటైంది. కానీ సందీప్ హీరో.. రావు రమేష్ కీలక పాత్ర అనగానే మళ్లీ పాత ఫార్ములాను బయటికి తీస్తారేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. రావు రమేష్ పాత్ర సినిమాలో కీలకమని.. అది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందని అంటున్నారు. ఐతే ఒకే కథను అటు ఇటు తిప్పి తీస్తే అన్నిసార్లూ వర్కవుట్ కాదు కాబట్టి ఈసారి త్రినాథరావు-ప్రసన్నకుమార్ కొత్త ఫార్ములా ట్రై చేస్తారేమో చూడాలి.
This post was last modified on April 23, 2024 10:24 pm
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…