Movie News

ఒక్కడు పవర్ అలాంటిది మరి

ఏదైనా రీమేక్ పెద్ద విజయం సాధించినప్పుడు దాని క్రెడిట్ సగం ఖచ్చితంగా ఒరిజినల్ సృష్టించిన వాళ్లకు చెందుతుంది. ఇప్పుడీ ప్రస్తావన తేవడానికి కారణం ఒక్కడు. మహేష్ బాబుకి మాస్ లో మంచి పట్టు దక్కేలా చేసిన వాటిలో దీనికే మొదటి స్థానం. ఆ తర్వాత పోకిరి గురించి చెప్పుకోవచ్చు. గుణశేఖర్ దర్శకత్వంలో ఎంఎస్ రాజు నిర్మించిన ఒక్కడు ఎప్పటికీ మర్చిపోలేని బ్లాక్ బస్టర్ గా నిలిచిపోవడానికి కారణాలు అనేకం. కర్నూల్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్, హైదరాబాద్ చార్మినార్ సెటప్, ప్రకాష్ రాజ్ విలనీ, హీరోయిన్ భూమిక వీటన్నిటికి మించి మహేష్ బాబు ఆన్ స్క్రీన్ చరిష్మా చేసిన మేజిక్ అలాంటిది

తమిళంలో విజయ్ స్టార్ డం విపరీతంగా పెరగడంలో దోహదం చేసింది కూడా ఒక్కడు రీమేక్ గిల్లినే. తమిళనాడులో దీన్ని రేపు గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. హంగామా ఏ స్థాయిలో ఉందంటే రెండు రోజుల ముందే బుక్ మై షోలో 60 వేల టికెట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఒక్క చెన్నై నగరంలోనే 300కి పైగా షోలు వేస్తున్నారంటేనే క్రేజ్ ని అర్థం చేసుకోవచ్చు. ఒక్కడులాగే రీమేక్ లోనూ ప్రకాష్ రాజే విలన్ గా నటించగా భూమిక స్థానంలో త్రిష ఒదిగిపోయింది. విద్యాసాగర్ స్వరపరిచిన అపుడి పోడు అనే పాట మ్యూజిక్ లవర్స్ ని ఎంత ఊపేసిందో తెలిసిందే.

ఇదంతా చెప్పడానికి కారణం ఒకటే. గిల్లి ఇంతగా అక్కడి వాళ్లకు కనెక్ట్ అయ్యిందంటే దానికి కారణం ఒక్కడే. పైపెచ్చు పోలికల పరంగా చూసుకున్నా తెలుగు వెర్షన్ ఇచ్చినంత ఎగ్జైట్ మెంట్, గ్రాండియర్ నెస్ తమిళంలో కనిపించదు. అయినా సరే బ్రహ్మరథం పట్టారంటే ఆ ఘనత గుణశేఖర్, పరుచూరి బ్రదర్స్, మణిశర్మలకు దక్కుతుంది. మహేష్ కి ఎలాగైతే ఒక్కడు లిఫ్ట్ గా ఉపయోగపడిందో విజయ్ కు గిల్లి ఎస్కలేటర్ గా గ్రాఫ్ ని అమాంతం పైకి తీసుకెళ్లింది. అయితే అర్జున్ కపూర్ తో తీసిన హిందీ రీమేక్ తేవర్ దారుణమైన డిజాస్టర్ కావడం ఊహించని కొసమెరుపు.

This post was last modified on April 19, 2024 6:31 pm

Share

Recent Posts

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

2 hours ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

2 hours ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

4 hours ago

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

7 hours ago

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

12 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

12 hours ago