ఏదైనా రీమేక్ పెద్ద విజయం సాధించినప్పుడు దాని క్రెడిట్ సగం ఖచ్చితంగా ఒరిజినల్ సృష్టించిన వాళ్లకు చెందుతుంది. ఇప్పుడీ ప్రస్తావన తేవడానికి కారణం ఒక్కడు. మహేష్ బాబుకి మాస్ లో మంచి పట్టు దక్కేలా చేసిన వాటిలో దీనికే మొదటి స్థానం. ఆ తర్వాత పోకిరి గురించి చెప్పుకోవచ్చు. గుణశేఖర్ దర్శకత్వంలో ఎంఎస్ రాజు నిర్మించిన ఒక్కడు ఎప్పటికీ మర్చిపోలేని బ్లాక్ బస్టర్ గా నిలిచిపోవడానికి కారణాలు అనేకం. కర్నూల్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్, హైదరాబాద్ చార్మినార్ సెటప్, ప్రకాష్ రాజ్ విలనీ, హీరోయిన్ భూమిక వీటన్నిటికి మించి మహేష్ బాబు ఆన్ స్క్రీన్ చరిష్మా చేసిన మేజిక్ అలాంటిది
తమిళంలో విజయ్ స్టార్ డం విపరీతంగా పెరగడంలో దోహదం చేసింది కూడా ఒక్కడు రీమేక్ గిల్లినే. తమిళనాడులో దీన్ని రేపు గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. హంగామా ఏ స్థాయిలో ఉందంటే రెండు రోజుల ముందే బుక్ మై షోలో 60 వేల టికెట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఒక్క చెన్నై నగరంలోనే 300కి పైగా షోలు వేస్తున్నారంటేనే క్రేజ్ ని అర్థం చేసుకోవచ్చు. ఒక్కడులాగే రీమేక్ లోనూ ప్రకాష్ రాజే విలన్ గా నటించగా భూమిక స్థానంలో త్రిష ఒదిగిపోయింది. విద్యాసాగర్ స్వరపరిచిన అపుడి పోడు అనే పాట మ్యూజిక్ లవర్స్ ని ఎంత ఊపేసిందో తెలిసిందే.
ఇదంతా చెప్పడానికి కారణం ఒకటే. గిల్లి ఇంతగా అక్కడి వాళ్లకు కనెక్ట్ అయ్యిందంటే దానికి కారణం ఒక్కడే. పైపెచ్చు పోలికల పరంగా చూసుకున్నా తెలుగు వెర్షన్ ఇచ్చినంత ఎగ్జైట్ మెంట్, గ్రాండియర్ నెస్ తమిళంలో కనిపించదు. అయినా సరే బ్రహ్మరథం పట్టారంటే ఆ ఘనత గుణశేఖర్, పరుచూరి బ్రదర్స్, మణిశర్మలకు దక్కుతుంది. మహేష్ కి ఎలాగైతే ఒక్కడు లిఫ్ట్ గా ఉపయోగపడిందో విజయ్ కు గిల్లి ఎస్కలేటర్ గా గ్రాఫ్ ని అమాంతం పైకి తీసుకెళ్లింది. అయితే అర్జున్ కపూర్ తో తీసిన హిందీ రీమేక్ తేవర్ దారుణమైన డిజాస్టర్ కావడం ఊహించని కొసమెరుపు.
This post was last modified on April 19, 2024 6:31 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…