Movie News

అలియా భట్ తరహాలో జాన్వీ కపూర్ సాహసం

అతిలోకసుందరి స్వర్గీయ శ్రీదేవి వారసురాలిగా పరిశ్రమలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ ఏడు సంవత్సరాల తర్వాత టాలీవుడ్ లో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఏదో డబుల్ జాక్ పాట్ తరహాలో ఆర్ఆర్ఆర్ స్టార్లు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన ఒకేసారి రెండు ఆఫర్లు పట్టేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దేవర షూటింగ్ కొలిక్కి వస్తుండగా ఆర్సి 16 వేసవి పూర్తయ్యాక సెట్స్ పైకి వెళ్తుంది. ఇక్కడ ఇంత క్రేజీ అవకాశాలున్నా బాలీవుడ్ జాన్వీ ఎక్కువ ఫిమేల్ ఓరియెంటెడ్ కథలే ఎంచుకుంటోంది. స్టార్ హీరోల సరసన జోడిగా కన్నా సోలోగా కనిపించేందుకే ప్రాధాన్యం ఇస్తోంది.

తాజాగా ఉలజ్ అనే సినిమా చేసింది జాన్వీ, జూలైలో విడుదల కానుంది. టీజర్ లో కాన్సెప్ట్ ఏంటో ఐడియా ఇచ్చారు. విదేశీ రాయబారిగా ఇతర దేశానికి వెళ్లిన అమ్మాయి అక్కడి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కునే క్రమంలో ప్రమాదంలో పడుతుంది. అయితే రహస్య గూఢచారి కావడంతో భారత ప్రభుత్వం నుంచి మద్దతు దక్కదు. బయటకు రాలేని ఆ విష వలయం నుంచి ఎలా బయట పడిందనేది స్టోరీ పాయింట్ గా కనిపిస్తోంది. అసలు కంటెంట్ లో కథ కొంచెం వేరుగా ఉండొచ్చేమో కానీ థీమ్ మాత్రం స్పష్టంగా ఉంది. శుభాన్షు సరియా దర్శకత్వం వహించిన ఉలజ్ లో ప్రత్యేకంగా హీరో అంటూ లేడు.

ఇక అలియా భట్ కు ఈ సినిమాకు లింక్ ఏంటో చూద్దాం. ఉలజ్ ని పోలిన పాత్రలో ఇంతకు ముందు తను రాజీ చేసింది. పాకిస్థాన్ అధికారి ఇంటికి కోడలిగా వెళ్లి అక్కడి రహస్యాలను మనకు చేరవేసే సీక్రెట్ ఏజెంట్ గా అలియా చూపించిన పెర్ఫార్మన్స్ కమర్షియల్ సక్సెస్ తో పాటు బోలెడు అవార్డులు తెచ్చింది. చూస్తుంటే ఉలజ్ కూడా అదే తరహాలో కనిపిస్తోంది. గ్లామర్ డోస్ చూపించడం కంటే నటనకు ప్రాధాన్యం ఉన్న వాటి ద్వారా పేరు తెచ్చుకోవాలని చూస్తున్న జాన్వీ కపూర్ ఇంట గెలిచి రచ్చ గెలిచే ఛాన్స్ ఈ 2024 సంవత్సరం ఇచ్చేలా ఉంది. చూడాలి మరి ఎలా వాడుకోబోతోందో.

This post was last modified on April 17, 2024 9:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago