అతిలోకసుందరి స్వర్గీయ శ్రీదేవి వారసురాలిగా పరిశ్రమలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ ఏడు సంవత్సరాల తర్వాత టాలీవుడ్ లో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఏదో డబుల్ జాక్ పాట్ తరహాలో ఆర్ఆర్ఆర్ స్టార్లు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన ఒకేసారి రెండు ఆఫర్లు పట్టేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దేవర షూటింగ్ కొలిక్కి వస్తుండగా ఆర్సి 16 వేసవి పూర్తయ్యాక సెట్స్ పైకి వెళ్తుంది. ఇక్కడ ఇంత క్రేజీ అవకాశాలున్నా బాలీవుడ్ జాన్వీ ఎక్కువ ఫిమేల్ ఓరియెంటెడ్ కథలే ఎంచుకుంటోంది. స్టార్ హీరోల సరసన జోడిగా కన్నా సోలోగా కనిపించేందుకే ప్రాధాన్యం ఇస్తోంది.
తాజాగా ఉలజ్ అనే సినిమా చేసింది జాన్వీ, జూలైలో విడుదల కానుంది. టీజర్ లో కాన్సెప్ట్ ఏంటో ఐడియా ఇచ్చారు. విదేశీ రాయబారిగా ఇతర దేశానికి వెళ్లిన అమ్మాయి అక్కడి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కునే క్రమంలో ప్రమాదంలో పడుతుంది. అయితే రహస్య గూఢచారి కావడంతో భారత ప్రభుత్వం నుంచి మద్దతు దక్కదు. బయటకు రాలేని ఆ విష వలయం నుంచి ఎలా బయట పడిందనేది స్టోరీ పాయింట్ గా కనిపిస్తోంది. అసలు కంటెంట్ లో కథ కొంచెం వేరుగా ఉండొచ్చేమో కానీ థీమ్ మాత్రం స్పష్టంగా ఉంది. శుభాన్షు సరియా దర్శకత్వం వహించిన ఉలజ్ లో ప్రత్యేకంగా హీరో అంటూ లేడు.
ఇక అలియా భట్ కు ఈ సినిమాకు లింక్ ఏంటో చూద్దాం. ఉలజ్ ని పోలిన పాత్రలో ఇంతకు ముందు తను రాజీ చేసింది. పాకిస్థాన్ అధికారి ఇంటికి కోడలిగా వెళ్లి అక్కడి రహస్యాలను మనకు చేరవేసే సీక్రెట్ ఏజెంట్ గా అలియా చూపించిన పెర్ఫార్మన్స్ కమర్షియల్ సక్సెస్ తో పాటు బోలెడు అవార్డులు తెచ్చింది. చూస్తుంటే ఉలజ్ కూడా అదే తరహాలో కనిపిస్తోంది. గ్లామర్ డోస్ చూపించడం కంటే నటనకు ప్రాధాన్యం ఉన్న వాటి ద్వారా పేరు తెచ్చుకోవాలని చూస్తున్న జాన్వీ కపూర్ ఇంట గెలిచి రచ్చ గెలిచే ఛాన్స్ ఈ 2024 సంవత్సరం ఇచ్చేలా ఉంది. చూడాలి మరి ఎలా వాడుకోబోతోందో.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…