టిల్లు స్క్వేర్ అనే సినిమాకు రిలీజ్కు ముందే మంచి హైప్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోెరుగా జరిగాయి. ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. అయినా సరే ఆ సినిమా స్థాయికి వంద కోట్ల వసూళ్లు అన్నవి అనూహ్యం. అది కూడా పది రోజుల్లోపే సాధించడం అసామాన్యం. వంద కోట్ల మైలురాయి తర్వాత కూడా ఈ చిత్రం ఆగట్లేదు. నిలకడగా వసూళ్లు సాధిస్తోంది. రిలీజైన మూడో వారం కూడా ఈ సినిమా బాక్సాఫీస్ లీడర్గా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్లోనూ ‘టిల్లు స్క్వేర్’ దూకుడు చూపిస్తోంది. తొలి వారం రోజుల్లోనే 2 మిలియన్ డాలర్ల మార్కును అందుకుని ఆశ్చర్యపరిచిన ‘టిల్లు స్క్వేర్’… రెండు, మూడు వీకెండ్లలో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఏకంగా 3 మిలియన్ డాలర్ల మైలురాయిని కూడా అందుకుంది ఈ చిత్రం.
మంగళవారం ఫుల్ రన్ అయ్యేసరికి ‘టిల్లు స్క్వేర్’ 3 మిలియన్ మార్కును టచ్ చేసింది. సంక్రాంతికి రిలీజైన క్రేజీ మూవీ ‘గుంటూరు కారం’ కన్నా ‘టిల్లు స్క్వేర్’ యుఎస్లో ఎక్కువ వసూళ్లు సాధించడం విశేషం. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ అంటే 4 మిలియన్ కేక్ వాకే అని అంచనాలు కలిగాయి. కానీ ఆ చిత్రం రెండున్నర మిలియన్ డాలర్లకు కాస్త ఎక్కువగా వసూళ్లు సాధించిందంతే. 3 మిలియన్ మార్కును కూడా అందుకోలేదు.
కానీ ‘టిల్లు స్క్వేర్’ లాంటి చిన్న సినిమా ఏకంగా 3 మిలియన్ డాలర్ల వసూళ్లు దాటేసింది. ఈ క్రమంలో పుష్ప, వాల్తేరు వీరయ్య సహా ఎన్నో పెద్ద సినిమాల యుఎస్ వసూళ్లను ‘టిల్లు స్క్వేర్’ అధిగమించడం విశేషం. ‘టిల్లు స్క్వేర్’ వరల్డ్ వైడ్ ఫుల్ రన్ వసూళ్లు రూ.130 కోట్ల దాకా ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on April 17, 2024 9:08 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…