పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ మొదలై దాదాపు నాలుగేళ్లు కావస్తోంది. కానీ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇదేమో బల్క్ డేట్లు ఇవ్వాల్సిన భారీ చిత్రం.. పవన్ కళ్యాణ్కు వేరే కమిట్మెంట్లు చాలా ఉన్నాయి. వీటి మధ్య ఈ సినిమాను పూర్తి చేయడం కష్టమవుతోంది. అందుకే రిలీజ్ లేటవుతోంది. అభిమానులు కూడా విషయం అర్థం చేసుకుని ఈ సినిమా విషయంలో మౌనం వహిస్తున్నారు.
ఐతే సైలెంటుగా వాళ్ల పనిలో వాళ్లుంటే.. రెండు నెలల కిందట నిర్మాత ఏఎం రత్నం వారిని కదిలించాడు. ‘హరిహర వీరమల్లు’కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరిగిపోతున్నాయని.. అతి త్వరలో అభిమానుల కోసం మంచి ట్రీట్ ఇవ్వబోతున్నామని ప్రకటించాడు. కానీ తర్వాతి కొన్ని వారాల్లో చప్పుడు లేదు. శివరాత్రికి పక్కాగా ఏదో విశేషాన్ని పంచుకుంటారని అనుకుంటారనుకుంటే అలాంటిదేమీ జరగలేదు.
ఐతే ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా మళ్లీ ‘హరిహర వీరమల్లు’ టీం అభిమానులను ఊరించింది. శ్రీరామనవమి శుభకాంక్షలు చెబుతూ పవన్ కళ్లను మాత్రమే చూపిస్తున్న లుక్ రిలీజ్ చేసిన టీం.. దాంతో పాటు త్వరలోనే ఓ అప్డేట్ ఉంటుందని ప్రకటించింది. ‘ధర్మం కోసం యుద్ధం’ అనే టైటిల్తో ఆ అప్డేట్ రాబోతోందని ప్రకటించింది. శ్రీరాముడు ధర్మం కోసమే యుద్ధం చేసిన నేపథ్యంలో శ్రీరామ నవమి రోజు ఈ టైటిల్తో రాబోయే టీజర్ గురించి ఊరించింది.
ఐతే ఈసారైనా చెప్పిన మాటకు కట్టుబడి త్వరలో అప్డేట్ ఇస్తారా లేక.. ఎప్పట్లాగే అభిమానులను ఊరించి ఊరించి ఉస్సూరుమనిపిస్తారా అన్నది చూడాలి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ‘హరిహర వీరమల్లు’ ఈ ఏడాది పూర్తయి రిలీజయ్యే అవకాశం లేదు. వచ్చే ఏడాది వేసవికి వస్తే రావచ్చు.
This post was last modified on April 17, 2024 8:58 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…