గత కొన్ని నెలల్లో తెలుగులో స్ట్రెయిట్ సక్సెస్ అయిన వెబ్ సిరీస్ ఏదైనా ఉందంటే అది 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ మాత్రమే. శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఎమోషనల్ డ్రామా ద్వారా దర్శకుడు ఆదిత్య హాసన్ కు చాలా పేరొచ్చింది. ఎంతగా అంటే నితిన్ స్వంత బ్యానర్ నుంచి అడ్వాన్స్ తీసుకోవడమే కాక తననే హీరోగా పెట్టి త్వరలో ఒక సినిమా మొదలుపెట్టేంత. ఇంతే కాదు సితార సంస్థ కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఆదిత్య పనితనం మెచ్చే ప్రేమలు తెలుగు డబ్బింగ్ సంభాషణల బాధ్యతని ఎస్ఎస్ కార్తికేయ కోరిమరీ ఇతనికి ఇచ్చాడు. అది బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది.
అంతా బాగానే ఉంది కానీ ఆదిత్య హాసన్ కొత్త సినిమా తాలూకు అనౌన్స్ మెంట్ హఠాత్తుగా రావడం పలువురిని ఆశ్చర్య పరిచింది. కలర్స్ స్వాతి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రమిది. అంటే సిల్వర్ స్క్రీన్ కౌంట్ ప్రకారం ఆదిత్య హాసన్ డెబ్యూ ఇదే అవుతుంది. దీని వెనుక ఆసక్తికరమైన బ్యాక్ స్టోరీ ఉంది. నెలల క్రితమే టీచర్ టైటిల్ తో ఆదిత్య హాసన్ రాసుకున్న ఈ స్క్రిప్ట్ ని తొలుత వెబ్ మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. దానికి అనుగుణంగా షూటింగ్ జరిగింది. ఇండస్ట్రీ ప్రముఖులు పలువురు చూసి కంటెంట్ బాగుందని, థియేటర్స్ కి విడుదల చేయమని సలహా ఇచ్చారు.
దీంతో స్కెచ్ మారిపోయి టీచర్ కాస్తా స్మార్ట్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ వైపు వచ్చేస్తోంది. నలుగురు టీనేజ్ కుర్రాళ్ళు ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాక జరిగే అనూహ్య పరిణామాల చుట్టూ ఆసక్తికరంగా దీన్ని మలిచినట్టు ఇన్ సైడ్ టాక్. ఎలాంటి అశ్లీలత లేకుండా క్లీన్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుందట. కళ్యాణ్ రామ్ డెవిల్ వ్యవహారంలో నానిన నవీన్ మేడారం దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడీ టీచర్ కూడా వర్కౌట్ అయితే ఆదిత్య హాసన్ రెండో మూడో సినిమాలకు మార్కెట్ తో పాటు క్రేజ్ కూడా పెరుగుతోంది. మధ్య తరగతి ఎమోషన్స్ మీద పట్టున్న ఈ కుర్ర దర్శకుడి డిమాండ్ మాములుగా లేదు.
This post was last modified on April 17, 2024 8:46 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…