గత కొన్ని నెలల్లో తెలుగులో స్ట్రెయిట్ సక్సెస్ అయిన వెబ్ సిరీస్ ఏదైనా ఉందంటే అది 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ మాత్రమే. శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఎమోషనల్ డ్రామా ద్వారా దర్శకుడు ఆదిత్య హాసన్ కు చాలా పేరొచ్చింది. ఎంతగా అంటే నితిన్ స్వంత బ్యానర్ నుంచి అడ్వాన్స్ తీసుకోవడమే కాక తననే హీరోగా పెట్టి త్వరలో ఒక సినిమా మొదలుపెట్టేంత. ఇంతే కాదు సితార సంస్థ కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఆదిత్య పనితనం మెచ్చే ప్రేమలు తెలుగు డబ్బింగ్ సంభాషణల బాధ్యతని ఎస్ఎస్ కార్తికేయ కోరిమరీ ఇతనికి ఇచ్చాడు. అది బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది.
అంతా బాగానే ఉంది కానీ ఆదిత్య హాసన్ కొత్త సినిమా తాలూకు అనౌన్స్ మెంట్ హఠాత్తుగా రావడం పలువురిని ఆశ్చర్య పరిచింది. కలర్స్ స్వాతి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రమిది. అంటే సిల్వర్ స్క్రీన్ కౌంట్ ప్రకారం ఆదిత్య హాసన్ డెబ్యూ ఇదే అవుతుంది. దీని వెనుక ఆసక్తికరమైన బ్యాక్ స్టోరీ ఉంది. నెలల క్రితమే టీచర్ టైటిల్ తో ఆదిత్య హాసన్ రాసుకున్న ఈ స్క్రిప్ట్ ని తొలుత వెబ్ మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. దానికి అనుగుణంగా షూటింగ్ జరిగింది. ఇండస్ట్రీ ప్రముఖులు పలువురు చూసి కంటెంట్ బాగుందని, థియేటర్స్ కి విడుదల చేయమని సలహా ఇచ్చారు.
దీంతో స్కెచ్ మారిపోయి టీచర్ కాస్తా స్మార్ట్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ వైపు వచ్చేస్తోంది. నలుగురు టీనేజ్ కుర్రాళ్ళు ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాక జరిగే అనూహ్య పరిణామాల చుట్టూ ఆసక్తికరంగా దీన్ని మలిచినట్టు ఇన్ సైడ్ టాక్. ఎలాంటి అశ్లీలత లేకుండా క్లీన్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుందట. కళ్యాణ్ రామ్ డెవిల్ వ్యవహారంలో నానిన నవీన్ మేడారం దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడీ టీచర్ కూడా వర్కౌట్ అయితే ఆదిత్య హాసన్ రెండో మూడో సినిమాలకు మార్కెట్ తో పాటు క్రేజ్ కూడా పెరుగుతోంది. మధ్య తరగతి ఎమోషన్స్ మీద పట్టున్న ఈ కుర్ర దర్శకుడి డిమాండ్ మాములుగా లేదు.
This post was last modified on April 17, 2024 8:46 pm
పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…
టాలీవుడ్లో ఒకప్పుడు టాప్-4 హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన హీరో.. అక్కినేని నాగార్జున. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లతో పోటాపోటీగా…
పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేశ ప్రజలు…
భారత దేశానికి శత్రుదేశాలపై యుద్ధాలు కొత్తకాదు.. ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్తకాదు. కానీ.. అందరినీ ఏకం చేయడంలోనూ.. అందరినీ ఒకే…
అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే అల్లు అర్జున్ 22 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ లాక్ చేసిన టీమ్ ప్రస్తుతం…
ఇన్నేళ్లు సమంతను ఒక కథానాయికగానే చూశాం. కానీ ఇప్పుడు ఆమెను నిర్మాతగా చూస్తున్నాం. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన తొలి చిత్రం…