బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన మూడు చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. అయినా అతడి మార్కెట్ ఏమీ పడిపోలేదు. క్రేజ్ చెక్కు చెదరలేదు. ‘సలార్’ మూవీకి ఎక్కడ లేని హైప్ వచ్చింది. ఆ సినిమా బిజినెస్ కూడా పతాక స్థాయిని అందుకుంది. ‘బాహుబలి’ని మించి బిజినెస్ ఆఫర్లు దక్కించుకుంది ఈ చిత్రం. వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా ఏమాత్రం తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల హక్కులు రూ.165 కోట్ల దాకా అమ్ముడైతే అంత పెద్ద మొత్తాన్ని కూడా రికవర్ చేసి లాభాలు కూడా అందించిందీ చిత్రం.
ఇప్పుడు ప్రభాస్ కొత్త చిత్రం ‘కల్కి’ దీన్ని మించి బిజినెస్ చేస్తోందన్నది తాజా సమాచారం. ‘కల్కి’ తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఏకంగా రూ.190 కోట్ల మార్కును టచ్ చేసిందట. అన్ని ఏరియాలకూ బిజినెస్ పూర్తయినట్లు సమాచారం.
‘కల్కి’ నైజాం ఏరియా హక్కులు రూ.75 కోట్లు పలకగా.. సీడెడ్ రైట్స్ రూ.30 కోట్లు తెచ్చిపెట్టాయట. ఆంధ్రా ప్రాంతానికి రూ.80-90 మధ్య డిస్కషన్లు నడుస్తున్నాయి. మొత్తంగా ‘కల్కి’ తెలుగు రాష్ట్రాల బిజినెస్ రూ.190 కోట్లు దాటిపోతోంది. ‘కల్కి’ ఇండియన ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న చిత్రం. అందుకు తగ్గట్లే దీని హైప్ మామూలుగా లేదు. ‘ఆదిత్య 369’ తరహా ఫాంటసీ టచ్ ఉన్న సైఫై థ్రిల్లర్ ఈ మూవీ.
ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తోంది. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 9నే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ టైంకి సినిమాను రెడీ చేయడం కష్టమే. పైగా అది ఎన్నికల టైం. అందుకే సినిమాను కనీసం నెల రోజులు వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on April 16, 2024 5:50 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…