ఒకప్పుడు టాలీవుడ్లో బిజీయెస్ట్ హీర్లో నారా రోహిత్ ఒకడు. ఒక సమయంలో అతడి సినిమాలు తొమ్మిది మేకింగ్ దశలో ఉన్నాయి. అంత బిజీగా ఉన్న వాడు కొన్నేళ్ల పాటు అసలు సినిమానే చేయకుండా సైలెంట్గా ఉండిపోయాడు. వరుస ఫ్లాపులు అతణ్ని వెనక్కి లాగేశాయి. ఈ గ్యాప్ తర్వాత ‘ప్రతినిధి-2’ చిత్రంతో అతను రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. 2014లో వచ్చిన ‘ప్రతినిధి’ మూవీకి ఇది సీక్వెల్ తరహా మూవీ.
న్యూస్ ప్రెజెంటర్ మూర్తి ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. సినిమా మొదలైనపుడు సౌండ్ చేసిన ఈ చిత్రం.. తర్వాత చాన్నాళ్ల పాటు వార్తల్లో లేకుండా పోయింది. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా సాగింది. కానీ అందరూ ఈ సినిమా గురించి మరిచిపోయిన టైంలో ఈ మధ్యే టీజర్తో పలకరించింది ‘ప్రతినిధి-2’.
టీజర్ చూస్తే విషయం ఉన్న సినిమాలాగే కనిపించింది ‘ప్రతినిధి-2’. ప్రేక్షకుల్లో మళ్లీ ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 25న ‘ప్రతినిధి-2’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇది ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మీద సెటైరిక్ ఫిలిం అన్న సంగతి తెలిసిందే. టీజర్లో లోతుగా చూపించలేదు కానీ.. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ మీద ఇందులో సెటైర్లు ఉంటాయని భావిస్తున్నారు.
వైసీపీని టార్గెట్ చేస్తూ.. టీడీపీకి సపోర్ట్ చేసేలా సినిమా ఉంటుందనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ముంగిట సినిమాను రిలీజ్ చేయడానికి టీం సిద్ధమైంది. ఏపీలో ఎన్నికలు మే 13న జరగనుండగా.. దానికి మూడు వారాల ముందు సినిమా థియేటర్లలోకి దిగబోతోంది. మరి జనాల మీద ‘ప్రతినిధి-2’ ఏమేర ప్రభావం చూపుతుందో చూడాలి.
This post was last modified on April 10, 2024 1:35 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…