Political News

ముస్లిం రిజర్వేషన్లపై పురంధేశ్వరి క్లారిటీ

ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే ముస్లింలకు వర్తిస్తున్న 4 శాతం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని, అందుకు చంద్రబాబు, పవన్ కూడా అంగీకరించారని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆల్రెడీ బీజేపీ అగ్రనేత అమిత్ షా కూడా ఈ తరహా వ్యాఖ్యలు అధికారికంగా చేయడంతో నిజంగానే పురంధేశ్వరి ఆ వ్యాఖ్యలు చేశారని చాలామంది భావించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై పురంధేశ్వరి క్లారిటీనిచ్చారు. ఆ వార్తలను నమ్మవద్దని ముస్లింలకు పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు.

‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనేది బీజేపీ నినాదమని, ముస్లిం రిజర్వేషన్లపై తాను మాట్లాడినట్టు వైరల్ అవుతున్నది ఫేక్ వార్త అని, దానిని నమ్మవద్దని కోరారు. రాజమండ్రిలో పురందేశ్వరికి లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక పెయిడ్ ఆర్టిస్టులతో వైసీపీ దుష్ప్రచారం చేయిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు.

కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తణుకులో నిర్వహించనున్న ఉమ్మడి ప్రచారంలో పురంధేశ్వరి కూడా పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. సాయంత్రం 4 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో, సాయంత్రం 7 గంటలకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించే బహిరంగసభల్లో పవన్, బాబు పాల్గొంటారు. నిడదవోలు సభలో పురంధేశ్వరి కూడా పాల్గొనే అవకాశం ఉంది.

This post was last modified on April 10, 2024 2:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago