ఈ ఏడాది ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’ పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హిట్ కావడంతో రెండో భాగం మీద అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమాకు సంబంధించి ఇంతకుముందు రిలీజ్ చేసిన పోస్టర్లు.. ఇతర ప్రోమోలు అంచనాలను పెంచాయి. దీంతో ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకుని రిలీజ్ చేయబోయే టీజర్ మీద హైప్ మామూలుగా లేదు. ఈ టీజర్ గురించి టీం ఎంతగానో ఊరించింది.
ఐతే ఈ రోజు రిలీజైన టీజర్లో జాతర సెటప్లో సాగిన విజువల్స్ వావ్ అనిపించాయి. గంగమ్మ అవతారంలో అల్లు అర్జున్ లుక్. తన మేనరిజమ్స్.. యాక్ట్స్ అన్నీ కూడా బాగున్నాయి. విజువల్గా టీజర్ విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అలా అని టీజర్ పట్ల పూర్తి సంతృప్తి కూడా వ్యక్తం కావట్లేదు.
సోషల్ మీడియా జనాల నుంచి ‘పుష్ప-2’ టీజర్ విషయంలో నిట్టూర్పులు కనిపించాయి. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పుష్ప థీమ్ను వాడుకుని ఏదో మొక్కుబడిగా బ్యాగ్రౌండ్ స్కోర్ లాగించేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా, ఎగ్జైటింగ్గా అనిపించే సౌండ్స్ ఏమీ లేవని.. ఆర్ఆర్ ఇంకా బెటర్గా ఉండాల్సిందని అంటున్నారు.
ఇక టీజర్ విషయంలో మరో విమర్శ ఏంటంటే.. చిన్న డైలాగ్ కూడా లేకుండా.. ఒకే సెటప్లో కొన్ని విజువల్స్ తీసి వదిలేయడం. దీంతో పోలిస్తే గత ఏడాది రిలీజ్ చేసిన గ్లింప్స్ క్యూరియాసిటీ పెంచిందని.. అందులో పుష్ప ఎక్కడ ఎక్కడ అని అందరూ ఉత్కంఠతో అడగడం.. చివరికి పుష్ప-పులి డైలాగ్తో ముగించడం ఆసక్తికరంగా అనిపించింది. కానీ టీజర్లో చిన్న డైలాగ్ కూడా లేకపోవడం పట్ల నిరాశ వ్యక్తమవుతోంది. కొసమెరుపులా చిన్న డైలాగ్ అయినా పెట్టి ఉండాల్సిందనే ఫీలింగ్ మెజారిటీ ప్రేక్షకుల్లో కలిగింది.
This post was last modified on April 8, 2024 10:37 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…