ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడి విడుదల తేదీ విషయంలో సందిగ్దత కొనసాగుతూనే ఉంది. ఎన్నికల నేపథ్యంలో మే 9 వద్దని డిస్ట్రిబ్యూటర్లు, సన్నిహితులు వారిస్తుండటంతో నిర్మాత అశ్విన్ దత్ పునరాలోచనలో పడిన మాట వాస్తవమే. ఇంకా ఫస్ట్ కాపీ సిద్ధం కాలేదు. వారం పైగా కీలక భాగం పెండింగ్ ఉందట. అదవ్వగానే మిగిలిన పనులు వేగవంతం చేస్తారు. అసలు సమస్య అది కాదు. ఏ నిర్ణయం తీసుకోవాలనే దాని గురించి స్వప్న, ప్రియాంక దత్ లు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఎలాంటి కంక్లూజన్ రావడం లేదట.
సెంటిమెంట్ డేట్ కాబట్టి మే 9 వదులుకోకూడదనేది దత్తు గారి సంకల్పం. కానీ పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. ఒకవేళ పోస్టు పోన్ తప్పదు అనుకుంటే ఆ మరుసటి వారం వెళ్లాలా లేక జూన్, జూలైలను లక్ష్యంగా పెట్టుకోవాలానేది పెద్ద మీమాంస. పోనీ ఆగస్ట్ కు షిఫ్ట్ అవుదామా అంటే పుష్ప 2 ది రూల్ వచ్చి తీరుతుందని మైత్రి మేకర్స్, దర్శకుడు సుకుమార్ సంకేతాలు పంపిస్తునే ఉన్నారు. సో ఆ ఛాన్స్ లేదు. సెప్టెంబర్ అంటే మరీ లేట్ అవుతుంది. అది కూడా రెండు వారాల లోపే జరగాలి. లేదంటే ఓజి, దేవర, గేమ్ ఛేంజర్ లు వరసగా షెడ్యూల్ చేసుకుని పెట్టారు.
సో ఈ అయోమయం తీరాలంటే ఇంకొద్ది రోజులు ఎదురు చూడక తప్పేలా లేదు. డిజిటల్ రైట్స్ ని మూడు వందల కోట్లకు పైగా అమ్మారనే టాక్ కూడా నిజం కాదట. ఓటిటి డీల్ కు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు ఇంకా జరగలేదని తెలిసింది. టీజర్ వచ్చాకే మాట్లాడదామని అనుకున్నట్టు సమాచారం. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ వచ్చిన ఆరు నెలల లోపే ఇంకో ప్రభాస్ సినిమా చూస్తామన్న అభిమానుల ఆనందం అంత సులభంగా నెరవేరేలా లేదు. ఏ నిర్ణయమైనా వీలైనంత త్వరగా తీసుకోవాలి. వాయిదాల విషయంలో సలార్ లాగా ఇతర ఇండియా రిలీజులకు ఇబ్బంది కలక్కుండా చూడాలి.
This post was last modified on March 29, 2024 6:09 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…