ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడి విడుదల తేదీ విషయంలో సందిగ్దత కొనసాగుతూనే ఉంది. ఎన్నికల నేపథ్యంలో మే 9 వద్దని డిస్ట్రిబ్యూటర్లు, సన్నిహితులు వారిస్తుండటంతో నిర్మాత అశ్విన్ దత్ పునరాలోచనలో పడిన మాట వాస్తవమే. ఇంకా ఫస్ట్ కాపీ సిద్ధం కాలేదు. వారం పైగా కీలక భాగం పెండింగ్ ఉందట. అదవ్వగానే మిగిలిన పనులు వేగవంతం చేస్తారు. అసలు సమస్య అది కాదు. ఏ నిర్ణయం తీసుకోవాలనే దాని గురించి స్వప్న, ప్రియాంక దత్ లు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఎలాంటి కంక్లూజన్ రావడం లేదట.
సెంటిమెంట్ డేట్ కాబట్టి మే 9 వదులుకోకూడదనేది దత్తు గారి సంకల్పం. కానీ పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. ఒకవేళ పోస్టు పోన్ తప్పదు అనుకుంటే ఆ మరుసటి వారం వెళ్లాలా లేక జూన్, జూలైలను లక్ష్యంగా పెట్టుకోవాలానేది పెద్ద మీమాంస. పోనీ ఆగస్ట్ కు షిఫ్ట్ అవుదామా అంటే పుష్ప 2 ది రూల్ వచ్చి తీరుతుందని మైత్రి మేకర్స్, దర్శకుడు సుకుమార్ సంకేతాలు పంపిస్తునే ఉన్నారు. సో ఆ ఛాన్స్ లేదు. సెప్టెంబర్ అంటే మరీ లేట్ అవుతుంది. అది కూడా రెండు వారాల లోపే జరగాలి. లేదంటే ఓజి, దేవర, గేమ్ ఛేంజర్ లు వరసగా షెడ్యూల్ చేసుకుని పెట్టారు.
సో ఈ అయోమయం తీరాలంటే ఇంకొద్ది రోజులు ఎదురు చూడక తప్పేలా లేదు. డిజిటల్ రైట్స్ ని మూడు వందల కోట్లకు పైగా అమ్మారనే టాక్ కూడా నిజం కాదట. ఓటిటి డీల్ కు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు ఇంకా జరగలేదని తెలిసింది. టీజర్ వచ్చాకే మాట్లాడదామని అనుకున్నట్టు సమాచారం. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ వచ్చిన ఆరు నెలల లోపే ఇంకో ప్రభాస్ సినిమా చూస్తామన్న అభిమానుల ఆనందం అంత సులభంగా నెరవేరేలా లేదు. ఏ నిర్ణయమైనా వీలైనంత త్వరగా తీసుకోవాలి. వాయిదాల విషయంలో సలార్ లాగా ఇతర ఇండియా రిలీజులకు ఇబ్బంది కలక్కుండా చూడాలి.
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…