ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడి విడుదల తేదీ విషయంలో సందిగ్దత కొనసాగుతూనే ఉంది. ఎన్నికల నేపథ్యంలో మే 9 వద్దని డిస్ట్రిబ్యూటర్లు, సన్నిహితులు వారిస్తుండటంతో నిర్మాత అశ్విన్ దత్ పునరాలోచనలో పడిన మాట వాస్తవమే. ఇంకా ఫస్ట్ కాపీ సిద్ధం కాలేదు. వారం పైగా కీలక భాగం పెండింగ్ ఉందట. అదవ్వగానే మిగిలిన పనులు వేగవంతం చేస్తారు. అసలు సమస్య అది కాదు. ఏ నిర్ణయం తీసుకోవాలనే దాని గురించి స్వప్న, ప్రియాంక దత్ లు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఎలాంటి కంక్లూజన్ రావడం లేదట.
సెంటిమెంట్ డేట్ కాబట్టి మే 9 వదులుకోకూడదనేది దత్తు గారి సంకల్పం. కానీ పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. ఒకవేళ పోస్టు పోన్ తప్పదు అనుకుంటే ఆ మరుసటి వారం వెళ్లాలా లేక జూన్, జూలైలను లక్ష్యంగా పెట్టుకోవాలానేది పెద్ద మీమాంస. పోనీ ఆగస్ట్ కు షిఫ్ట్ అవుదామా అంటే పుష్ప 2 ది రూల్ వచ్చి తీరుతుందని మైత్రి మేకర్స్, దర్శకుడు సుకుమార్ సంకేతాలు పంపిస్తునే ఉన్నారు. సో ఆ ఛాన్స్ లేదు. సెప్టెంబర్ అంటే మరీ లేట్ అవుతుంది. అది కూడా రెండు వారాల లోపే జరగాలి. లేదంటే ఓజి, దేవర, గేమ్ ఛేంజర్ లు వరసగా షెడ్యూల్ చేసుకుని పెట్టారు.
సో ఈ అయోమయం తీరాలంటే ఇంకొద్ది రోజులు ఎదురు చూడక తప్పేలా లేదు. డిజిటల్ రైట్స్ ని మూడు వందల కోట్లకు పైగా అమ్మారనే టాక్ కూడా నిజం కాదట. ఓటిటి డీల్ కు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు ఇంకా జరగలేదని తెలిసింది. టీజర్ వచ్చాకే మాట్లాడదామని అనుకున్నట్టు సమాచారం. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ వచ్చిన ఆరు నెలల లోపే ఇంకో ప్రభాస్ సినిమా చూస్తామన్న అభిమానుల ఆనందం అంత సులభంగా నెరవేరేలా లేదు. ఏ నిర్ణయమైనా వీలైనంత త్వరగా తీసుకోవాలి. వాయిదాల విషయంలో సలార్ లాగా ఇతర ఇండియా రిలీజులకు ఇబ్బంది కలక్కుండా చూడాలి.
This post was last modified on March 29, 2024 6:09 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…