రామ్ చరణ్, మంచు మనోజ్ మధ్య మంచి స్నేహం ఉందనేది ఇద్దరి అభిమానులకు తెలిసిన విషయమే. అయితే అది ఎంత ఘాడంగా అనేది బయట పెట్టుకున్న సందర్భాలు తక్కువ. రీ ఎంట్రీ ఇవ్వక ముందు మనోజ్ అహం బ్రహ్మాస్మికి చరణ్ గెస్టుగా రావడం ఆ ప్రాజెక్టుని జనాల దృష్టిలో పడేలా చేసింది. తర్వాత అది ఆగిపోవడం వేరే విషయం. ముందు నుంచి ఆ బాండింగ్ ఇలాగే ఉంటూ వస్తోంది. నిన్న హైదరాబాద్ లో జరిగిన చరణ్ పుట్టినరోజు వేడుకలకు గెస్టుగా వచ్చిన మనోజ్ తనకు మాత్రమే తెలిసిన ఒక ప్రత్యేక సంఘటనను ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.
2018లో ఒక తెలుగు కుటుంబం దుబాయ్ లో అనుకోని పరిస్థితుల వల్ల చిక్కుల్లో ఇరుక్కుని పాస్ పోర్ట్, వీసా చేతిలో లేక ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మనోజ్ కు కాల్ వచ్చింది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆ ఫ్యామిలీని ఆదుకోవాలంటే డబ్బు సహాయం అవసరం కావడంతో తనకు చేతనయ్యింది అప్పటికే చేసినా ఇంకో 5 లక్షలు అవసరమయ్యాయి. క్లోజ్ ఫ్రెండ్ ని అడిగాలని భావించి అర్ధరాత్రి అని చూసుకోకుండా చరణ్ కు ఫోన్ చేశాడు. విషయం విన్న చరణ్ వెంటనే అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని ఒకే నిమిషంలో సొమ్ముని పంపించడంతో బాధితులు బయట పడ్డారు.
ఇది చరణ్ గొప్పతనమని మనోజ్ చెప్పినప్పుడు కరతాళధ్వనులు మిన్నంటాయి. ఇంత ఫ్రెండ్ షిప్ వీళ్ళ మధ్య ఉందని తెలిసింది ఇప్పుడే కావడంతో అక్కడికి వచ్చిన ఇతర అతిథులు ఆశ్చర్యపోయారు. నిజానికి మంచు మనోజ్ ముందు అనుకున్న గెస్టు లిస్టులో లేడట. వేరే కమిట్ మెంట్స్ వల్ల రాలేనని చెప్పినా తర్వాత చరణ్ కోసం వచ్చినట్టు తెలిసింది. సాయి దుర్గ తేజ్ ఏవో కారణాల వల్ల హాజరు కాలేకపోయాడు. అసలు వ్యక్తి రామ్ చరణ్ లేకుండానే ఇంత ఈవెంట్ జరిపినప్పటికీ ఫ్యాన్స్ కి కావాల్సిన అప్డేట్స్, స్పీచులతో హాజరైన వాళ్ళు విజయవంతంగా పూర్తి చేశారు.
This post was last modified on March 28, 2024 12:35 pm
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…