ఫామ్ లో ఉన్న హీరో, దర్శకుడు కాంబినేషన్ అయితే బడ్జెట్ లో ఎక్కువ తక్కువలు ఎన్ని జరిగినా ఏదోలా ఫైనాన్స్ సర్దుబాటు జరిగిపోతుంది. కానీ అలా కాకుండా హిట్ చూసి ఏళ్ళు గడిచిపోయిన కాంబోకు అంత సులభంగా క్రేజ్ రాదు. గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కలయిక ఒకప్పుడు అయితే హాట్ కేకయ్యేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. నెలల క్రితమే షూటింగ్ మొదలుపెట్టినప్పటికీ పలు అవాంతరాలు ఎదురుకున్న తర్వాత నిర్మాణ సంస్థ చిత్రాలయ స్టూడియోస్ కు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అండదండలు తోడవ్వడంతో ఇవాళ్టి నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతోంది.
గత కొన్నేళ్లుగా గోపీచంద్ కు సరైన హిట్ పడలేదు. ఇటీవలే వచ్చిన భీమా సైతం నిరాశ కలిగించే ఫలితాన్ని అందుకుంది. ఎబోవ్ యావరేజ్ ఉన్నా మంచి వసూళ్లు దక్కేవి కానీ రొటీన్ కంటెంట్ ఆడియన్స్ ని నిరాశపరిచింది. ఇక శీను వైట్ల రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీ డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. మంచు విష్ణుతో ఢీ సీక్వెల్ ని ప్లాన్ చేసుకుని సెట్స్ కి వెళ్లకుండానే ఆపేశారు. స్క్రిప్ట్ సరిగా రాలేదో లేక ఇంకేదైనా కారణమో తెలియలేదు. లక్కీగా గోపిచంద్ కు కథ నచ్చడంతో ఇది పట్టాలు ఎక్కేసింది. ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వైట్ల మీద ఉంది.
ఒకప్పుడు బ్లాక్ బస్టర్లతో వెలిగిన డైరెక్టర్లు అవుట్ ఫోకస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఛాన్స్ దక్కిన దాఖలాలు తక్కువ. కానీ శ్రీను వైట్లకు దొరికింది. పూర్తిగా సద్వినియోగం చేసుకుంటానని చెబుతున్నారు. ఇది కనక బ్లాక్ బస్టర్ అయితే తన క్లాసిక్ కామెడీకి కొనసాగింపు వెంకీ 2 తీయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇది కార్యరూపం దాల్చాలంటే గోపీచంద్ తో సక్సెస్ కొట్టడం కంపల్సరీ. ఈ ఏడాదిలోనే విడుదల ప్లాన్ చేసుకున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. హాస్యం, యాక్షన్ రెండూ మేళవించి కంప్లీట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతానని వైట్ల చెబుతున్నారు.
This post was last modified on March 27, 2024 5:48 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…