మల్లువుడ్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కు సలార్ విలన్ గా తప్ప మన ప్రేక్షకుల్లో పెద్దగా గుర్తింపు లేదు. మలయాళంలో ఎంత పెద్ద స్టార్ అయినా సరే గతంలో ఈయన డబ్బింగ్ సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. వాటిలో ఆడనివే ఎక్కువ. కానీ ది గోట్ లైఫ్ ఆడు జీవితం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ ప్రమోషన్లలో పాలు పంచుకోవడం చూస్తే ఇతర భాషల్లో బలంగా చేరవేయాలన్న కమిట్ మెంట్ కనిపిస్తోంది. అడిగినవారందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఎదురైన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా విసుక్కోకుండా సమాధానమిస్తూ ఓపిగ్గా వివరాలు అందిస్తున్నాడు.
ఇతని టార్గెట్ ఒక్కటే. సంవత్సరాల తరబడి పడిన గోట్ లైఫ్ కష్టాన్ని అన్ని బాషల వాళ్ళు గుర్తించాలి. అందుకే మైత్రి సంస్థ పంపిణికి ముందుకొచ్చింది. దీనికోసమే మంజుమ్మల్ బాయ్స్ ని వారం వాయిదా వేసుకుంది. అలాంటప్పుడు పృథ్విరాజ్ అదేపనిగా హైదరాబాద్ లో ఉండి పబ్లిసిటీ చేసుకోవడం మంచిదే. ఎవరూ లేని ఎడారిలో సంవత్సరాల తరబడి ఒక మనిషి చేసే పోరాటం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ దర్శకులకు స్పెషల్ షో వేస్తే వాళ్ళతో పాటు హాజరైన పృథ్విరాజ్ ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు రావడం ఆకట్టుకుంది.
ఎల్లుండి టిల్లు స్క్వేర్ వస్తున్న నేపథ్యంలో ది గోట్ లైఫ్ ఆడు జీవితంకు టాక్ కీలకం కానుంది. 2 గంటల 56 నిమిషాల సుదీర్ఘ నిడివితో థియేటర్ కొచ్చిన ఆడియన్స్ ని మెప్పించడం సవాలే. అందులోనూ ఇంత ఎక్కువ లెన్త్ తో ఆడిన డబ్బింగ్ సినిమాలు ఈ మధ్య కాలంలో తక్కువ. కేవలం పెర్ఫార్మన్స్ పరంగానే కాకుండా ఎంగేజ్ చేసే కంటెంట్ బోలెడు ఉంటుందని, పాత్రలు తక్కువే అయినా వాటి మధ్య డెప్త్ కట్టిపడేసేలా ఉంటుందని దర్శక నిర్మాతలు హామీ ఇస్తున్నారు. నచ్చేలా ఉంటే తెలుగు జనాలకు బాషా భేదాలు ఉండవు కాబట్టి ఆడు జీవితంకి ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.
This post was last modified on March 27, 2024 3:46 pm
2014లో ఉమ్మడి ఏపీ విడిపోయి.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. ఆ తర్వాత.. కేంద్రంలో ప్రభుత్వం మారడంతో..…
స్టార్ హీరోలకు కోట్లలో అభిమానులు ఉంటారు. నిర్మాణంలో ఉన్న క్రేజీ సినిమాలకు సంబంధించిన అప్డేట్ అంటే చాలు వాళ్లకు ప్రాణం…
ఐపీఎల్లో ముంబయితో సమానంగా ఐదుసార్లు విజేతగా నిలిచిన జట్టు.. చెన్నై సూపర్ కింగ్స్. ముంబయి కంటే ఎక్కువగా ఫైనల్స్ ఆడిన,…
వైసీపీ అధినేత జగన్ తమపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం.. హైకోర్టును ఆశ్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ…
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే కొలువుల కోత మొదలుకాగా… త్వరలోనే హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పాలి. ఎందుకంటే..…
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తెరమీదికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.…