Movie News

కావాలని చేయలేదన్న ప్రశాంత్ వర్మ

ఎదురుచూసే కొద్దీ ఆలస్యమవుతున్న హనుమాన్ ఓటిటి రిలీజ్ అభిమానుల్లో అసహనం పెంచుతోంది. దాంతో పాటే వచ్చిన సంక్రాంతి సినిమాలు ఆల్రెడీ డిజిటల్ లో టాప్ ట్రెండింగ్ ఎంజాయ్ చేసి మిలియన్ వ్యూస్ సాధించుకుంటే హనుమాన్ మాత్రం అదుగో పులి ఇదిగో తోక అంటూ కాలయాపన చేస్తోందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. హక్కులు సొంతం చేసుకున్న జీ5 కమింగ్ సూన్ అనే ప్రకటన తప్ప డేట్ ని స్పష్టంగా పేర్కొనడం లేదు. దీనికి తోడు హిందీ వెర్షన్ జియో సినిమా, కలర్స్ శాటిలైట్ ఛానల్ లో రేపే ప్రీమియర్ జరుపుకోవడం ఇంకాస్త వేడిని రగులుస్తోంది.

ఇదంతా దర్శకుడు ప్రశాంత్ వర్మ దాకా చేరిపోయింది. ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కావాలని ఆలస్యం చేయడం లేదని, కొన్ని అనుకోని అవాంతరాల వల్ల లేట్ అయ్యిందే తప్ప వేరే ఉద్దేశం లేదని, త్వరలోనే శుభవార్త ఉంటుందని సింపుల్ గా శాంతపరిచే ప్రయత్నం చేశాడు. నాలుగు రోజుల క్రితం ఇతనే అతి త్వరలో ఓటిటి రిలీజని ట్వీట్ చేయడంతో ఈ వివరణ తప్పలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం హనుమాన్ ని రెగ్యులర్ సినిమా స్కోప్ వెర్షన్ లో కాకుండా ఆర్ఆర్ఆర్ తరహాలో ఫుల్ ఐమ్యాక్స్ రేషియోలో ఇవ్వాలని నిర్ణయించుకోవడం వల్ల సాంకేతికంగా జాప్యం జరుగుతోందట.

ఇది ఖరారుగా చెప్పలేదు కానీ అంతర్గతంగా వస్తున్న లీక్ అయితే ఇదే స్పష్టం చేస్తోంది. థియేట్రికల్ రన్ బాగున్నదనే ఉద్దేశంతో జీ5 ఫిబ్రవరిలోనే ప్లాన్ చేసుకున్న ఓటిటి ప్రీమియర్ ని వాయిదా వేసుకుంది. ఇప్పుడు బాక్సాఫీస్ రన్ పూర్తయిపోయింది. ఎక్కడో కొన్ని చోట్ల మినహా మిగిలిన కేంద్రాల్లో హనుమాన్ ని తీసేశారు. అలాంటప్పుడు ఇంకా వెయిట్ చేయించడం సబబు కాదు. ఒకవేళ వంద రోజుల తర్వాత స్ట్రీమింగ్ అనుకున్నారేమో  కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది తెలివైన ఎత్తుగడగా అనిపించుకోదు. సీక్వెల్ జై హనుమాన్ పనులు మొదలుపెట్టిన ప్రశాంత్ వర్మ దాని వివరాలు వెల్లడించడం లేదు. 

This post was last modified on March 15, 2024 12:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

13 minutes ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

1 hour ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

2 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

3 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

4 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

4 hours ago