కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడి నిర్మాతలు కుదేలయిపోయిన పరిస్థితులలో కూడా దిల్ రాజు ‘వి’ సినిమాపై పది కోట్ల లాభం వెనకేసుకున్నాడట. ఈ చిత్రానికి వడ్డీతో సహా అయిన పెట్టుబడి ముప్పయ్ ఆరు కోట్లయితే, డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ హక్కులతో నలభై ఆరు కోట్లు వచ్చాయట.
అంటే నికరంగా ఈ చిత్రంపై దిల్ రాజుకు పది కోట్లు మిగిలాయన్నమాట. అదే కాదు… డిజిటల్ రిలీజ్ వల్ల ప్రింట్లు, పబ్లిసిటీ ఖర్చులు మిగిలిపోయాయి. సినిమాకు మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ నష్టపోతున్నామని గగ్గోలు పెట్టే బయ్యర్ల తాకిడి లేదు.
ఇదే సినిమా థియేటర్లలో విడుదలై వుంటే బయ్యర్లకే ఎంతో కొంత తిరిగి కట్టాల్సి వచ్చేదని విశ్లేషకుల అభిప్రాయం. అలా దిల్ రాజు బాక్సాఫీస్ ఫ్లాప్ తప్పించుకోవడమే కాకుండా పది కోట్ల లాభం కూడా చవిచూసాడన్నమాట.
లాక్ డౌన్లో మంచి మంచి ఆఫర్లు అందరు నిర్మాతలకు ఇచ్చారు కానీ దిల్ రాజులా ముందుగా పెద్ద నిర్మాతలు రిస్క్ తీసుకోలేకపోయారు. మొదట్లో నిశ్శబ్ధం, ఒరేయ్ బుజ్జిగా లాంటి సినిమాలకు కూడా చాలా పెద్ద ఆఫర్లు ఇచ్చారు. అప్పట్లో తటపటాయించిన నిర్మాతలు ఇప్పుడు దీనికే రెడీ అయ్యారు. కానీ ఆల్రెడీ అప్పుడు ఆఫర్ చేసిన అమౌంట్లో డిస్కౌంట్కి సరిపెట్టుకోక తప్పలేదు.
This post was last modified on September 11, 2020 9:49 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…