కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడి నిర్మాతలు కుదేలయిపోయిన పరిస్థితులలో కూడా దిల్ రాజు ‘వి’ సినిమాపై పది కోట్ల లాభం వెనకేసుకున్నాడట. ఈ చిత్రానికి వడ్డీతో సహా అయిన పెట్టుబడి ముప్పయ్ ఆరు కోట్లయితే, డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ హక్కులతో నలభై ఆరు కోట్లు వచ్చాయట.
అంటే నికరంగా ఈ చిత్రంపై దిల్ రాజుకు పది కోట్లు మిగిలాయన్నమాట. అదే కాదు… డిజిటల్ రిలీజ్ వల్ల ప్రింట్లు, పబ్లిసిటీ ఖర్చులు మిగిలిపోయాయి. సినిమాకు మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ నష్టపోతున్నామని గగ్గోలు పెట్టే బయ్యర్ల తాకిడి లేదు.
ఇదే సినిమా థియేటర్లలో విడుదలై వుంటే బయ్యర్లకే ఎంతో కొంత తిరిగి కట్టాల్సి వచ్చేదని విశ్లేషకుల అభిప్రాయం. అలా దిల్ రాజు బాక్సాఫీస్ ఫ్లాప్ తప్పించుకోవడమే కాకుండా పది కోట్ల లాభం కూడా చవిచూసాడన్నమాట.
లాక్ డౌన్లో మంచి మంచి ఆఫర్లు అందరు నిర్మాతలకు ఇచ్చారు కానీ దిల్ రాజులా ముందుగా పెద్ద నిర్మాతలు రిస్క్ తీసుకోలేకపోయారు. మొదట్లో నిశ్శబ్ధం, ఒరేయ్ బుజ్జిగా లాంటి సినిమాలకు కూడా చాలా పెద్ద ఆఫర్లు ఇచ్చారు. అప్పట్లో తటపటాయించిన నిర్మాతలు ఇప్పుడు దీనికే రెడీ అయ్యారు. కానీ ఆల్రెడీ అప్పుడు ఆఫర్ చేసిన అమౌంట్లో డిస్కౌంట్కి సరిపెట్టుకోక తప్పలేదు.
This post was last modified on September 11, 2020 9:49 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…