విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5 విడుదలకు రెడీ అవుతోంది. ముందు సంక్రాంతి అనుకుని ఆ తర్వాత మార్చి గురించి అలోచించి చివరికి దేవర తప్పుకోవడంతో వరస సెలవులు వచ్చే సూపర్ డేట్ అందుకుంది. దానికి తగ్గట్టే నిర్మాత దిల్ రాజు టీమ్ ప్రమోషన్లను వేగవంతం చేయబోతున్నారు . మొన్న వదిలిన టీజర్ జనాల్లోకి బాగానే వెళ్ళింది. అభిమానులు ఇంకా ఎక్కువ ఆశించడంతో వాళ్ళను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోయినా ట్రైలర్ వచ్చే దాకా అప్పుడే ఒక అంచనాకు రాలేం. టైటిల్ కు తగ్గట్టే ఇందులో లవ్ కన్నా ఎక్కువ ఫ్యామిలీ అంశాలే ఉంటాయట.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకునే మృణాల్ ఠాకూర్ ఎపిసోడ్ కి ఎంత ప్రాధాన్యం ఉంటుందో అక్కగా నటిస్తున్న వాసుకి (90స్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ ఫేమ్) ట్రాక్ కూడా అంత వెయిటేజ్ తో ఉంటుందని సమాచారం. ముఖ్యంగా కథలోని ప్రధానమైన లింక్ వాసుకితో పాటు సోదరిగా మరో ముఖ్యమైన పాత్ర చేస్తున్న అభినయ చుట్టూ తిరుగుతుందట. స్టోరీని డ్రైవ్ చేసే కీలకమైన పాయింట్ దర్శకుడు పరశురామ్ వీళ్ళతోనే ముడిపెట్టాడని తెలిసింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్ టైన్మెంట్ తో నడిపించి రెండో సగంలో కీలకమైన ఎమోషన్స్ తో ఆకట్టుకుంటాడని అంటున్నారు.
ఖుషిలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ డ్రామా ఎక్కువైపోవడంతో ఆశించిన ఫలితం రాలేదని గుర్తించిన విజయ్ దేవరకొండ ఈసారి జాగ్రత్త పడినట్టే కనిపిస్తోంది. పైగా మహేష్ బాబు తరహాలో మాస్ మ్యానరిజంస్ పెట్టడం అంచనాలకు ఉపయోగపడుతోంది. సంగీత దర్శకుడు గోపి సుందర్ స్వరపరిచిన నంద నందనా పాట ఆల్రెడీ చార్ట్ బస్టర్ కావడంతో మిగిలిన వాటిని కూడా అదే స్థాయిలో ప్రమోట్ చేయబోతున్నారు. పోటీ పరంగా పెద్దగా రిస్క్ లేకుండా సోలోగా వస్తున్న ఫ్యామిలీ స్టార్ కు వారం ముందు రిలీజయ్యే టిల్లు స్క్వేర్ తప్ప చెప్పుకోదగ్గ కాంపిటీషన్ ఉండటం లేదు.
This post was last modified on March 7, 2024 7:26 pm
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…