హనుమాన్.. తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద సంచలనాల్లో ఒకటనదగ్గ సినిమా. మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ లాంటి టాప్ స్టార్ల సినిమాలతో పాటుగా రిలీజై.. ఆ మూడు సినిమాలు కలిపి సాధించిన వసూళ్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేయడం.. సంక్రాంతి చరిత్రలోనే అతి పెద్ద బ్లాక్బస్టర్గా నిలవడం అంటే మామూలు విషయం కాదు. ఎంత పెద్ద సినిమా అయినా.. ఎంత మంచి టాక్ తెచ్చుకున్నా.. మూడు వారాలకు మించి థియేటర్లలో నిలవలేకపోతున్న ఈ రోజుల్లో.. వందకు పైగా థియేటర్లలో 50 రోజులు ఆడటం అంటే ఆషామాషీ విషయం కాదు.
ఇప్పటికీ కొత్త సినిమాలకు దీటుగా ఆ చిత్రానికి వసూళ్లు వస్తూనే ఉన్నాయి. 50 రోజుల ప్రదర్శన పూర్తయిన సందర్భంగా హనుమాన్ టీం గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది. అందులో హనుమాన్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
‘హనుమాన్’కు కొనసాగింపుగా రానున్న ‘జై హనుమాన్’కు సంబంధించి అతి త్వరలో ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతున్నట్లు ప్రశాంత్ వెల్లడించాడు. ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులను కొన్ని రోజుల కిందటే అధికారికంగా మొదలుపెట్టాడు ‘జై హనుమాన్’లో హనుమంతుడి పాత్రను ఒక స్టార్ హీరో పోషిస్తాడని ప్రశాంత్ వెల్లడించిన సంగతి తెలిసిందే. మరి ఫస్ట్ లుక్లో ఆ హీరో ఎవరో వెల్లడిస్తారా అని అడిగితే.. హనుమంతులవారి ఫస్ట్ లుక్కే రిలీజ్ చేస్తామంటూ నర్మగర్భమైన సమాధానం ఇచ్చాడు ప్రశాంత్.
‘హనుమాన్’ క్లైమాక్స్లో హనుమంతుడి చుట్టూ తిరిగే సన్నివేశాలు చూసి ప్రేక్షకులు ఎంతగానో ఆస్వాదించారని.. అలాంటి సన్నివేశాలు ‘జై హనుమాన్’ అంతటా ఉంటాయని.. ఈ సినిమాకు ఇంత పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతను ‘జై హనుమాన్’ను ఇంకా బాగా తీయడం ద్వారా తీర్చుుకంటానని ప్రశాంత్ చెప్పడం విశేషం.
This post was last modified on March 2, 2024 4:41 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…