Movie News

వాలెంటైన్ చేసిన మంచి పని

వరుణ్ తేజ్ కొండంత ఆశలు పెట్టుకున్న ఆపరేషన్ వాలెంటైన్ ఇంకో నలభై ఎనిమిది గంటల లోపే రిలీజ్ కు రెడీ అవుతోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో సోని సంస్థ భాగస్వామ్యంలో నిర్మించిన ఈ భారీ చిత్రం ద్వారా మానుషీ చిల్లార్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమవుతోంది. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి అతిథిగా రావడంతో హైప్ ఇంకాస్త పెరిగింది. రెండు వారాలుగా వరుణ్ దీని ప్రమోషనే ప్రపంచంగా తిరుగుతున్నాడు. ట్రైలర్ చూశాక అంచనాలు పెరిగాయి కానీ బుకింగ్స్ ఇంకా ఊపందుకోవాలి. పబ్లిక్ టాక్ తో పాటు రివ్యూలు కీలకం కాబోతున్నాయి.

అసలు వాలెంటైన్ చేసిన మంచి పని సంగతికొస్తే ఇంత భారీ బడ్జెట్ పెట్టినా సరే ప్యాన్ ఇండియా జోలికి వెళ్లకుండా కేవలం హిందీ, తెలుగులో మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించుకోవడం. మాములుగా తమిళ, మలయాళం, కన్నడ కూడా చేయాలి. కానీ నిర్మాతలు వద్దనుకున్నారు. డబ్బింగ్ ఖర్చులే కదా ఏముందిలే అనుకోలేదు. కంటెంట్ లోని ఒరిజినల్ ఫీల్ ప్రేక్షకులకు చేరాలంటే అనువాదం చేయకూడదని డిసైడ్ చేసుకుని దానికే కట్టుబడ్డారు. గత నెల ఇదే బ్యాక్ డ్రాప్ లో వచ్చిన హృతిక్ రోషన్ ఫైటర్ సైతం డబ్బింగ్ జోలికి వెళ్లకుండా ఓన్లీ బాలీవుడ్ అనేశారు.

మార్కెట్ కోణంలో చూసుకుంటే అన్ని భాషల్లో సినిమా వదిలి వాటి డిస్ట్రిబ్యూషన్, పబ్లిసిటీ వ్యవహారాల మీద బుర్ర చెడగొట్టుకోవడం కన్నా లాభమో నష్టమో ఇలా రెండు లాంగ్వేజెస్ కు కట్టుబడటం మంచిదే. పైగా వరుణ్ కి బయట రాష్ట్రాల్లో ఇమేజ్ లేదు. ఆపరేషన్ వాలెంటైన్ బ్లాక్ బస్టర్ అయితే అప్పుడు తనకొచ్చే గుర్తింపు నెక్స్ట్ చేయబోయే సినిమాల బిజినెస్ కు ఉపయోగపడుతుంది. అప్పుడు కావాలంటే చెన్నై, బెంగళూరు వెళ్లి మరీ మీడియాని కలుసుకోవచ్చు. ముందు రోజు ప్రీమియర్ల లాంటి రిస్కులకు వెళ్లకుండా మార్చి 1 నుంచే ఆపరేషన్ వాలెంటైన్ థియేటర్లలో రాబోతున్నాడు.

This post was last modified on February 28, 2024 1:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

27 minutes ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

9 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

9 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

10 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

10 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

13 hours ago