Political News

బీజేపీ నేతలే నవ్వుకుంటున్నారా ?

రాజకీయ నేతల మాటల్లో నిజాలకన్నా అబద్ధాలే ఎక్కువుంటాయని అందరికీ తెలిసిందే. జనాలను ఆకర్షించేందుకు నోటికొచ్చిందేదో మాట్లాడేసి అప్పటికి పని పూర్తయిందనిపించుకుంటారు. ఇపుడిదంతా ఎందుకంటే కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్ మాటలగురించే. విషయం ఏమిటంటే ఏలూరులో పార్టీ మీటింగుకు రాజ్ నాథ్ హాజరయ్యారు. ఆయన ఏమన్నారంటే రాబోయే ఎన్నికల్లో ఏపీలో కూడా బీజేపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందన్నారు. ఏపీలో పార్టీ బాగా పుంజుకుని శక్తివంతంగా తయారైందని కేంద్రమంత్రి చెప్పారు. మంత్రి చెప్పిన మాటలు విన్న నేతలంతా తెగ నవ్వుకుంటున్నారట.

క్షేత్రస్ధాయిలో పార్టీ పరిస్ధితి ఒకలాగుంటే కేంద్రమంత్రి మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడటాన్ని నేతలు ఫుల్లుగా ఎంజాయ్ చేశారట. అంటే కేంద్రమంత్రి అబద్ధాలన్నా చెప్పుండాలి లేదా మంత్రికి పార్టీ పరిస్ధితిపై రాంగ్ ఫీడ్ బ్యాకన్నా ఇచ్చుండాలన్న విషయం కమలనాదులకు బాగా అర్ధమైపోయింది. వాస్తవం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావటం కాదు కదా ఒంటరిగా పోటీచేస్తే ఒక్క అభ్యర్ధికి కనీసం డిపాజిట్టు కూడా రాదు. పోయిన ఎన్నికల్లో బీజేపీకి వచ్చినే ఓట్లశాతం 0.56 శాతం. అంటే ఒక్కశాతం ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయింది.

నోటాకు వచ్చిన ఓట్లు 3 శాతం అని అందరికీ తెలిసిందే. ఇక వైజాగ్ ఎంపీగా పోటీచేసిన రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి డిపాజిట్ కూడా రాలేదు. రాబోయే ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీటవుతుందనటంలో సందేహంలేదు. కాకపోతే అయోధ్యలో రామమందిరం నిర్మాణం తర్వాత జనాల్లో బీజేపీ వైపు మొగ్గు పెరుగుతోందనే టాక్ వినబడుతోంది. అది ఎంతవరకు నిజమో ఎన్నికల ఫలితాల్లో కాని తెలీదు.

బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందన్న మంత్రి మాటలను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రీపోల్ సర్వేలన్నీ ఇదే విషయాన్ని చెబుతున్నాయి కాబట్టి. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావచ్చు కాని ఏపీలో మాత్రం పార్టీ పరిస్ధితి అధ్వాన్నంగానే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు అధ్యక్షులుగా, పార్టీ బాధ్యులుగా ఉన్న వారంతా పార్టీ ఎదుగులను నాశనం చేసేశారు. వ్యక్తిగతంగా వాళ్ళు ఎదిగి పార్టీని లేవనీయకుండా దెబ్బకొట్టేశారు. కాబట్టి రాజ్ నాథ్ సింగ్ కాదు కదా స్వయంగా నరేంద్రమోడి కూడా ఏపీలో బీజేపీని బలోపేతం చేయలేరన్నది వాస్తవం.

This post was last modified on February 28, 2024 1:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

53 minutes ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

1 hour ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

2 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

3 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

4 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

5 hours ago