ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలింది అందాల తార శ్రీదేవి. ఇప్పుడు ఆమె తనయురాలు జాన్వి కపూర్ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్న సంకేతాలు కనిపించాయి. ముందుగా హిందీ సినిమాల్లోనే అరంగేట్రం చేసి పేరు సంపాదించిన ఈ అమ్మాయి.. దేవరతో దక్షిణాది సినిమాలో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు సానా సినిమాలో నటించబోతున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
ఇటీవలే జాన్వి తండ్రి బోనీ కపూర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. చరణ్ సినిమాతో పాటు తమిళంలో సూర్యకు జోడీగానూ జాన్వి నటించబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ వార్త కాసేపటికే వైరల్ అయిపోయింది. చరణ్ సినిమాకు ఎట్టకేలకు హీరోయిన్ ఖరారైందని మెగా ఫ్యాన్స్ ఆ వార్తను సోషల్ మీడియాలో బాగా షేర్ చేశారు.
ఐతే తండ్రీ కన్ఫమ్ చేసిన విషయాన్ని జాన్వి మాత్రం ధ్రువీకరించట్లేదు. టీం అధికారికంగా చెప్పకుండా తమ కుటుంబం ఈ విషయాన్ని బయటపెట్టడం ఇష్టం లేదో ఏమో.. ఆమె తండ్రి ప్రకటనపై సమాధానం దాట వేసింది. ఇటీవల మా నాన్న నా తర్వాతి సినిమాల విషయమై నాతో సహా ఎవరినీ సంప్రదించకుండా స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఏ సినిమాల్లో నటిస్తున్నానని ఆయన చెప్పారో వాటి గురించి నేను మాట్లాడలేను.
ప్రస్తుతానికి నేను దేవర, మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఉలజ్ సినిమాల్లో నటిస్తున్నా అని జాన్వి వెల్లడించింది. తనకు దక్షిణాది సినిమాలపై ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు ఈ సందర్భంగా జాన్వి చెప్పింది. చిన్నపుడు ఇంద్ర సినిమాను టీవీలో చూడడం తనకు ఇంకా గుర్తుందని.. ఇప్పుడు సౌత్ సినిమాల్లో నటిస్తుండడంతో తన సొంతగడ్డకు తిరిగి వచ్చిన ఫీలింగ్ కలుగుతోందని ఆమె పేర్కొంది.
This post was last modified on February 23, 2024 11:45 pm
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…
తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…
ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్.. తాజాగా వైసీపీ గూటికి చేరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం…