ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలింది అందాల తార శ్రీదేవి. ఇప్పుడు ఆమె తనయురాలు జాన్వి కపూర్ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్న సంకేతాలు కనిపించాయి. ముందుగా హిందీ సినిమాల్లోనే అరంగేట్రం చేసి పేరు సంపాదించిన ఈ అమ్మాయి.. దేవరతో దక్షిణాది సినిమాలో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు సానా సినిమాలో నటించబోతున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
ఇటీవలే జాన్వి తండ్రి బోనీ కపూర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. చరణ్ సినిమాతో పాటు తమిళంలో సూర్యకు జోడీగానూ జాన్వి నటించబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ వార్త కాసేపటికే వైరల్ అయిపోయింది. చరణ్ సినిమాకు ఎట్టకేలకు హీరోయిన్ ఖరారైందని మెగా ఫ్యాన్స్ ఆ వార్తను సోషల్ మీడియాలో బాగా షేర్ చేశారు.
ఐతే తండ్రీ కన్ఫమ్ చేసిన విషయాన్ని జాన్వి మాత్రం ధ్రువీకరించట్లేదు. టీం అధికారికంగా చెప్పకుండా తమ కుటుంబం ఈ విషయాన్ని బయటపెట్టడం ఇష్టం లేదో ఏమో.. ఆమె తండ్రి ప్రకటనపై సమాధానం దాట వేసింది. ఇటీవల మా నాన్న నా తర్వాతి సినిమాల విషయమై నాతో సహా ఎవరినీ సంప్రదించకుండా స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఏ సినిమాల్లో నటిస్తున్నానని ఆయన చెప్పారో వాటి గురించి నేను మాట్లాడలేను.
ప్రస్తుతానికి నేను దేవర, మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఉలజ్ సినిమాల్లో నటిస్తున్నా అని జాన్వి వెల్లడించింది. తనకు దక్షిణాది సినిమాలపై ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు ఈ సందర్భంగా జాన్వి చెప్పింది. చిన్నపుడు ఇంద్ర సినిమాను టీవీలో చూడడం తనకు ఇంకా గుర్తుందని.. ఇప్పుడు సౌత్ సినిమాల్లో నటిస్తుండడంతో తన సొంతగడ్డకు తిరిగి వచ్చిన ఫీలింగ్ కలుగుతోందని ఆమె పేర్కొంది.
This post was last modified on February 23, 2024 11:45 pm
వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…
ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ…
వెండితెరకు చాలా గ్యాప్ తీసుకున్న సమంత త్వరలో మా ఇంటి బంగారంతో కంబ్యాక్ అవుతోంది. జీవిత భాగస్వామి రాజ్ నిడిమోరు…
ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు…
ఏ రాష్ట్రంలో అయినా... ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వాలు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవు. సహజంగా రాజకీయ వైరాన్ని కొనసాగిస్తాయి. ఏపీ సహా…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలకు…