ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలింది అందాల తార శ్రీదేవి. ఇప్పుడు ఆమె తనయురాలు జాన్వి కపూర్ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్న సంకేతాలు కనిపించాయి. ముందుగా హిందీ సినిమాల్లోనే అరంగేట్రం చేసి పేరు సంపాదించిన ఈ అమ్మాయి.. దేవరతో దక్షిణాది సినిమాలో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు సానా సినిమాలో నటించబోతున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
ఇటీవలే జాన్వి తండ్రి బోనీ కపూర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. చరణ్ సినిమాతో పాటు తమిళంలో సూర్యకు జోడీగానూ జాన్వి నటించబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ వార్త కాసేపటికే వైరల్ అయిపోయింది. చరణ్ సినిమాకు ఎట్టకేలకు హీరోయిన్ ఖరారైందని మెగా ఫ్యాన్స్ ఆ వార్తను సోషల్ మీడియాలో బాగా షేర్ చేశారు.
ఐతే తండ్రీ కన్ఫమ్ చేసిన విషయాన్ని జాన్వి మాత్రం ధ్రువీకరించట్లేదు. టీం అధికారికంగా చెప్పకుండా తమ కుటుంబం ఈ విషయాన్ని బయటపెట్టడం ఇష్టం లేదో ఏమో.. ఆమె తండ్రి ప్రకటనపై సమాధానం దాట వేసింది. ఇటీవల మా నాన్న నా తర్వాతి సినిమాల విషయమై నాతో సహా ఎవరినీ సంప్రదించకుండా స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఏ సినిమాల్లో నటిస్తున్నానని ఆయన చెప్పారో వాటి గురించి నేను మాట్లాడలేను.
ప్రస్తుతానికి నేను దేవర, మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఉలజ్ సినిమాల్లో నటిస్తున్నా అని జాన్వి వెల్లడించింది. తనకు దక్షిణాది సినిమాలపై ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు ఈ సందర్భంగా జాన్వి చెప్పింది. చిన్నపుడు ఇంద్ర సినిమాను టీవీలో చూడడం తనకు ఇంకా గుర్తుందని.. ఇప్పుడు సౌత్ సినిమాల్లో నటిస్తుండడంతో తన సొంతగడ్డకు తిరిగి వచ్చిన ఫీలింగ్ కలుగుతోందని ఆమె పేర్కొంది.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…