ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలింది అందాల తార శ్రీదేవి. ఇప్పుడు ఆమె తనయురాలు జాన్వి కపూర్ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్న సంకేతాలు కనిపించాయి. ముందుగా హిందీ సినిమాల్లోనే అరంగేట్రం చేసి పేరు సంపాదించిన ఈ అమ్మాయి.. దేవరతో దక్షిణాది సినిమాలో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు సానా సినిమాలో నటించబోతున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
ఇటీవలే జాన్వి తండ్రి బోనీ కపూర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. చరణ్ సినిమాతో పాటు తమిళంలో సూర్యకు జోడీగానూ జాన్వి నటించబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ వార్త కాసేపటికే వైరల్ అయిపోయింది. చరణ్ సినిమాకు ఎట్టకేలకు హీరోయిన్ ఖరారైందని మెగా ఫ్యాన్స్ ఆ వార్తను సోషల్ మీడియాలో బాగా షేర్ చేశారు.
ఐతే తండ్రీ కన్ఫమ్ చేసిన విషయాన్ని జాన్వి మాత్రం ధ్రువీకరించట్లేదు. టీం అధికారికంగా చెప్పకుండా తమ కుటుంబం ఈ విషయాన్ని బయటపెట్టడం ఇష్టం లేదో ఏమో.. ఆమె తండ్రి ప్రకటనపై సమాధానం దాట వేసింది. ఇటీవల మా నాన్న నా తర్వాతి సినిమాల విషయమై నాతో సహా ఎవరినీ సంప్రదించకుండా స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఏ సినిమాల్లో నటిస్తున్నానని ఆయన చెప్పారో వాటి గురించి నేను మాట్లాడలేను.
ప్రస్తుతానికి నేను దేవర, మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఉలజ్ సినిమాల్లో నటిస్తున్నా అని జాన్వి వెల్లడించింది. తనకు దక్షిణాది సినిమాలపై ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు ఈ సందర్భంగా జాన్వి చెప్పింది. చిన్నపుడు ఇంద్ర సినిమాను టీవీలో చూడడం తనకు ఇంకా గుర్తుందని.. ఇప్పుడు సౌత్ సినిమాల్లో నటిస్తుండడంతో తన సొంతగడ్డకు తిరిగి వచ్చిన ఫీలింగ్ కలుగుతోందని ఆమె పేర్కొంది.
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…
తెలుగులో రిలీజయ్యే ఏ సినిమాకైనా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఒకేసారి షోలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకట్రెండు గంటల తేడా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ పై ఓ రేంజి తరహా వ్యాఖ్యలు చేసిన…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు గుప్పించారు.…