తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నుంచి గాంజా శంకర్ టీమ్ నోటీసులు అందుకోవడం సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. టైటిల్ తో పాటు టీజర్ లో ఉన్న కంటెంట్ యువతను పెడదారి పట్టించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోందని, బాధ్యత కలిగిన ఫిలిం మేకర్స్ గా ఇలాంటివి ప్రోత్సహించకూడని బాధ్యత మీ మీద ఉందని సితార బ్యానర్ లో నిర్మాతలుగా వ్యవహరిస్తున్న వాళ్ళను ఉద్దేశించి పంపించిన నోటీసు సోషల్ మీడియాలోనూ వైరల్ టాపిక్ గా మారింది. సామజిక స్పృహ ఉండే కార్యక్రమాల్లో చురుకుగా ఉండే సాయి ధరమ్ తేజ్ హీరో కావడం ఫ్యాన్స్ కి టెన్షన్ కలిగించే విషయం.
నిజానికి బడ్జెట్ ఇష్యూస్ వల్ల గాంజా శంకర్ ఆగిపోయిందని నెల రోజుల క్రితమే టాక్ వచ్చింది. మీడియాలో ఈ వార్త ప్రముఖంగా కనిపించినా యూనిట్ స్పందించలేదు. పై పెచ్చు సంబంధం లేదన్నట్టుగా గాంజా శంకర్ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడింది. గుంటూరు కారంకి ఇంటర్వ్యూలలో నాగవంశీ ఎక్కడా ఏ టాపిక్ తేలేదు. ఇప్పుడేమో ఈ ట్విస్ట్ వచ్చి పడింది. ఒకవేళ గాంజా శంకర్ క్యాన్సిల్ చేసుకున్న మాట వాస్తవమే అయితే అదేదో ముందే చెప్పేసి టీజర్ ని యూట్యూబ్ నుంచి డిలీట్ చేసుకుని ఉంటే ఇప్పుడీ సమస్య వచ్చేది కాదు. వివరణ ఇచ్చే బాధా తప్పేది.
కానీ ఇప్పుడు ఇవ్వక తప్పదు. సంపత్ నంది దర్శకత్వంలో అనౌన్స్ చేసిన గాంజా శంకర్ లో తేజు పాత్రను ఊర మాస్ గా గాంజాతో వ్యాపారం చేసే తరహాలో డిజైన్ చేసినట్టు ముందు నుంచి టాక్ ఉంది. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ చేసిన గుడుంబా శంకర్ ని స్ఫూర్తిగా తీసుకునే ఈ టైటిల్ పెట్టినట్టు అర్థమయ్యింది. పేరున్న నిర్మాణ సంస్థలు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే హఠాత్తుగా జరిగే పరిణామాలకు జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. పూజా హెగ్డేని హీరోయిన్ గా అనుకున్నది ఈ సినిమా కోసమే. మరి టీమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి.
This post was last modified on February 18, 2024 1:12 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…