Political News

మోడీ క్లియర్ టార్గెట్ !

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లను గెలుచుకోవటమే నరేంద్రమోడీ టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. మామూలుగా అయితే ఈ టార్గెట్ సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే పార్టీకి ఉత్తరాధిలో ఉన్నంత పట్టు దక్షిణాదిలో లేదు. దక్షిణాదిలోని ఆరు రాష్ట్రాలు కర్నాటక, తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణా, పాండిచ్చేరిలో బలహీనంగా ఉంది. ఉన్నంతలో కర్నాటకలోనే గట్టిగా ఉంది. మిగిలిన ఐదు రాష్ట్రాల్లో తెలంగాణాలో పర్వాలేదన్నట్లుగా ఉంది. ఈ రెండింటిని మినహాయిస్తే బీజేపీ ఒంటరిగా ఎక్కడ పోటీ చేసినా కనీసం డిపాజిట్లు తెచ్చుకోవటం కూడా అనుమానమే.

ఈ నేపధ్యంలోనే పొత్తులపైన ప్రత్యేక దృష్టిపెట్టింది. అందుకనే ఏపీలో కూడా పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబునాయుడుతో మాట్లాడింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు సీట్లలో పోటీచేయటంపైనే ఎక్కువగా దృష్టిపెట్టిందట. టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకున్నట్లు అధికారికంగా ప్రకటన రాలేదు. కాని రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారైపోయిందనే అనుకోవాలి. అందుకనే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పది పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీచేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం.

ఏలూరు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజంపేట, రాజమండ్రి, కాకినాడ, అరకు, శ్రీకాకుళం, నంద్యాల, ఒంగోలు, నెల్లూరు లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీచేయాలని ప్రతిపాదనలు సిద్ధంచేసిందట. ఇదే జాబితాను పార్టీలోని అగ్రనేతలకు రాష్ట్రపార్టీ అందించినట్లు సమాచారం. వీటిల్లో పదిసీట్లు కాదు కూడదంటే తక్కువలో తక్కువ ఎనిమిది సీట్లలో పోటీచేయాల్సిందే అని పట్టుబడుతున్నారట. పార్లమెంటు ఎన్నికల్లో పోటీపై కమలనాదులు ఇంతగా ఎందుకు పట్టుబడుతున్నట్లు ? ఎందుకంటే గెలుపు గ్యారెంటీ అని బాగా నమ్మకంగా ఉన్నారట.

ఒంటరిగా పోటీచేస్తే ఏ నియోజకవర్గంలో కూడా డిపాజిట్లు కూడా రాదు. కాని టీడీపీ, జనసేన పొత్తు ఉంటుంది కాబట్టి ఎక్కడ పోటీచేసినా గెలుపు గ్యారెంటీ అనే ధీమా బీజేపీ నేతల్లో పెరిగిపోతోందట. అందుకనే దగ్గుబాటి పురందేశ్వరి, సుజనా చౌదరి, సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్ లాంటి నేతలు పోటీకి రెడీ అయిపోతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకన్నా లోక్ సభ సీట్లపైనే బీజేపీ అధిష్టానం ఎక్కువగా దృష్టిపెట్టిందట. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

This post was last modified on February 18, 2024 2:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

3 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

5 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

9 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

11 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

11 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

11 hours ago