బాక్సాఫీస్ వద్ద అల్ట్రా డిజాస్టర్లుగా మిగిలిన సినిమాలు టీవీలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ దక్కించుకోవడం కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. వినయ విధేయ రామ, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటివి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఇవి స్టార్ హీరోలు, పెద్ద దర్శకులు చేసినవి కాబట్టి అలాంటి స్పందన వచ్చిందనుకోవచ్చు కానీ ఆదికేశవకు అలాంటి ఆకర్షణలు లేవు. మెగా కాంపౌండ్ అయినా వైష్ణవ్ తేజ్ కు ప్రత్యేకంగా ఫాలోయింగ్ లేదు. డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్ రెడ్డి కున్న అనుభవం తక్కువే. హీరోయిన్ శ్రీలీల మాత్రమే చెప్పుకోవాల్సిన ఆట్రాక్షన్. ఇటీవలే శాటిలైట్ ప్రీమియర్ జరుపుకుంది.
అనూహ్యంగా ఆదికేశవకు అర్బన్ టిఆర్పి రేటింగ్ 10.47 రావడం చూసి టీవీ వర్గాలకు నోట మాట రాకపోవడం ఒక్కటే తక్కువ. రూరల్ ని కలుపుకుంటే యావరేజ్ గా 9.87 తెచ్చుకుంది. ఈ రెండూ పెద్ద నెంబర్లే. ఎందుకంటే గత ఎనిమిది నెలల కాలంలో పెద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచిన వాల్తేరు వీరయ్య, భగవంత్ కేసరి, దసరాకు కూడా ఇంత రాలేదు. ఆదిపురుష్ సైతం 10 టచ్ చేయలేకపోయింది. అలాంటిది దారుణమైన విమర్శలకు గురైన ఆదికేశవకు ఇంత రేటింగ్ రావడం విచిత్రం. నెట్ ఫ్లిక్స్ లో ఓటిటి స్టీమింగ్ జరుపుకున్నపుడు సైతం దీన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.
కారణం ఏంటయ్యా అంటే థియేటర్లో ఆదికేశవ చూసిన వాళ్ళు చాలా తక్కువ. మొదటి వారంకే డెఫిషిట్ పడితే కలెక్షన్లు ఎక్కడి నుంచి వస్తాయి. సితార లాంటి పెద్ద బ్యానర్ కావడంతో మంచి రిలీజ్ దక్కినప్పటికీ బ్యాడ్ కంటెంట్ తో ప్రేక్షకుల తిరస్కారానికి గురయ్యింది. కానీ బుల్లితెరపై సంచలనం రేపింది. ఈ లెక్కన భవిష్యత్తులో ఫ్లాప్ సినిమాలకే టీవీలో ఎక్కువ ఆదరణ ఉంటుందని అర్థమవుతోందిగా. ఇలా అయితే శాటిలైట్ డీల్స్ కాని ఫ్లాప్ మూవీస్ కి మంచి రేట్లు వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం. కాకపోతే కాసింత స్టార్ అట్రాక్షన్, పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటే చాలు అమ్ముడుపోతుంది.
This post was last modified on February 15, 2024 5:45 pm
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…