Movie News

ముద్దుల హీరోకి టాలీవుడ్ స్వాగతం

బాలీవుడ్ సీనియర్ హీరోలకు అక్కడ అవకాశాలు తగ్గిపోయి కొత్త కెరీర్ వైపు చూస్తున్న తరుణంలో సౌత్ ఇండస్ట్రీ వాళ్లకు కొంగు బంగారంలా మారుతోంది. సంజయ్ దత్ కెజిఎఫ్ పుణ్యమాని ఫుల్ గా సెటిలైపోతే బాబీ డియోల్ ఏకంగా పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాల్లో విలన్ గా ఛాన్స్ కొట్టేశాడు. అర్జున్ రామ్ పాల్ ఆల్రెడీ భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ ఖాతా మొదలుపెట్టాడు. వీళ్ళ కన్నా ముందు జాకీ శ్రోఫ్, సునీల్ శెట్టి ట్రై చేశారు కానీ సరైన సక్సెస్ లేక వెనుకబడ్డారు. ఇప్పుడీ లిస్టులోకి ఇమ్రాన్ హష్మీ చేరుతున్నాడు. అది కూడా రెండు క్రేజీ ప్యాన్ ఇండియా మూవీస్ తో.

ఇతని గురించి అవగాహన కలగాలంటే కొంచెం వెనక్కు వెళ్ళాలి. ఇరవై ఏళ్ళ క్రితం ఇండస్ట్రీ వచ్చిన ఇమ్రాన్ హష్మీకి 2004లో వచ్చిన రెండో సినిమా మర్డర్ పెద్ద బ్రేక్ ఇచ్చింది. మలైకా అరోరాతో కలిసి అతను పండించిన హాట్ రొమాన్స్ కుర్రకారుని పిచ్చెక్కించింది. ఇక తనుశ్రీ దత్తాతో నటించిన ఆషిక్ బనాయా ఆప్నే మాములు సెన్సేషన్ కాదు. యువతని థియేటర్ల దగ్గర బారులు తీరేలా చేసింది. ఆ తర్వాత గ్యాంగ్ స్టర్, పాగల్ పన్ లాంటి ఎన్నో చిత్రాలు అతనికి స్టార్ డం తెచ్చి పెట్టాయి. ఒకదశలో లిప్ లాక్ స్టార్ గా ప్రేక్షకులు పిలుచుకునేవారు. తర్వాత హిట్లు తగ్గి గ్యాప్ వచ్చేసింది.

పవన్ కళ్యాణ్ ఓజి, అడవి శేష్ గూఢచారి 2 రెండూ ఇమ్రాన్ హష్మీ చేతిలో ఉన్నాయి. ఇటీవలే సల్మాన్ ఖాన్ టైగర్ 3లో విలన్ గా చేశాడు కానీ అది ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అనుకున్నంతగా ఆఫర్లు క్యూ కట్టలేదు. కానీ ప్రతినాయకుడిగా ఇమ్రాన్ ఆహార్యం, స్టయిల్ గా అనిపించే బాడీ లాంగ్వేజ్ మన హీరోలకు సవాల్ విసిరేందుకు పర్ఫెక్ట్ గా సరిపోతాయి. అందుకే ఏరికోరి మరీ భారీ పారితోషికం ఇచ్చి తెచ్చుకున్నారు. ముద్దుల రేంజ్ నుంచి యాక్షన్ కు షిఫ్ట్ అయిపోయిన ఈ విలక్షణ నటుడికి ఇక్కడ కనక హిట్టు పడితే చక్కగా హైదరాబాద్ లోనే సెటిలైపోవచ్చు.

This post was last modified on February 15, 2024 5:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

1 hour ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

1 hour ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

7 hours ago