సెల్ఫీ మోజు ఓ యువకుడుని అర్ధంతరంగా బలి తీసుకుంది. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జూపార్కుకు వచ్చిన ఓ యువకుడు.. అందరితోపాటు.. జంతు ప్రదర్శన శాలలో తిరిగాడు. ఇంతలో చుట్టుపక్కల ఉన్న జంతువులతో కొన్ని సెల్ఫీలు తీసుకున్నాడు. కానీ, చిత్రంగా ఏంటంటే.. ఆ కుర్రాడు వాటితో సంతృప్తి చెందలేదు. కొంత దూరంలో ఉన్న ‘లయన్ ఎన్ క్లోజర్’లోకి వెళ్లాడు. వాస్తవానికి లయన్ ఎన్ క్లోజర్లోకి ఎవరినీ అనుమతించరు.
తాజాగా లయన్ ఎన్ క్లోజర్లోకి ఎవరు అతనిని అనుమతించారనేది తేలాల్సి ఉంది. అదేవిధంగా ఎలాంటి అనుమతి లేకుండా వెళ్లడా? అనేది తెలియాల్సి ఉంది. పోనీ.. వెళ్లిన వాడు వెళ్లినట్టుగా ఏదో ఫొటోతీసుకుని వచ్చేయాలి కదా.. కానీ, అలా కూడా చేయలేదు. సింహాన్నినిద్రలేపి మరీ దాని ముందు నిలబడి తొడగొట్టా డు. అప్పటి వరకు మాగన్నుతో ఉన్న సింహం.. ఈ చిలిపి చేష్ఠలకు..కళ్లు తెరిచింది. మళ్లీ మనోడు ఊరుకోకుండా.. మళ్లీ మళ్లీ తొడగొట్టాడు.
అంతే.. సెల్ఫీ మాటేమో కానీ.. సింహం దూసుకువచ్చింది. పెద్ద గాండ్రింపుతో మీదకు దూకింది. అక్కడే ఉన్న చెట్టేందుకు యువకుడు ప్రయత్నించిన ఫలితం కనిపించలేదు. ఒక్క పట్టు బట్టి.. కిందికి లాగేసింది. ఆ వెంటనే గొంతు పట్టుకుని చంపేసింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఏదేమైనా.. సెల్ఫీ పిచ్చి.. యువకుడి ప్రాణాలు హరించేసింది.
This post was last modified on February 15, 2024 8:53 pm
టాలీవుడ్ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి నిండా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా...…
నితిన్ కెరీర్ లోనే అతి పెద్ద బడ్జెట్ సినిమాగా చెప్పుకుంటున్న రాబిన్ హుడ్ విడుదలకు ఇంకో పది రోజులు మాత్రమే…
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్స్ లో ఒకటి కల్కి 2898 ఏడి. వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన బ్లాక్ బస్టర్…
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. కేవలం 10 నెలల కాలంలోనే ఏపీకి ఏకంగా రూ.7 లక్షల…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత కొంతకాలంగా తన తల్లి వైఎస్ విజయమ్మతో విభేదాలతో సాగుతున్న సంగతి…
పైన ఫొటోలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కలిసి కనిపిస్తున్న బుడ్డోడి పేరు నంద్యాల సిద్ధార్థ్. వయసు 14 ఏళ్లే.…