సెల్ఫీ మోజు ఓ యువకుడుని అర్ధంతరంగా బలి తీసుకుంది. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జూపార్కుకు వచ్చిన ఓ యువకుడు.. అందరితోపాటు.. జంతు ప్రదర్శన శాలలో తిరిగాడు. ఇంతలో చుట్టుపక్కల ఉన్న జంతువులతో కొన్ని సెల్ఫీలు తీసుకున్నాడు. కానీ, చిత్రంగా ఏంటంటే.. ఆ కుర్రాడు వాటితో సంతృప్తి చెందలేదు. కొంత దూరంలో ఉన్న ‘లయన్ ఎన్ క్లోజర్’లోకి వెళ్లాడు. వాస్తవానికి లయన్ ఎన్ క్లోజర్లోకి ఎవరినీ అనుమతించరు.
తాజాగా లయన్ ఎన్ క్లోజర్లోకి ఎవరు అతనిని అనుమతించారనేది తేలాల్సి ఉంది. అదేవిధంగా ఎలాంటి అనుమతి లేకుండా వెళ్లడా? అనేది తెలియాల్సి ఉంది. పోనీ.. వెళ్లిన వాడు వెళ్లినట్టుగా ఏదో ఫొటోతీసుకుని వచ్చేయాలి కదా.. కానీ, అలా కూడా చేయలేదు. సింహాన్నినిద్రలేపి మరీ దాని ముందు నిలబడి తొడగొట్టా డు. అప్పటి వరకు మాగన్నుతో ఉన్న సింహం.. ఈ చిలిపి చేష్ఠలకు..కళ్లు తెరిచింది. మళ్లీ మనోడు ఊరుకోకుండా.. మళ్లీ మళ్లీ తొడగొట్టాడు.
అంతే.. సెల్ఫీ మాటేమో కానీ.. సింహం దూసుకువచ్చింది. పెద్ద గాండ్రింపుతో మీదకు దూకింది. అక్కడే ఉన్న చెట్టేందుకు యువకుడు ప్రయత్నించిన ఫలితం కనిపించలేదు. ఒక్క పట్టు బట్టి.. కిందికి లాగేసింది. ఆ వెంటనే గొంతు పట్టుకుని చంపేసింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఏదేమైనా.. సెల్ఫీ పిచ్చి.. యువకుడి ప్రాణాలు హరించేసింది.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…