కేవలం 28 రోజుల గ్యాప్ తో సలార్ ఓటిటిలో వచ్చేయడం మూవీ లవర్స్ ని సంతోషపెట్టినా ప్రభాస్ అభిమానులను షాక్ కి గురి చేసింది. ఇంత తక్కువ నిడివిలో తమ హీరో పెద్ద ప్యాన్ ఇండియా మూవీని డిజిటల్ కి ఇచ్చేస్తే ఎలా అనే ఫిర్యాదు వాళ్ళ కామెంట్స్ లో కనిపిస్తోంది. అయితే తెలుగు, కన్నడ, తమిళ, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతున్న సలార్ హిందీలో మాత్రం ఫిబ్రవరి రెండో వారం తర్వాతే రిలీజ్ అవుతుంది. దీనికి ఎప్పుడో ఆడేసి వెళ్ళిపోయిన జైలర్, లియోలకు సంబంధం ఏంటనే పాయింట్ కు వద్దాం. వాటిలో ఒకటి ఇదే నెట్ ఫ్లిక్స్ కొన్న సంగతి తెలిసిందే.
మాములుగా స్ట్రెయిట్ అయినా డబ్బింగ్ అయినా బాలీవుడ్ సినిమాని నార్త్ మల్టీప్లెక్సుల్లో రిలీజ్ చేయాలంటే ఎనిమిది వారాల థియేట్రికల్ విండో నిబంధన తప్పనిసరి. ఆ మేరకు హిందీ పెద్దలతో సదరు కార్పొరేట్ సంస్థలు అనధికార ఒప్పందాలు చేసుకున్నాయి. విడుదల సమయంలోనే దీనికి సంబంధించిన స్పష్టత ఇస్తేనే తమ స్క్రీన్లను ఇస్తాయి. లియో, జైలర్ నిర్మాతలు దీనికి ఒప్పుకోలేదు. నాలుగు వారాలకే ఓటిటి అగ్రిమెంట్లు చేసుకుంటామని తేల్చి చెప్పాయి. దీంతో హిందీ వెర్షన్ కేవలం సింగల్ స్క్రీన్లలో రిలీజ్ కావడంతో ఉత్తరాదిలో ఆశించిన రెవిన్యూ రాక నష్టం వచ్చింది.
కానీ హోంబాలే నిర్మాతలు చాలా తెలివిగా వ్యవహరించారు. కేవలం హిందీ ఓటిటిని మీరు చెప్పినట్టు ఆపి లేట్ గా స్ట్రీమింగ్ చేయిస్తామని, మిగిలిన బాషలకు ఇది వర్తించదని ఒప్పందం చేసుకున్నారు. దీంతో సలార్ కు ఎలాంటి సమస్య రాలేదు. డంకీ పోటీ వల్ల థియేటర్లు తగ్గినా వసూళ్ల విషయంలో ఇబ్బంది పడలేదు. ఒకవేళ లియో లాగా తొందపడి ఉంటే దెబ్బ పడేది. ఇదేదో బాగుందని మిగిలిన ప్యాన్ ఇండియా నిర్మాతలు కూడా ఇదే దారిలో వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు. మొన్న నెట్ ఫ్లిక్స్ పండగ పేరుతో ప్రకటించిన సినిమాలన్నీ దాదాపు నాలుగు వారాల గ్యాప్ తో డీల్ ఫిక్స్ చేసుకున్నావేనట.
This post was last modified on January 20, 2024 12:28 pm
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా నిలవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్.. పరిశ్రమలో ఒక స్థాయి అందుకున్న దగ్గర్నుంచి తాను పని చేసే ఇండస్ట్రీలోనే…
రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…
ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…