ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ఎన్నికల యుద్ధం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ మూడు చోట్ల అభ్యర్థులు ఎవరనేది తేలిపోయింది. వైసీపీ ప్రకటించిన జాబితా ప్రకారం.. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. ఇక, టీడీపీ ఇప్పటికీ జాబితా ప్రకటించకపోయినా.. దాదాపు ఇప్పుడున్న ఇంచార్జ్లే అభ్యర్థులు కానున్నారనే అంచనాలు వున్నాయి. పైగా ఈ మూడు కూడా.. అత్యంత కీలకమైన నియోజకవర్గాలు.
మరీ ముఖ్యంగా టీడీపీకి, వైసీపీకి కూడా ప్రాణప్రదంగా మారిన నియోజకవర్గాలు. అవే.. గుడివాడ, గన్నవరం, మచిలీపట్నం. గుడివాడలో అభ్యర్థి ఎవరనేది వైసీపీ ఖరారు చేయకపోయినా.. సంప్రదాయంగా కొడాలి నానికే కేటాయించనున్నారు. ఇక, టీడీపీ కూడా ఇక్కడ అభ్యర్థి ఎవరనేది అధికారికంగా జాబితా వెల్లడించకపోయినా.. ఎన్నారై వెనిగండ్ల రాముకు ఖరారు చేసింది. తాజాగా నిర్వహించిన రా.. కదలిరా! సభను రాము ఘనంగా నిర్వహించారు.
సో.. ఈ ఇద్దరు నాయకుల మధ్య పోటీ తీవ్రంగా ఉండనుంది. సై.. అంటే సై.. అన్నట్టుగా నాయకులు తల పడనున్నారని తెలుస్తోంది. ఎవరు గెలిచినా.. స్వల్ప మెజారిటీతోనేనని ప్రాథమిక అంచనా. ఇక, మచిలీపట్నంలో వైసీపీ అభ్యర్థిగా పేర్ని కృష్ణమూర్తి..కిట్టును పార్టీ ప్రకటించింది. టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. తాజాగా చంద్రబాబు సైతం ప్రకటించారు. అధికారికంగా రావాల్సి ఉంది. దీంతో ఈ నియోజకవర్గంలోనూ ఈ ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉండనుంది. ఒకరు జూనియర్.. మరొకరు సీనియర్ కావడం గమనార్హం.
ఇక, గన్నవరం.. ఈ విషయంలో ఇరు పార్టీలూ అబ్యర్థులను ఖరారు చేయలేదు. కానీ, ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీవైసీపీ తరఫున, యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ తరఫున పోటీ చేయడం ఖాయం. దీంతో ఉమ్మడి కృష్ణాలో అత్యంత కీలకమైన ఈ మూడు నియోజకవర్గాల్లోనూ ఎన్నికల ఫైట్ దాదాపు ప్రారంభమైందనే చెప్పాలి. గుడివాడలో రా.. కదలిరా! సభతోనే ఈ మూడు నియోజకవర్గాల్లోనూ ప్రచార పర్వం ప్రారంభమైందని పార్టీ నాయకులు చెప్పడం గమనార్హం.
రా.. కదలిరా.. ! సభ వేదికగా చంద్రబాబు కూడా.. ఈ ముగ్గురు నాయకులను పరిచయం చేయడం.. వారిని గెలిపించాలని పిలుపునివ్వడం.. వంటివి టీడీపీలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇక, వైసీపీ ఇప్పటికే అభ్యర్థలు జాబితాలు తయారు చేస్తున్న దరిమిలా.. ఆ పార్టీ కూడా.. ప్రచారానికి రెడీ అవుతోంది. మొత్తంగా.. టీడీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ మూడు నియోజకవర్గాల్లోనూ సమరం స్టార్ట్ అయిందని తమ్ముళ్లు చెబుతుండడం గమనార్హం.
This post was last modified on January 20, 2024 9:09 am
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత చెలరేగిన తీవ్ర హింస పై కేంద్ర ఎన్నికల సంఘం…
https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…
కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…