బాహుబలి నుంచి ప్రభాస్ లో రొమాంటిక్ అండ్ స్వీట్ డార్లింగ్ కనిపించడం తగ్గిందని ఎదురు చూస్తున్న అభిమానులకు గొప్ప ఊరట కలిగిస్తూ మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ‘ది రాజాసాబ్’ టైటిల్ ని ఖరారు చేస్తూ అఫీషియల్ పోస్టర్ విడుదల చేశారు. ఇవాళ సాయంత్రం భీమవరంలో అతి పెద్ద డిజిటల్ కటవుట్ ని ఆవిష్కరించడం ద్వారా కొత్త ట్రెండ్ ని సెట్ చేయబోతున్నారు. లుంగీపైకి లాగి చేతులతో దాన్ని రెండు వైపులా పట్టేసుకుని ప్రభాస్ ఇచ్చిన స్మైల్ రాబోయే విజయాన్ని సూచిస్తున్నట్టే ఉందని అభిమానులు సంబరపడుతున్నారు.
ఇలాంటి లుక్ లో ప్రభాస్ ని చూసి ఎంత కాలమయ్యిందో. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఎంత బ్లాక్ బస్టర్ అయినా అందులో ఫ్యామిలీస్ కోరుకునే కూల్ రెబెల్ స్టార్ లేడు. కోపాన్ని అణుచుకున్న లావాలాగా సీరియస్ పాత్రను చేశాడు. కానీ ది రాజాసాబ్ దీనికి భిన్నంగా ఉంటుంది. హారర్ టచ్ ఉన్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ కావడంతో కథ ఎలా ఉంటుందోననే ఆసక్తి ప్రేక్షకుల్లో విపరీతంగా ఉంది. ఎందుకంటే ప్రభాస్ ఇప్పటిదాకా ఈ జానర్ టచ్ చేయలేదు. మారుతీ మార్క్ వినోదం ఉంటుంది కాబట్టి బుజ్జిగాడు టైపు వింటేజ్ కామెడీని ఎంజాయ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పలేదు కానీ షూటింగ్ చివరి దశకు వచ్చాక మాత్రమే దాని గురించి నిర్ణయం తీసుకోబోతున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ది రాజా సాబ్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. అయిదు భాషల్లో ఆడియన్స్ ని అలరించనుంది. కల్కి 2898 ఏడి మే నెలలో కన్ఫర్మ్ చేసుకుంది కాబట్టి రాజాసాబ్ డిసెంబర్ లో వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేం. లేదూ అనుకుంటే 2025 సంక్రాంతి బరిలో ఉండొచ్చు. రకరకాల క్యాలికులేషన్ల మీద ఇది ఆధారపడి ఉంది. మొత్తానికి ఆల్ ఇన్ వన్ ఫుల్ మీల్స్ తరహాలో ప్రభాస్ ని కొత్తగా చూపించబోతున్నాడు మారుతీ.
This post was last modified on January 15, 2024 9:45 am
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…