గుంటూరు కారం అంచనాల బరువుని మోసిందా లేదానేది పక్కనపెడితే వసూళ్లు బాగుండటం అభిమానులకు రిలీఫ్ ఇస్తోంది. నిర్మాతలు అధికారికంగా రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం చూస్తే రెండు రోజులకు 127 కోట్ల గ్రాస్, అది కూడా ప్యాన్ ఇండియా భాషల్లో డబ్బింగ్ కాని ఒక రీజనల్ మూవీకి చాలా భారీ మొత్తం. ఇది పూర్తిగా మహేష్ బాబు స్టామినా. ఎందుకంటే మాములుగా ఈ స్థాయిలో డివైడ్ టాక్ వచ్చినవి రెండో రోజే నెమ్మదిస్తాయి. ఎంత సంక్రాంతి అయినా సరే బాక్సాఫీస్ లెక్క తగ్గుతుంది. కానీ మహేష్ దానికి భిన్నంగా జనాన్ని రాబడుతున్నాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నాడు.
ఇక్కడ జనం టాక్ ఎలా ఉంది అనే దానికంటే హాలిడే కాబట్టి మహేష్ బాబు మరీ నిరాశ పరచడనే అభిప్రాయంలో ముందే ఉంటున్నారు. తనే నటించిన బ్రహ్మోత్సవం, త్రివిక్రమ్ తీసిన అజ్ఞాతవాసి కంటే ఎన్నో రెట్లు మెరుగ్గానే ఉందనే పాయింట్ కుటుంబ ప్రేక్షకులను వచ్చేలా చేస్తోంది. గుంటూరు కారం కన్నా హనుమాన్ వేవ్ ఎక్కువగా ఉన్న మాట అబద్దం కాదు. బుక్ మై షోలో సాక్ష్యం రూపంలో కనిపిస్తోంది. అలా అని దానితో పోల్చడం ఎంత మాత్రం సబబు కాదు. ఎందుకంటే పబ్లిక్ హనుమాన్ కి ఓటేస్తోంది తేజ సజ్జను చూసి కాదు. ఎమోషన్ తో కనెక్ట్ చేసిన డివోషనల్ కంటెంట్ వల్ల.
మొన్న దిల్ రాజు చెప్పినట్టు ఇంకో నాలుగైదు రోజులు ఆగితే గుంటూరు కారం హిట్టా లేక ఫ్లాపా తేలిపోతుంది. బ్రేక్ ఈవెన్ అవ్వడం అంత సులభంగా లేకపోయినా ఇంకో వారం పది రోజుల దాకా చెప్పుకోదగ్గ రిలీజ్ ఏది లేదు. ఒకవేళ కెప్టెన్ మిల్లర్, ఆయలాన్ డబ్బింగ్ వెర్షన్లలో ఏదో ఒకటి వచ్చినా ఇబ్బందేమీ లేదు. నా సామిరంగకు డీసెంట్ టాక్ కొనసాగితే గుంటూరు కారం రెవిన్యూలో ఇంకొంత కోత తప్పదు. సైంధవ్ తో ఎలాంటి థ్రెట్ లేదని అర్థమైపోయింది. ఏది ఏమైనా మహేష్ రేంజ్ కి ఇదో కొలమానం. టాక్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ ని ఫుల్ చేయడం అంత సులభం కాదు.
This post was last modified on January 14, 2024 6:58 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…