Movie News

కీర్తి సురేష్ థ్రిల్లర్ మూవీ నేరుగా ఓటిటిలో

 స్టార్ హీరో హీరోయిన్లు ఉన్న సినిమాను నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్ చేయడానికే ఇష్టపడతారు. కరోనా టైంలో ఓటిటి విప్లవం నడిచింది కానీ ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. జనాలు హ్యాపీగా హాళ్లకు వెళ్లి టికెట్లు కొని ఎంజాయ్ చేస్తున్నారు. అయినా సరే కొందరు ఈ యాంగిల్ లో రిస్క్ చేయడం ఇష్టం లేక మంచి ఆఫర్ వస్తే జై డిజిటల్ అంటున్నారు. కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ‘సైరెన్’ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. పొన్నియిన్ సెల్వన్ తో మనకు దగ్గరైన జయం రవి డ్యూయల్ రోల్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. కమర్షియల్ అంశాలు దట్టించారు.

ట్రైలర్ వచ్చాక క్రేజ్ కూడా బాగానే వచ్చింది. అయితే దీన్ని నేరుగా ఓటిటిలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. జనవరి 26న జీ5 వేదికగా రావొచ్చని చెన్నై టాక్. ఇటీవలే అధికారికంగా ధృవీకరించడంతో క్లారిటీ వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ ఇంకో హీరోయిన్ గా చేసింది. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకుడు. ఇందులో సముతిరఖని, యోగిబాబు తదితరులు కీలక పాత్ర పోషించారు. తెలుగు వెర్షన్ కూడా డబ్బింగ్ చేస్తున్నారు. తీరా చూస్తే ఇప్పుడీ న్యూస్ ఆశ్చర్యపరిచేదే. ఇంత క్యాస్టింగ్ పెట్టుకుని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం షాక్.

కంటెంట్ మీద నమ్మకం పూర్తిగా లేకపోవడం వల్లనో లేదా బయట జరిగే బిజినెస్ ని మించి ఓటిటి హక్కుల కోసం డీల్ రావడమో జరిగితే తప్ప ఇలా ఎవరు చేయరు. సైరెన్ లో మనకు తెలుసున్న ఆర్టిస్టులే ఎక్కువగా ఉన్నారు కాబట్టి సరైన ప్రమోషన్లు చేసుకుంటే ఇక్కడా బజ్ తెచ్చుకోవచ్చు. గత కొన్ని నెలలుగా డిజిటల్ మార్కెట్ బాగా తగ్గుముఖం పట్టింది. ఓటిటి సంస్థలు సరికొత్త కండీషన్లతో నిర్మాతలను ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఆ ప్రభావం మీడియం రేంజ్ హీరోల మార్కెట్ మీద పడుతోంది. అయినా సరే ఓటిటి రూటు పట్టడం అనూహ్యమనే చెప్పాలి. 

Satya

Recent Posts

కొత్త ‘ఈవిల్ డెడ్’ అంత భయపెట్టిందా

హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…

38 minutes ago

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…

1 hour ago

ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన అక్కర్లేదు

నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…

2 hours ago

పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…

2 hours ago

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…

2 hours ago

మళ్ళీ మౌనవ్రతం చేస్తున్న స్లమ్ డాగ్

పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా…

4 hours ago