Movie News

కీర్తి సురేష్ థ్రిల్లర్ మూవీ నేరుగా ఓటిటిలో

 స్టార్ హీరో హీరోయిన్లు ఉన్న సినిమాను నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్ చేయడానికే ఇష్టపడతారు. కరోనా టైంలో ఓటిటి విప్లవం నడిచింది కానీ ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. జనాలు హ్యాపీగా హాళ్లకు వెళ్లి టికెట్లు కొని ఎంజాయ్ చేస్తున్నారు. అయినా సరే కొందరు ఈ యాంగిల్ లో రిస్క్ చేయడం ఇష్టం లేక మంచి ఆఫర్ వస్తే జై డిజిటల్ అంటున్నారు. కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ‘సైరెన్’ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. పొన్నియిన్ సెల్వన్ తో మనకు దగ్గరైన జయం రవి డ్యూయల్ రోల్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. కమర్షియల్ అంశాలు దట్టించారు.

ట్రైలర్ వచ్చాక క్రేజ్ కూడా బాగానే వచ్చింది. అయితే దీన్ని నేరుగా ఓటిటిలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. జనవరి 26న జీ5 వేదికగా రావొచ్చని చెన్నై టాక్. ఇటీవలే అధికారికంగా ధృవీకరించడంతో క్లారిటీ వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ ఇంకో హీరోయిన్ గా చేసింది. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకుడు. ఇందులో సముతిరఖని, యోగిబాబు తదితరులు కీలక పాత్ర పోషించారు. తెలుగు వెర్షన్ కూడా డబ్బింగ్ చేస్తున్నారు. తీరా చూస్తే ఇప్పుడీ న్యూస్ ఆశ్చర్యపరిచేదే. ఇంత క్యాస్టింగ్ పెట్టుకుని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం షాక్.

కంటెంట్ మీద నమ్మకం పూర్తిగా లేకపోవడం వల్లనో లేదా బయట జరిగే బిజినెస్ ని మించి ఓటిటి హక్కుల కోసం డీల్ రావడమో జరిగితే తప్ప ఇలా ఎవరు చేయరు. సైరెన్ లో మనకు తెలుసున్న ఆర్టిస్టులే ఎక్కువగా ఉన్నారు కాబట్టి సరైన ప్రమోషన్లు చేసుకుంటే ఇక్కడా బజ్ తెచ్చుకోవచ్చు. గత కొన్ని నెలలుగా డిజిటల్ మార్కెట్ బాగా తగ్గుముఖం పట్టింది. ఓటిటి సంస్థలు సరికొత్త కండీషన్లతో నిర్మాతలను ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఆ ప్రభావం మీడియం రేంజ్ హీరోల మార్కెట్ మీద పడుతోంది. అయినా సరే ఓటిటి రూటు పట్టడం అనూహ్యమనే చెప్పాలి. 

Satya

Recent Posts

తెలంగాణ విషయంలో పవన్ కు బాబు మద్దతు

తెలంగాణ‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించదలిచిన సభకు పోలీసులు, కోర్టు అనుమతినివ్వకపోవడం రాజకీయ దుమారానికి తెర లేపిన…

6 minutes ago

లేబర్ అడ్డా అదిరిందండోయ్!

ఏదైనా భవన నిర్మాణమైనా, రోడ్డు నిర్మాణమైనా… అందుకోసం చాలా మంది కార్మికులు అవసరం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని…

8 minutes ago

ఢిల్లీ అగ్నిప్రమాదం.. విదేశీయులే ఎక్కువ.. తప్పు ఎక్కడ జరిగింది?

ఢిల్లీలోని మాళవియా నగర్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఫ్లోరిష్ స్టే అనే హోటల్‌లో ఉదయం చెలరేగిన మంటలు…

1 hour ago

వెంకీ మామ స్పీడు పెంచుతున్నారు

గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…

3 hours ago

తెలంగాణ మా జాగీరే పవన్ కల్యాణ్: కేటీఆర్

తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…

4 hours ago

మాలలో మాస్ మహారాజ… కొత్తగా ఉందే

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…

5 hours ago