Movie News

కీర్తి సురేష్ థ్రిల్లర్ మూవీ నేరుగా ఓటిటిలో

 స్టార్ హీరో హీరోయిన్లు ఉన్న సినిమాను నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్ చేయడానికే ఇష్టపడతారు. కరోనా టైంలో ఓటిటి విప్లవం నడిచింది కానీ ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. జనాలు హ్యాపీగా హాళ్లకు వెళ్లి టికెట్లు కొని ఎంజాయ్ చేస్తున్నారు. అయినా సరే కొందరు ఈ యాంగిల్ లో రిస్క్ చేయడం ఇష్టం లేక మంచి ఆఫర్ వస్తే జై డిజిటల్ అంటున్నారు. కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ‘సైరెన్’ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. పొన్నియిన్ సెల్వన్ తో మనకు దగ్గరైన జయం రవి డ్యూయల్ రోల్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. కమర్షియల్ అంశాలు దట్టించారు.

ట్రైలర్ వచ్చాక క్రేజ్ కూడా బాగానే వచ్చింది. అయితే దీన్ని నేరుగా ఓటిటిలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. జనవరి 26న జీ5 వేదికగా రావొచ్చని చెన్నై టాక్. ఇటీవలే అధికారికంగా ధృవీకరించడంతో క్లారిటీ వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ ఇంకో హీరోయిన్ గా చేసింది. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకుడు. ఇందులో సముతిరఖని, యోగిబాబు తదితరులు కీలక పాత్ర పోషించారు. తెలుగు వెర్షన్ కూడా డబ్బింగ్ చేస్తున్నారు. తీరా చూస్తే ఇప్పుడీ న్యూస్ ఆశ్చర్యపరిచేదే. ఇంత క్యాస్టింగ్ పెట్టుకుని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం షాక్.

కంటెంట్ మీద నమ్మకం పూర్తిగా లేకపోవడం వల్లనో లేదా బయట జరిగే బిజినెస్ ని మించి ఓటిటి హక్కుల కోసం డీల్ రావడమో జరిగితే తప్ప ఇలా ఎవరు చేయరు. సైరెన్ లో మనకు తెలుసున్న ఆర్టిస్టులే ఎక్కువగా ఉన్నారు కాబట్టి సరైన ప్రమోషన్లు చేసుకుంటే ఇక్కడా బజ్ తెచ్చుకోవచ్చు. గత కొన్ని నెలలుగా డిజిటల్ మార్కెట్ బాగా తగ్గుముఖం పట్టింది. ఓటిటి సంస్థలు సరికొత్త కండీషన్లతో నిర్మాతలను ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఆ ప్రభావం మీడియం రేంజ్ హీరోల మార్కెట్ మీద పడుతోంది. అయినా సరే ఓటిటి రూటు పట్టడం అనూహ్యమనే చెప్పాలి. 

This post was last modified on January 14, 2024 2:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీ కోరినట్టుగానే.. ‘వాల్తేర్’తోనే విశాఖ రైల్వే జోన్

కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…

9 minutes ago

హమ్మయ్యా… బెర్తులన్నీ సేఫ్

తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

3 hours ago

ర్యాంకులపై వైసీపీ రచ్చ..చంద్రబాబు కౌంటర్

సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…

6 hours ago

పేదల గుండెకు బాబు సర్కారు భరోసా

ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…

8 hours ago

రతన్ టాటా మిస్టరీ ట్విస్ట్.. అతని పేరు మీద 500 కోట్లు

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…

8 hours ago

“జ‌గ‌న్‌ది.. పొలిటిక‌ల్ రేప్‌.. నా మాట విను!”

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయకుడు సాకే శైల‌జానాథ్‌.. తాజాగా వైసీపీ గూటికి చేరారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం…

8 hours ago