నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతున్న పుకారుకి ఓజి టీమ్ అఫీషియల్ గా స్పందించింది. డివివి ఎంటర్ టైన్మెంట్స్ నుంచి ఈ ప్రాజెక్టు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి వెళ్లిపోయిందనే వార్త ఫ్యాన్స్ లో ఖంగారు పుట్టించింది. దీంతో ఇది నిజమో కాదో చెప్పమని కొన్ని వేల ట్వీట్లు సదరు ప్రొడక్షన్ హౌస్ ని ట్యాగ్ చేస్తూ పెట్టేశారు. బదులు వచ్చే లోపే టాపిక్ వైరల్ కావడంతో రకరకాల అనుమానాలు తలెత్తాయి. బ్రో నుంచి పవన్ తో అనుబంధం పెంచుకున్న నిర్మాత టిజి విశ్వప్రసాద్ నిజంగానే ఓజిని తీసుకున్నారేమో అనే రేంజ్ లో హడావిడి జరిగింది.
OG ఎప్పటికీ మాదేనని, కొంత ఆలస్యమైనా సరే ఆకలి తీర్చుకోవడం కోసం చీతా రావడం ఖాయమని డివివి సంస్థ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ లో ప్రకటించింది. పవన్ కళ్యాణ్ సినిమా గురించి పూర్తి క్లారిటీతో ఉన్నామని, ఎప్పుడు రావాలో సరైన సమయం చూసుకుని మిమ్మల్ని వేటాడ్డం ఖాయమని చిన్న సైజు ఎలివేషన్ ఇచ్చింది. దీంతో పుకార్ల పర్వానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే. ఎవరు పుట్టించారనేది పక్కన పెడితే ఆర్ఆర్ఆర్ లాంటి ప్యాన్ ఇండియా మూవీని నిర్మించిన డివివి దానయ్య కేవలం బడ్జెట్ కారణంగానో లేక ఇంకేదైనా రీజన్ వల్లనో పవన్ కళ్యాణ్ మూవీని వదలడం అసాధ్యమని నిన్నే మా సైట్ స్పష్టతనిచ్చింది.
ఏదైతేనేం ఫ్యాన్స్ కి ఉపశమనం దక్కింది. పవన్ ప్రస్తుతం సెట్స్ మీద పెట్టిన మూడు సినిమాల్లో ఎక్కువ అంచనాలు ఉన్నది ఓజి మీదే. హరిహర వీరమల్లు మీద బజ్ తగ్గిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ కాబట్టి వచ్చాక చూద్దాంలే అనే ధోరణిలో ఫాన్స్ ఉన్నారు. సురేందర్ రెడ్డి చేయబోయే జానర్ ఇంకా లీక్ కాలేదు కనక దాని గురించి ఇప్పుడే టెన్షన్ అనవసరం. వింటేజ్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజిలో ప్రియాంక మోహన్ హీరోయిన్ కాగా తమన్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చాక పవన్ ఎప్పుడు సెట్లోకి అడుగు పెడతాడనేది తేలుతుంది.
This post was last modified on January 8, 2024 2:44 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…