నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతున్న పుకారుకి ఓజి టీమ్ అఫీషియల్ గా స్పందించింది. డివివి ఎంటర్ టైన్మెంట్స్ నుంచి ఈ ప్రాజెక్టు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి వెళ్లిపోయిందనే వార్త ఫ్యాన్స్ లో ఖంగారు పుట్టించింది. దీంతో ఇది నిజమో కాదో చెప్పమని కొన్ని వేల ట్వీట్లు సదరు ప్రొడక్షన్ హౌస్ ని ట్యాగ్ చేస్తూ పెట్టేశారు. బదులు వచ్చే లోపే టాపిక్ వైరల్ కావడంతో రకరకాల అనుమానాలు తలెత్తాయి. బ్రో నుంచి పవన్ తో అనుబంధం పెంచుకున్న నిర్మాత టిజి విశ్వప్రసాద్ నిజంగానే ఓజిని తీసుకున్నారేమో అనే రేంజ్ లో హడావిడి జరిగింది.
OG ఎప్పటికీ మాదేనని, కొంత ఆలస్యమైనా సరే ఆకలి తీర్చుకోవడం కోసం చీతా రావడం ఖాయమని డివివి సంస్థ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ లో ప్రకటించింది. పవన్ కళ్యాణ్ సినిమా గురించి పూర్తి క్లారిటీతో ఉన్నామని, ఎప్పుడు రావాలో సరైన సమయం చూసుకుని మిమ్మల్ని వేటాడ్డం ఖాయమని చిన్న సైజు ఎలివేషన్ ఇచ్చింది. దీంతో పుకార్ల పర్వానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే. ఎవరు పుట్టించారనేది పక్కన పెడితే ఆర్ఆర్ఆర్ లాంటి ప్యాన్ ఇండియా మూవీని నిర్మించిన డివివి దానయ్య కేవలం బడ్జెట్ కారణంగానో లేక ఇంకేదైనా రీజన్ వల్లనో పవన్ కళ్యాణ్ మూవీని వదలడం అసాధ్యమని నిన్నే మా సైట్ స్పష్టతనిచ్చింది.
ఏదైతేనేం ఫ్యాన్స్ కి ఉపశమనం దక్కింది. పవన్ ప్రస్తుతం సెట్స్ మీద పెట్టిన మూడు సినిమాల్లో ఎక్కువ అంచనాలు ఉన్నది ఓజి మీదే. హరిహర వీరమల్లు మీద బజ్ తగ్గిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ కాబట్టి వచ్చాక చూద్దాంలే అనే ధోరణిలో ఫాన్స్ ఉన్నారు. సురేందర్ రెడ్డి చేయబోయే జానర్ ఇంకా లీక్ కాలేదు కనక దాని గురించి ఇప్పుడే టెన్షన్ అనవసరం. వింటేజ్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజిలో ప్రియాంక మోహన్ హీరోయిన్ కాగా తమన్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చాక పవన్ ఎప్పుడు సెట్లోకి అడుగు పెడతాడనేది తేలుతుంది.
This post was last modified on January 8, 2024 2:44 pm
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…