నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతున్న పుకారుకి ఓజి టీమ్ అఫీషియల్ గా స్పందించింది. డివివి ఎంటర్ టైన్మెంట్స్ నుంచి ఈ ప్రాజెక్టు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి వెళ్లిపోయిందనే వార్త ఫ్యాన్స్ లో ఖంగారు పుట్టించింది. దీంతో ఇది నిజమో కాదో చెప్పమని కొన్ని వేల ట్వీట్లు సదరు ప్రొడక్షన్ హౌస్ ని ట్యాగ్ చేస్తూ పెట్టేశారు. బదులు వచ్చే లోపే టాపిక్ వైరల్ కావడంతో రకరకాల అనుమానాలు తలెత్తాయి. బ్రో నుంచి పవన్ తో అనుబంధం పెంచుకున్న నిర్మాత టిజి విశ్వప్రసాద్ నిజంగానే ఓజిని తీసుకున్నారేమో అనే రేంజ్ లో హడావిడి జరిగింది.
OG ఎప్పటికీ మాదేనని, కొంత ఆలస్యమైనా సరే ఆకలి తీర్చుకోవడం కోసం చీతా రావడం ఖాయమని డివివి సంస్థ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ లో ప్రకటించింది. పవన్ కళ్యాణ్ సినిమా గురించి పూర్తి క్లారిటీతో ఉన్నామని, ఎప్పుడు రావాలో సరైన సమయం చూసుకుని మిమ్మల్ని వేటాడ్డం ఖాయమని చిన్న సైజు ఎలివేషన్ ఇచ్చింది. దీంతో పుకార్ల పర్వానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే. ఎవరు పుట్టించారనేది పక్కన పెడితే ఆర్ఆర్ఆర్ లాంటి ప్యాన్ ఇండియా మూవీని నిర్మించిన డివివి దానయ్య కేవలం బడ్జెట్ కారణంగానో లేక ఇంకేదైనా రీజన్ వల్లనో పవన్ కళ్యాణ్ మూవీని వదలడం అసాధ్యమని నిన్నే మా సైట్ స్పష్టతనిచ్చింది.
ఏదైతేనేం ఫ్యాన్స్ కి ఉపశమనం దక్కింది. పవన్ ప్రస్తుతం సెట్స్ మీద పెట్టిన మూడు సినిమాల్లో ఎక్కువ అంచనాలు ఉన్నది ఓజి మీదే. హరిహర వీరమల్లు మీద బజ్ తగ్గిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ కాబట్టి వచ్చాక చూద్దాంలే అనే ధోరణిలో ఫాన్స్ ఉన్నారు. సురేందర్ రెడ్డి చేయబోయే జానర్ ఇంకా లీక్ కాలేదు కనక దాని గురించి ఇప్పుడే టెన్షన్ అనవసరం. వింటేజ్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజిలో ప్రియాంక మోహన్ హీరోయిన్ కాగా తమన్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చాక పవన్ ఎప్పుడు సెట్లోకి అడుగు పెడతాడనేది తేలుతుంది.
This post was last modified on January 8, 2024 2:44 pm
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…