నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతున్న పుకారుకి ఓజి టీమ్ అఫీషియల్ గా స్పందించింది. డివివి ఎంటర్ టైన్మెంట్స్ నుంచి ఈ ప్రాజెక్టు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి వెళ్లిపోయిందనే వార్త ఫ్యాన్స్ లో ఖంగారు పుట్టించింది. దీంతో ఇది నిజమో కాదో చెప్పమని కొన్ని వేల ట్వీట్లు సదరు ప్రొడక్షన్ హౌస్ ని ట్యాగ్ చేస్తూ పెట్టేశారు. బదులు వచ్చే లోపే టాపిక్ వైరల్ కావడంతో రకరకాల అనుమానాలు తలెత్తాయి. బ్రో నుంచి పవన్ తో అనుబంధం పెంచుకున్న నిర్మాత టిజి విశ్వప్రసాద్ నిజంగానే ఓజిని తీసుకున్నారేమో అనే రేంజ్ లో హడావిడి జరిగింది.
OG ఎప్పటికీ మాదేనని, కొంత ఆలస్యమైనా సరే ఆకలి తీర్చుకోవడం కోసం చీతా రావడం ఖాయమని డివివి సంస్థ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ లో ప్రకటించింది. పవన్ కళ్యాణ్ సినిమా గురించి పూర్తి క్లారిటీతో ఉన్నామని, ఎప్పుడు రావాలో సరైన సమయం చూసుకుని మిమ్మల్ని వేటాడ్డం ఖాయమని చిన్న సైజు ఎలివేషన్ ఇచ్చింది. దీంతో పుకార్ల పర్వానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే. ఎవరు పుట్టించారనేది పక్కన పెడితే ఆర్ఆర్ఆర్ లాంటి ప్యాన్ ఇండియా మూవీని నిర్మించిన డివివి దానయ్య కేవలం బడ్జెట్ కారణంగానో లేక ఇంకేదైనా రీజన్ వల్లనో పవన్ కళ్యాణ్ మూవీని వదలడం అసాధ్యమని నిన్నే మా సైట్ స్పష్టతనిచ్చింది.
ఏదైతేనేం ఫ్యాన్స్ కి ఉపశమనం దక్కింది. పవన్ ప్రస్తుతం సెట్స్ మీద పెట్టిన మూడు సినిమాల్లో ఎక్కువ అంచనాలు ఉన్నది ఓజి మీదే. హరిహర వీరమల్లు మీద బజ్ తగ్గిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ కాబట్టి వచ్చాక చూద్దాంలే అనే ధోరణిలో ఫాన్స్ ఉన్నారు. సురేందర్ రెడ్డి చేయబోయే జానర్ ఇంకా లీక్ కాలేదు కనక దాని గురించి ఇప్పుడే టెన్షన్ అనవసరం. వింటేజ్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజిలో ప్రియాంక మోహన్ హీరోయిన్ కాగా తమన్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చాక పవన్ ఎప్పుడు సెట్లోకి అడుగు పెడతాడనేది తేలుతుంది.
This post was last modified on January 8, 2024 2:44 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…