త్రివిక్రమ్ అంచనాలు అందుకున్నట్టేనా

నిన్న రాత్రి విడుదలైన గుంటూరు కారం ట్రైలర్ పన్నెండు గంటలు దాటేలోగానే 25 మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ నెంబర్ వన్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. విపరీతమైన జాప్యం మధ్య మధ్యాన్నం నాలుగు గంటల నుంచి ఎదురు చూస్తున్న అభిమానులకు రాత్రి తొమ్మిదికి వదిలి ఫుల్ మీల్స్ అనిపించేలా ఉపశమనం కలిగించారు. ఫ్యాన్స్ కోణంలో తమ హీరో స్క్రీన్ ప్రెజెన్స్, ఊర మాస్ మ్యానరిజం, చాలా ఏళ్లుగా మిస్ అవుతున్న పోకిరి టైపు వింటేజ్ ఎలివేషన్ ఇవన్నీ సంతృప్తినిచ్చాయి. అయితే సగటు ప్రేక్షకులకు ఏమనిపించిందనే అభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

వీలైనంత కథను ఎక్కువ రివీల్ చేయకుండా త్రివిక్రమ్ తీసుకున్న జాగ్రత్త వల్ల ఆ కార్యమైతే నెరవేరింది కానీ కేవలం ట్రైలర్ చూసిన వెంటనే ఎక్స్ ట్రాడినరీ అనిపించియే మేజిక్ చేయలేకపోయారని కొందరు నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. ఎంతసేపూ మహేష్ బాబు డైలాగు టైమింగ్ ని హైలైట్ చేయడం తప్పించి సినిమాలో ఇతర అంశాలను చూపించలేదని వాళ్ళ కంప్లయింట్. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం స్పెషల్ గా అనిపించలేదని ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. అఖండ రేంజ్ లో ఆశిస్తే సర్కారు వారి పాట కన్నా కాస్త మెరుగ్గా ఇచ్చారని మ్యూజిక్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.

సో మాస్ వర్గాలకు నచ్చే విధంగా ట్రైలర్ పాసయ్యింది కానీ ఇక మాట్లాడాల్సింది సినిమానే. అత్యథిక థియేటర్లలో జనవరి 12 రమణ చేయబోయే జాతర కోసం ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. జనవరి 9 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెడతారు. సలార్ కి ఇచ్చిన పెంపునే దీనికి ఇస్తారని తెలంగాణ టాక్. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గరిష్టంగా నలభై రూపాయల కంటే హైక్ ఉండకపోవచ్చు. గుంటూరు కారం కన్నా మూడింతలు ఎక్కువ బడ్జెట్ తో తీసిన సలార్ కి అంతే ఇచ్చారు. మహేష్ బాబు ఓపెనింగ్స్ కి ట్రైలర్ టాక్ తో పని లేదు కానీ కొన్ని షోలు పడ్డాక ముందుకు తీసుకెళ్లేది మాత్రం సినిమా కంటెంటే.