సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నందుకు ఈగల్ కు సోలో డేట్ వచ్చేలా చూస్తామని ఫిలిం ఛాంబర్ పెద్దలు నిర్మాత టిజి విశ్వప్రసాద్, హీరో రవితేజకిచ్చిన మాటని నిలబెట్టుకోవడం మీద అనుమానాలు మొదలైపోయాయి. టిల్లు స్క్వేర్ ని తప్పించారు కానీ కథ అక్కడితో అయిపోలేదు. ఊరి పేరు భైరవకోన ఫిబ్రవరి 9 రిలీజ్ ప్రకటించి వారాలు గడిచాయి. మార్పు విషయంలో అనిల్ సుంకరని సంప్రదించలేదనే టాక్ ఆల్రెడీ మొదలైపోయింది. ఇంకో వైపు ఒక రోజు ముందే ఫిబ్రవరి 8కి షెడ్యూల్ చేసుకున్న యాత్ర 2 సైతం వెనుకడుగు వేసేందుకు ససేమిరా అంటోందని సమాచారం.
మార్కెట్, బ్రాండ్ ఇమేజ్ పరంగా ఈ రెండూ ఈగల్ కు సరిసమానం కాకపోయినా చెప్పుకోదగ్గ పోటీనే ఇస్తాయి. భైరవకోన, యాత్ర 2లకు బలమైన డిస్ట్రిబ్యూషన్ బ్యాకప్ ఉంది. థియేటర్లు దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకుంటారు. సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ, హనుమాన్ లలో ఏవైనా బ్లాక్ బస్టర్ అయితే ఎంతలేదన్నా నెల రోజుల రన్ ఉంటుంది. అలాంటప్పుడు వాటికి ఉన్న మెయిన్ స్క్రీన్లను అలాగే అట్టిపెట్టుకుంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆ స్లాట్ లో ఉన్న ఇతర ప్రొడ్యూసర్లతో సంప్రదించి ఆ తర్వాత నిర్ణయం వెలువరించాలి.
మరి ఈగల్ కు ఓపెన్ గ్రౌండ్ వదిలేందుకు మిగిలిన ఇద్దరు నిర్మాతలు ఒప్పుకుంటారా లేదానేది వేచి చూడాలి. ప్రస్తుతానికి వాటి వాయిదా సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా పరిచయమవుతోంది. వీలైనంత వేగంగా రీజనబుల్ బడ్జెట్ లో పూర్తి చేసేలా దర్శకుడు హరీష్ శంకర్ పక్కా ప్లానింగ్ తో చిత్రీకరణ చేస్తున్నారు. ఈగల్ ప్రమోషన్ల కోసం తిరిగి జనవరి చివరి వారం రవితేజ అందుబాటులోకి రానున్నాడు. ఫ్యాన్స్ అంచనాలైతే భారీగా ఉన్నాయి.
This post was last modified on January 6, 2024 10:48 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…