విడుదలకు ముందు సలార్ ని టార్గెట్ చేసుకుని కన్నడ స్టార్ హీరో దర్శన్ చేసిన కామెంట్లు ఆ టైంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కేవలం వారం గ్యాప్ లో 29న తన కొత్త సినిమా ‘కాటేరా’ విడుదల చేయడం పట్ల మీడియా అడిగిన ప్రశ్నలకు అసహనం వ్యక్తం చేస్తూ నేనెవరికీ భయపడనని, బయటి వాళ్లొస్తే నాకేంటని చెప్పడం వైరలయ్యింది. అంచనాలకు తగ్గట్టుగానే కాటేరా కర్ణాటకలో బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తోంది. రవితేజ ‘పవర్’ లాంటి హిట్ మూవీస్ తీసిన రాక్ లైన్ వెంకటేష్ దీనికి నిర్మాత. వారం తిరక్కుండానే వంద కోట్ల గ్రాస్ ఖాయమని బెంగళూరు మీడియా నొక్కి చెబుతోంది.
ఏకంగా కాంతార స్థాయిలో దీన్ని మోసేస్తున్నారు. కథేంటంటే కొలిమి పని చేసే హీరోకి తన గ్రామంలో ఎదురయ్యే పరిస్థితులు, ఊరి దొరల అహంకారానికి ఎదురొడ్డి ఏకంగా యావజ్జీవ శిక్ష పడే స్థాయిలో హత్యలు చేయడం దాకా కమర్షియల్ అంశాలు మిస్ చేయకుండా దర్శకుడు తరుణ్ సుధీర్ తీర్చిదిద్దిన విధానం ఆడియన్స్ ని మెప్పించింది. 90 దశకంలో మనకు బాగా సుపరిచితురాలైన సీనియర్ హిరోయిన్ మాలాశ్రీ కూతురు ఆరాధనా రామ్ దీని ద్వారా డెబ్యూ చేసింది. 1960 నేపథ్యంలో మొదలుపెట్టి 1987లో కాటేరా జైలు నుంచి బయటికి వచ్చే దాకా క్రమాన్ని పేర్చుకుంటూ పోయారు.
ఒకరకంగా చెప్పాలంటే ‘రంగస్థలం’ స్ఫూర్తి ఇందులో చాలా కనిపిస్తుంది. అచ్చం రంగమ్మ మంగమ్మ టైపులో ఒక పాట పెట్టారు. హీరోయిన్ చనిపోయే ఎపిసోడ్ ని నరేష్ అంత్యక్రియల తరహాలో డిజైన్ చేశారు. ఒక ఫైట్ రామ్ చరణ్ అజయ్ ఘోష్ ని చితకబాదే రేంజ్ లో పెట్టారు. ఇలా రెఫరెన్సులు చాలానే ఉన్నాయి. ఏదైతేనేం హౌస్ ఫుల్ బోర్డులతో కాటేరా పెర్ఫార్మన్స్ బాగానే ఉంది. దీని ప్రస్తావన మనకెందుకంటే త్వరలోనే తమిళ, తెలుగు భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. ముందు కన్నడలో ఆడితే చాలనుకున్న నిర్మాత ఇప్పుడు పక్క లాంగ్వేజెస్ లోనూ అనువదించబోతున్నారు.
This post was last modified on January 3, 2024 12:02 am
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…