ఈ మధ్య సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో కొత్త ట్రెండు నడుస్తోంది. సినిమాలకు ప్రి రిలీజ్ ఈవెంట్లు ఇతర ప్రమోషన్ ఈవెంట్లు పెద్దగా ఏమీ చేయకుండానే రిలీజ్ చేసేస్తున్నారు. అయినా సరే ఆ సినిమాలకు మంచి ఫలితాలు వస్తున్నాయి. కేజీఎఫ్, లియో లాంటి సినిమాల తర్వాత ప్రభాస్ మూవీ సలార్ కు కూడా ఇలాగే చేశారు. సలార్ కు మినిమం ప్రమోషన్లు కూడా చేయలేదు. అయినా తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాకు బంపర్ క్రేజ్ వచ్చింది. భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది.
మిగతా చోట్ల కూడా ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి కానీ, ఓవరాల్ వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ముఖ్యంగా ఈ సినిమాకు ఉన్న స్టామినా ప్రకారం హిందీ వర్షన్ ఈపాటికి 300 కోట్ల మార్కును అందుకుని ఉండాలి. ఉత్తరాదిన మాస్ లో ప్రభాస్ కు, అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ కు మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సాహో డివైడ్ టాక్ తోనే భారీ కలెక్షన్లు రాబట్టింది.
ఇక ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ రెండు భాగాలతో ఎలాంటి వసూళ్ల మోత మోగించాడో తెలిసిందే. ఇలాంటి కాంబినేషన్లో వచ్చిన మాస్- యాక్షన్ మూవీ ఈజీగా 300-400 కోట్ల వసూళ్లు రాబట్టాలి. కానీ సలార్ అక్కడ ఇప్పటిదాకా 150 కోట్ల మేర మాత్రమే కలెక్షన్లు తెచ్చుకుంది. షారుఖ్ ఖాన్ మూవీ డంకీతో పోటీ పడడం మైనస్సే అయినప్పటికీ.. సలార్ స్టామినా తక్కువేమీ కాదు. డంకీకి నార్త్ ఇండియాలో ప్రమోషన్లు ఒక రేంజ్ లో జరిగాయి.
ఎక్కువ సంఖ్యలో, మంచి మంచి థియేటర్లు పడ్డాయి. ఈ విషయంలో సలార్ కు అన్యాయం జరిగిన మాట వాస్తవం. అయితే సినిమాను ఉత్తరాదిన ప్రభాస్ ఏమాత్రం ప్రమోట్ చేయకపోవడం, రిలీజ్ వ్యవహారాలు దగ్గరుండి చూసుకోకపోవడం మైనస్ అయింది. ప్రభాస్ గత మూడు చిత్రాలకు దక్కిన బ్యాకప్ ఈ సినిమాకు ఉత్తరాదిన దక్కలేదు సంగీతం. మొత్తంగా కారణాలు ఏవైనాప్పటికీ సలార్ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యింది అన్నది మాత్రం నిజం.
This post was last modified on January 2, 2024 11:48 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…