సీనియారిటీ ఎంత ఉన్నా డిమాండ్ తగ్గని హీరోయిన్లలో త్రిష, సమంతాలు ముందు వరసలో ఉన్నారు. దశాబ్దం దాటినా సరే అవకాశాలు క్యూ కడుతూనే ఉన్నాయి. ఈ ఇద్దరికీ సంబంధించిన ఒక బాలీవుడ్ టాక్ ఆసక్తికరంగా ఉంది. సల్మాన్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ తో నిర్మాత కరణ్ జోహార్ భారీ ఎత్తున్న ‘ది బుల్’ అనే ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఓ రెండు మూడు రోజుల్లో రానుంది. 2025 రంజాన్ పండగని లక్ష్యంగా పెట్టుకుని షూటింగ్ చేయబోతున్నారు. హీరోయిన్ కసరత్తే ఇంకా పూర్తవ్వలేదు.
ముందుగా కండల వీరుడికి జోడిగా త్రిషను అనుకున్నారు. కానీ ఆమె అజిత్ కొత్త చిత్రంతో పాటు చిరంజీవి విశ్వంభరకు కమిట్ మెంట్ ఇచ్చేసింది. డేట్లు అంత సులభంగా దొరికేలా లేవు. దీంతో ఇష్టం లేకపోయినా ది బుల్ ని వదులుకున్నట్టు సమాచారం. ఆ స్థానంలో సమంతాని తీసుకునే ప్రతిపాదన జోరుగా సాగుతోందని తెలిసింది. శాకుంతలం డిజాస్టర్, ఖుషి ఎబోవ్ యావరేజ్ ఫలితాలు వచ్చాక చికిత్స కోసం కెరీర్ కు బ్రేక్ తీసుకున్న సామ్ త్వరలో కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ ప్రమోషన్లతో మొదలుపెట్టి మెల్లగా కథలు వింటుంది.
సామ్ ది బుల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని అంటున్నారు. సల్మాన్ ఖాన్ అభిమానుల ఆశలన్నీ బుల్ మీదే ఉన్నాయి. కిసీకా భాయ్ కిసీకా జాన్ దారుణంగా డిజాస్టర్ కావడం, టైగర్ 3కి వసూళ్లు వచ్చినా యష్ రాజ్ ఫిలిమ్స్ తీసిన స్పై మూవీస్ లో తక్కువ రెస్పాన్స్ రావడం వాళ్ళను కలవరంలో ముంచెత్తింది. ది బుల్ లో సల్మాన్ చాలా షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఆర్మీ ఆఫీసర్ గా దేశం కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు తెగించే పాత్రలో ఇంటెన్స్ గా డిజైన్ చేశారట. పవన్ కళ్యాణ్ పంజాతో మనకూ పరిచయమున్న విష్ణువర్ధన్ ది బుల్ ని ఎలా రూపొందిస్తాడోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
This post was last modified on January 2, 2024 9:14 pm
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…