ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ విడుదల తేదీ వాయిదా పడిందనే పుకారు ఒక్కసారిగా ఊపందుకుంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అప్పటికి పూర్తి కావని, అందుకే పోస్ట్ పోన్ తప్ప వేరే మార్గం లేదని సుకుమార్ చెప్పేశారని ఏవేవో కథలు అల్లేశారు. రామ్ చరణ్ అభిమానులు ఒక అడుగు ముందుకేసి గేమ్ ఛేంజర్ ని ఆ తేదీకి లాక్ చేసెయ్యమని, మంచి డేట్ కాబట్టి భారీ వసూళ్లు వస్తాయని దిల్ రాజు బ్యానర్ ని ట్యాగ్ చేసి విన్నపాలు చేయడం మొదలుపెట్టారు. అసలు ట్విస్టు ఏంటంటే వాయిదా అనేది పచ్చి గాసిప్పే తప్ప మరొకటి కాదు.
అసలీ న్యూస్ ఎక్కడ మొదలయ్యిందంటే కొందరు పేరున్న బాలీవుడ్ విశ్లేషకులు పుష్ప 2 రాదు కాబట్టి అజయ్ దేవగన్ సింగం అగైన్ కి వసూళ్ల పరంగా మంచి ఛాన్స్ ఉంటుందని వార్తలు వండారు. దీంతో ఖచ్చితమైన సమాచారం ఉండబట్టే అలా రాస్తారని భావించి అదే నిజమనుకున్న జనాలు లేకపోలేదు. దీంతో మెల్లగా ఇది వైరల్ కావడం మొదలయ్యింది. నిన్న నూతన సంవత్సర శుభాకంక్షాలు చెబుతూ పుష్ప టీమ్ వదిలిన గ్రీటింగ్ పోస్టర్ లో చాలా స్పష్టంగా రిలీజ్ డేట్ ఆగస్ట్ 15ని పెద్దక్షరాలతో కుడివైపు చివర్లో పెట్టారు. ఇరవై నాలుగు గంటలు కాక ముందే ఇదిగో ఇలా ఆన్ లైన్ ప్రచారాలు షురూ.
దర్శకుడు సుకుమార్ చేతిలో ఏడు నెలల సమయం అది. జూలైని ప్రమోషన్లు, పోస్ట్ ప్రొడక్షన్ల కోసం వాడుకున్నా బాలన్స్ షూటింగ్ ని దానికన్నా ముందే నిక్షేపంగా పూర్తి చేస్తారు. నిజానికి వేసవిలోనే గుమ్మడికాయ కొట్టేస్తారట. ఆపై కొంత టైం చేతిలో ఉంచుకుంటే ఇతరత్రా ఒత్తిళ్లు తగ్గించుకోవచ్చని అలా ప్లాన్ చేసుకున్నారు. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, అనసూయ, సునీల్ లాంటి బిజీ ఆర్టిస్టులు ఉండటం వల్ల కాల్ షీట్స్ బాలన్స్ చేయడం కొంచెం ఇబ్బందే అయినప్పటికీ పుష్ప 2 ఎట్టి పరిస్థితుల్లో ఇండిపెండెన్స్ డే మిస్ కాదు. వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ ని టార్గెట్ చేసుకున్నాడు పుష్పరాజ్.
This post was last modified on January 2, 2024 4:43 pm
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…