ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ విడుదల తేదీ వాయిదా పడిందనే పుకారు ఒక్కసారిగా ఊపందుకుంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అప్పటికి పూర్తి కావని, అందుకే పోస్ట్ పోన్ తప్ప వేరే మార్గం లేదని సుకుమార్ చెప్పేశారని ఏవేవో కథలు అల్లేశారు. రామ్ చరణ్ అభిమానులు ఒక అడుగు ముందుకేసి గేమ్ ఛేంజర్ ని ఆ తేదీకి లాక్ చేసెయ్యమని, మంచి డేట్ కాబట్టి భారీ వసూళ్లు వస్తాయని దిల్ రాజు బ్యానర్ ని ట్యాగ్ చేసి విన్నపాలు చేయడం మొదలుపెట్టారు. అసలు ట్విస్టు ఏంటంటే వాయిదా అనేది పచ్చి గాసిప్పే తప్ప మరొకటి కాదు.
అసలీ న్యూస్ ఎక్కడ మొదలయ్యిందంటే కొందరు పేరున్న బాలీవుడ్ విశ్లేషకులు పుష్ప 2 రాదు కాబట్టి అజయ్ దేవగన్ సింగం అగైన్ కి వసూళ్ల పరంగా మంచి ఛాన్స్ ఉంటుందని వార్తలు వండారు. దీంతో ఖచ్చితమైన సమాచారం ఉండబట్టే అలా రాస్తారని భావించి అదే నిజమనుకున్న జనాలు లేకపోలేదు. దీంతో మెల్లగా ఇది వైరల్ కావడం మొదలయ్యింది. నిన్న నూతన సంవత్సర శుభాకంక్షాలు చెబుతూ పుష్ప టీమ్ వదిలిన గ్రీటింగ్ పోస్టర్ లో చాలా స్పష్టంగా రిలీజ్ డేట్ ఆగస్ట్ 15ని పెద్దక్షరాలతో కుడివైపు చివర్లో పెట్టారు. ఇరవై నాలుగు గంటలు కాక ముందే ఇదిగో ఇలా ఆన్ లైన్ ప్రచారాలు షురూ.
దర్శకుడు సుకుమార్ చేతిలో ఏడు నెలల సమయం అది. జూలైని ప్రమోషన్లు, పోస్ట్ ప్రొడక్షన్ల కోసం వాడుకున్నా బాలన్స్ షూటింగ్ ని దానికన్నా ముందే నిక్షేపంగా పూర్తి చేస్తారు. నిజానికి వేసవిలోనే గుమ్మడికాయ కొట్టేస్తారట. ఆపై కొంత టైం చేతిలో ఉంచుకుంటే ఇతరత్రా ఒత్తిళ్లు తగ్గించుకోవచ్చని అలా ప్లాన్ చేసుకున్నారు. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, అనసూయ, సునీల్ లాంటి బిజీ ఆర్టిస్టులు ఉండటం వల్ల కాల్ షీట్స్ బాలన్స్ చేయడం కొంచెం ఇబ్బందే అయినప్పటికీ పుష్ప 2 ఎట్టి పరిస్థితుల్లో ఇండిపెండెన్స్ డే మిస్ కాదు. వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ ని టార్గెట్ చేసుకున్నాడు పుష్పరాజ్.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…