ఇంకో పది రోజుల్లో విడుదల కాబోతున్న గుంటూరు కారం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎవరితో సినిమా చేస్తారనే విషయంలో ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఒకరేమో వెంకటేష్-నాని కాంబోలో మల్టీ స్టారర్ అంటారు. ఇంకొకరేమో మొన్న ఈవెంట్ లో ఏదో మాట వరసకు చెప్పుకున్న వెంకీ చిరంజీవి కలయికలో అంటారు. కానీ నిజమేంటో ఎవరికీ క్లారిటీ లేదు. ఇన్ సైడ్ టాక్ ఏంటంటే త్రివిక్రమ్ ప్రస్తుతం మూడు కథల మీద వర్క్ చేస్తున్నారు కానీ ఆయన ధ్యాస ప్రధానంగా అల్లు అర్జున్ తో చేయబోయే ప్యాన్ ఇండియా మూవీ మీదే ఉంది. ఆ స్క్రిప్ట్ ని ముందు ఒక కొలిక్కి తేవాలి.
గుంటూరు కారం లాంటి కమర్షియల్ సినిమాకు ఇంత జాప్యం జరగడం ఆయన్ను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. కారణాలు ఏమైనా, మార్పులు,చేర్పులు , గ్యాపులు రాకపోయి ఉంటే ఆరు నెలల క్రితమే సిద్ధమవ్వాల్సిన అవుట్ ఫుట్ ఇది. కానీ రిలీజ్ కు పది రోజుల ముందు కూడా పాట షూట్ లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటిది బన్నీతో ప్రాజెక్టుకి ఇలాంటివి కుదరవు. అన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలి. పైగా మొదటిసారి త్రివిక్రమ్ నేషనల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు. ప్రతిదీ క్యాలికులేటెడ్ గా సుకుమార్, సందీప్ వంగా తరహా స్టాండర్డ్ లో సెట్ చేసుకోవాలి.
అలాంటప్పుడు తాపీగా ఇంకో సినిమా చేసేంత తీరిక ఆయనకు లేదని సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. అనూహ్యంగా ఏదైనా జరిగి ఒకవేళ బన్నీ కనక ఆలస్యం చేస్తే తప్ప పైన చెప్పిన కాంబో కానీ లేదా పూర్తిగా వేరే మూవీ కానీ ఉండకపోవచ్చని అంటున్నారు. గుంటూరు కారం ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో దీని గురించిన ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంది. యాంకర్ అడగకుండా ఉండరు. అప్పుడు త్రివిక్రమ్ సమాధానం చెబుతారో లేక దాటవేసి ఆగమంటారో వేచి చూడాలి. అల వైకుంఠపురములో తర్వాత ఏకంగా నాలుగేళ్ల గ్యాప్ రావడంతో గుంటూరు కారం మీద ఫ్యాన్స్ అంచనాలు మాములుగా లేవు.
This post was last modified on January 2, 2024 3:13 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…