భారీ అంచనాల మధ్య గత నెల 22న విడుదలైన సలార్ పది రోజుల రన్ పూర్తి చేసుకుంది. మొదటి మూడు రోజుల తరహాలో ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫీషియల్ ఫిగర్స్ రావడం లేదు కానీ ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు సలార్ ఇప్పటిదాకా వసూలు చేసిన గ్రాస్ 520 నుంచి 540 కోట్ల మధ్యలో ఉంది. షేర్ రూపంలో ఇది సుమారు 300 కోట్లకు దగ్గరగా ఉంటుంది. నిన్న వీకెండ్ మంచి హోల్డ్ కొనసాగించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మరీ అద్భుతంగా పికప్ చూపించలేదు కానీ మెయిన్ సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇవాళ న్యూ ఇయర్ రోజు కూడా సోల్డ్ అవుట్స్ ఎక్కువున్నాయి
ఏపీ తెలంగాణలో పెంచిన టికెట్ల రేట్ల స్థానంలో పాత ధరలు అమలులోకి తేవడంతో మిస్సైన ప్రేక్షకులకు ఇప్పుడు సాధారణ రేట్లకే చూసే వెసులుబాటు వచ్చేసింది. ఇది సానుకూలంగా కనిపిస్తోంది. అయితే వెయ్యి కోట్ల మార్కు అసాధ్యమైనే క్లారిటీ మెల్లగా వస్తోంది. కేవలం ఇంకో పది రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. గుంటూరు కారం, హనుమాన్ లు ముందు బరిలో దిగుతాయి. సలార్ ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ప్రధాన కేంద్రాలు ఒకటి రెండు కొనసాగించే అవకాశాలు పెద్దగా లేవు. మైత్రి డిస్ట్రిబ్యూషన్ కాబట్టి సలార్ స్క్రీన్లు ఎక్కువ హనుమాన్ కు వెళ్తాయి.
ఏది చేసినా రాబోయే జనవరి 11 లోపే చేసేయాలి. చూస్తుంటే రజనీకాంత్ జైలర్ నెలకొల్పిన మైలురాయి దాటడం కూడా కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జైలర్ 625 కోట్లకు వసూళ్లతో దూరంలో ఉంది. దీన్ని దాటాలంటే సలార్ ఇంకో వంద కోట్లకు పైగానే రాబట్టాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సులభంగా కనిపించడం. కెజిఎఫ్ ని మించి ఆడుతుందనుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ కోరిక నెరవేరేలా లేదు. కాకపోతే నిరాశపరచకుండా సలార్ 2కి అవసరమైన బజ్ ని సృష్టించడంలో పార్ట్ 1 సక్సెస్ అయ్యింది. డంకీ పోటీ లేకపోతే హిందీ వర్గాల్లో ఇంకాస్త మెరుగ్గా ఆడేది కానీ కుదరలేదు.
This post was last modified on January 1, 2024 6:49 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…