భారీ అంచనాల మధ్య గత నెల 22న విడుదలైన సలార్ పది రోజుల రన్ పూర్తి చేసుకుంది. మొదటి మూడు రోజుల తరహాలో ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫీషియల్ ఫిగర్స్ రావడం లేదు కానీ ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు సలార్ ఇప్పటిదాకా వసూలు చేసిన గ్రాస్ 520 నుంచి 540 కోట్ల మధ్యలో ఉంది. షేర్ రూపంలో ఇది సుమారు 300 కోట్లకు దగ్గరగా ఉంటుంది. నిన్న వీకెండ్ మంచి హోల్డ్ కొనసాగించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మరీ అద్భుతంగా పికప్ చూపించలేదు కానీ మెయిన్ సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇవాళ న్యూ ఇయర్ రోజు కూడా సోల్డ్ అవుట్స్ ఎక్కువున్నాయి
ఏపీ తెలంగాణలో పెంచిన టికెట్ల రేట్ల స్థానంలో పాత ధరలు అమలులోకి తేవడంతో మిస్సైన ప్రేక్షకులకు ఇప్పుడు సాధారణ రేట్లకే చూసే వెసులుబాటు వచ్చేసింది. ఇది సానుకూలంగా కనిపిస్తోంది. అయితే వెయ్యి కోట్ల మార్కు అసాధ్యమైనే క్లారిటీ మెల్లగా వస్తోంది. కేవలం ఇంకో పది రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. గుంటూరు కారం, హనుమాన్ లు ముందు బరిలో దిగుతాయి. సలార్ ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ప్రధాన కేంద్రాలు ఒకటి రెండు కొనసాగించే అవకాశాలు పెద్దగా లేవు. మైత్రి డిస్ట్రిబ్యూషన్ కాబట్టి సలార్ స్క్రీన్లు ఎక్కువ హనుమాన్ కు వెళ్తాయి.
ఏది చేసినా రాబోయే జనవరి 11 లోపే చేసేయాలి. చూస్తుంటే రజనీకాంత్ జైలర్ నెలకొల్పిన మైలురాయి దాటడం కూడా కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జైలర్ 625 కోట్లకు వసూళ్లతో దూరంలో ఉంది. దీన్ని దాటాలంటే సలార్ ఇంకో వంద కోట్లకు పైగానే రాబట్టాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సులభంగా కనిపించడం. కెజిఎఫ్ ని మించి ఆడుతుందనుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ కోరిక నెరవేరేలా లేదు. కాకపోతే నిరాశపరచకుండా సలార్ 2కి అవసరమైన బజ్ ని సృష్టించడంలో పార్ట్ 1 సక్సెస్ అయ్యింది. డంకీ పోటీ లేకపోతే హిందీ వర్గాల్లో ఇంకాస్త మెరుగ్గా ఆడేది కానీ కుదరలేదు.
This post was last modified on January 1, 2024 6:49 pm
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…