సంక్రాంతి సినిమాలు దేనికవే ప్రమోషన్లలో బిజీగా ఉన్నాయి. మరోవైపు నిర్మాతలు, బయ్యర్లు వీలైనన్ని ఎక్కువ థియేటర్లను బ్లాక్ చేసుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా బిసి సెంటర్లలో ఇదో పెద్ద సమస్యగా మారిపోయింది. అంచనాల పరంగా వరస క్రమం పేర్చుకుంటూ పోతే ఈగల్ స్థానం కిందకు వెళ్తుండటం రవితేజ అభిమానులను కలవరపెడుతోంది. టీమ్ క్రమం తప్పకుండ లిరికల్ వీడియోలు, ఇంటర్వ్యూలు, ఈవెంట్లు చేస్తోంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చిత్రానికి సంబంధించిన కీలక విషయాలు పంచుకుంటూ బజ్ ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రవితేజ తోడ్పాటు చాలా ఉంది.
ఇంతా చేసి గ్రాండ్ రిలీజ్ దక్కకపోతే కష్టం. ఓపెనింగ్స్ ఏ మాత్రం తగ్గినా లెక్కల పందెంలో వెనుకబడిపోతుంది. మాములుగా మాస్ మహారాజా బొమ్మంటే సి సెంటర్లోనూ స్క్రీన్ దొరుకుతుంది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదని ట్రేడ్ టాక్. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లా అంగరలో రెండు థియేటర్లే ఉన్నాయి. ఒకటి గుంటూరు కారం, మరొకటి సైంధవ్ కు ఇచ్చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో కూడా ఇదే పరిస్థితి. ఇలాంటివి లెక్కబెట్టుకుంటూ పోతే పదుల సంఖ్యలో తేలుతాయి. నా సామిరంగ, హనుమాన్ లకు సైతం ఇక్కడ చోటు దక్కలేదు. పోటీ విపరీతంగా ఉంటే వచ్చే నష్టం ఇది.
అన్ని విధాలుగా ఈగల్ రెక్కలు విదిలించాల్సిన అవసరం వచ్చేసింది. అసలే రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఫ్లాపుల తర్వాత వస్తున్న సినిమా. ఫ్యాన్స్ ఎలాగైనా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నారు. తీరా చూస్తే కాంపిటీషన్ ఇంత క్లిష్టంగా ఉంది. జనవరి 26కి వెళ్తే బాగుంటుందన్న కామెంట్లను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సీరియస్ గా తీసుకోలేదు. ఒకవేళ ఈగల్ ఎంత గొప్పగా ఉన్నా అది వీలైనంత ఎక్కువ శాతం ఆడియన్స్ కి చేరకపోతే రిజల్ట్ మీద ప్రభావం పడుతుంది. మాస్ జనాల ఆప్షన్లలో ఈగల్ ముందు వరసలోకి రావాలంటే ఇంకేదో మేజిక్ జరగాలి. టీమ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో చూడాలి.
This post was last modified on January 1, 2024 6:47 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…