Movie News

ఈగల్ రెక్కలు విదిలించక తప్పదు

సంక్రాంతి సినిమాలు దేనికవే ప్రమోషన్లలో బిజీగా ఉన్నాయి. మరోవైపు నిర్మాతలు, బయ్యర్లు వీలైనన్ని ఎక్కువ థియేటర్లను బ్లాక్ చేసుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా బిసి సెంటర్లలో ఇదో పెద్ద సమస్యగా మారిపోయింది. అంచనాల పరంగా వరస క్రమం పేర్చుకుంటూ పోతే ఈగల్ స్థానం కిందకు వెళ్తుండటం రవితేజ అభిమానులను కలవరపెడుతోంది. టీమ్ క్రమం తప్పకుండ లిరికల్ వీడియోలు, ఇంటర్వ్యూలు, ఈవెంట్లు చేస్తోంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చిత్రానికి సంబంధించిన కీలక విషయాలు పంచుకుంటూ బజ్ ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రవితేజ తోడ్పాటు చాలా ఉంది.

ఇంతా చేసి గ్రాండ్ రిలీజ్ దక్కకపోతే కష్టం. ఓపెనింగ్స్ ఏ మాత్రం తగ్గినా లెక్కల పందెంలో వెనుకబడిపోతుంది. మాములుగా మాస్ మహారాజా బొమ్మంటే సి సెంటర్లోనూ స్క్రీన్ దొరుకుతుంది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదని ట్రేడ్ టాక్. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లా అంగరలో రెండు థియేటర్లే ఉన్నాయి. ఒకటి గుంటూరు కారం, మరొకటి సైంధవ్ కు ఇచ్చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో కూడా ఇదే పరిస్థితి. ఇలాంటివి లెక్కబెట్టుకుంటూ పోతే పదుల సంఖ్యలో తేలుతాయి. నా సామిరంగ, హనుమాన్ లకు సైతం ఇక్కడ చోటు దక్కలేదు. పోటీ విపరీతంగా ఉంటే వచ్చే నష్టం ఇది.

అన్ని విధాలుగా ఈగల్ రెక్కలు విదిలించాల్సిన అవసరం వచ్చేసింది. అసలే రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఫ్లాపుల తర్వాత వస్తున్న సినిమా. ఫ్యాన్స్ ఎలాగైనా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నారు. తీరా చూస్తే కాంపిటీషన్ ఇంత క్లిష్టంగా ఉంది. జనవరి 26కి వెళ్తే బాగుంటుందన్న కామెంట్లను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సీరియస్ గా తీసుకోలేదు. ఒకవేళ ఈగల్ ఎంత గొప్పగా ఉన్నా అది వీలైనంత ఎక్కువ శాతం ఆడియన్స్ కి చేరకపోతే రిజల్ట్ మీద ప్రభావం పడుతుంది.  మాస్ జనాల ఆప్షన్లలో ఈగల్ ముందు వరసలోకి రావాలంటే ఇంకేదో మేజిక్ జరగాలి. టీమ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో చూడాలి. 

This post was last modified on January 1, 2024 6:47 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

5 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

7 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

8 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

8 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

9 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

9 hours ago