Movie News

చిరు వెంకీ మల్టీస్టారర్ మాటవరసకేనా

ఇటీవలే జరిగిన వెంకటేష్ 75 ఈవెంట్ లో ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి తామిద్దరి కలయికలో ఒక మల్టీస్టారర్ రావాలని కోరుకుంటున్నట్టు, వెంకీ ఒక లైన్ చెప్పినట్టు అన్న మాటలు ఫ్యాన్స్ కి ఉత్సాహాన్ని ఇచ్చాయి. చిరు ముందుండి కమాండ్ చేస్తే విక్టరీ వెనుక నుంచి నరుక్కుంటూ వచ్చేలా ఉంటుందని హింట్ ఇస్తే అభిమానులు నిజమేనని అనుకున్నారు. వెంకీ సైతం మీరు చూస్తూ ఉండండి ఆ సినిమా వస్తుందని ఊరించారు. నిజానికి ఇన్ సైడ్ టాక్ ఏంటంటే ఏదో ఫ్లోలో తమ మనసులో మాట చెప్పుకున్నారు కానీ అలాంటి ప్రతిపాదనేది అసలు లేనే లేదట.

మూడు దశాబ్దాలకు పైగా సుధీర్ఘమైన స్నేహం ఉన్న ఈ సీనియర్ అగ్ర హీరోలు ఇప్పటిదాకా కలిసి నటించలేదు. ఒక్క త్రిమూర్తులు స్పెషల్ సాంగ్ లో టాలీవుడ్ మొత్తం ఒకే ఫ్రేమ్ లో కనిపించడం తప్ప మళ్ళీ ఈ కలయిక సాధ్యపడలేదు. అభిమానుల అంచనాలు అందుకోలేమనే భయమో లేక పాత్రల ప్రాధాన్యం పరంగా న్యాయం జరగదన్న భావనో ఏదైతేనేం మూవీ లవర్స్ కోరిక నెరవేరలేదు. పోనీ ఆరు పదుల వయసులు దాటాక సాధ్యమైతే చూద్దామనుకుంటే అలాంటి కథలు రాసే రచయితలు లేరన్నది హీరోల కంప్లయింట్. సో ఇదంత సులభంగా తేలే వ్యవహారం కాదు.

మంచి స్టోరీ దొరికితే మొదటి గ్రీన్ సిగ్నల్ వెంకటేష్ వైపు నుంచే చూడొచ్చు. ఎందుకంటే గత కొన్నేళ్లలో మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవన్ కళ్యాణ్ గోపాల గోపాల, రామ్ మసాలా ఇలా మల్టీస్టారర్లలో భాగమయ్యారు. ఇప్పుడు చిరుతో అంటే నో చెప్పే ఛాన్స్ ఉండదు. అయితే ఎంత టైం పడుతుందనేది మాత్రం చెప్పలేం. హిమాలయాలకు వెళ్లాలనుకున్న వాడిని ఖైదీ నెంబర్ 150 సక్సెస్ చూశాక నటనకి విరామం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నానని చెప్పిన వెంకీ ప్రత్యేకంగా చిరంజీవికి వేదిక మీద థాంక్స్ చెప్పారు. కాబట్టి ఇది స్పీచుల దగ్గరే ఆగిపోకుండా కార్యరూపం దాల్చాలి. 

This post was last modified on January 1, 2024 5:31 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

3 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

5 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

6 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

6 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

7 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

7 hours ago