నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన కెరీర్ కు అతి దగ్గరలో ఉన్న విక్టరీ వెంకటేష్ తన 75వ సినిమాగా సైంధవ్ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత ఊర మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయడంతో ఫ్యాన్స్ ఉత్సాహం మాములుగా లేదు. సంక్రాంతికి ఎంత పోటీ ఉన్నా సరే గెలవడం ఖాయమని బల్లగుద్ది చెబుతున్నారు. ఈ స్పెషల్ అకేషన్ ని జరుపుకోవడానికి అభిమానులు రెడీ అవుతున్నారు. ఎల్లుండి 27న హైదరాబాద్ JRC కన్వెషన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా వేడుకలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు జరిగినట్టు తెలిసింది. ఈ ఈవెంట్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉండబోతున్నాయని టాక్
గెస్టులుగా చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, నాగార్జున లాంటి అగ్ర హీరోలతో పాటు కలియుగ పాండవులతో మొదలుపెట్టి సైంధవ్ దాకా పని చేసిన డైరెక్టర్లు, టెక్నీషియన్లు, హీరోయిన్లు, సపోర్టింగ్ ఆర్టిస్టులు వీలైనంత ఎక్కువ మందిని తీసుకొచ్చేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. రానా ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయట. వెంకీతో పని చేసిన ఎందరో దర్శకులు అందుబాటులోనే ఉన్నారు. కె రాఘవేంద్రరావు, బి గోపాల్, కోదండరామిరెడ్డి, ముప్పలనేని శివ, భీమినేని శ్రీనివాసరావు, సురేష్ కృష్ణ, జయంత్ సి పరాంజీ ఇలా ఎందరో హాజరయ్యేందుకు సుముఖంగా ఉన్నారని సమాచారం.
కె విశ్వనాథ్, కోడి రామకృష్ణ లాంటి కొందరు కాలం చేయడం వల్ల వాళ్ళ లోటు మాత్రం ఉండిపోతుంది. ఫ్యాన్స్ కోసం పరిమితంగా పాసులు జారీ చేశారు. ఎవరెవరు వస్తున్నారనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. శ్రీవిష్ణు లాంటి వెంకీని విపరీతంగా ఆరాధించే కుర్ర హీరోలు కూడా ఇందులో భాగం కాబోతున్నారు. సైంధవ్ టీమ్ తో రానా ఈ మొత్తం ప్రోగ్రాంని పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది. వంద చిత్రాలకు ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి ఈ మెమరీని చాలా స్పెషల్ గా మలచబోతున్నారట. అన్నట్టు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలకు ఇలా 75వ వేడుక జరుపుకునే ఛాన్స్ రాలేదు.
This post was last modified on December 25, 2023 8:38 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…