Political News

‘2019లో మ‌నం చాలా పెద్ద తప్పు చేశాం’

“2019లో వైసీపీ కోసం కాదు.. జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేయ‌డం కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. ఇలా చేసి మ‌నం చాలా పెద్ద త‌ప్పు చేశాం“ అని వైసీపీ నుంచి కొన్నాళ్ల కింద‌ట స‌స్పెన్ష‌న్కు గురైన రెబ‌ల్ ఎమ్మెల్యే, ఇటీవ‌ల టీడీపీలో చేరిన మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈయ‌న నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. తాజాగా సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా కడపలో ప‌ర్య‌టించిన మేక‌పాటి.. మాజీ మంత్రి వీరారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మేక‌పాటి మాట్లాడుతూ.. ‘‘నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. అయినా నా గ్రాఫ్‌ బాగా లేదంటూ సీఎం జగన్‌ నన్ను కించపరిచారు. ఉదయగిరిలో నేను డబ్బు తీసుకుంటున్నానని అన్నారు. ఉదయగిరిలో ఏముందని సంపాదించడానికి? పార్టీ బలోపేతం కోసం ఎంతో శ్రమించా. లేనిపోని అనుమానాలతో నా టికెట్‌నే అమ్మకానికి పెట్టారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని జగన్‌ సర్వనాశనం చేశారు. రాష్ట్రంలో ఎటుచూసినా అభివృద్ధి అనేదే లేదు. జగన్‌ చుట్టూ ఉండేవారు, సలహాదారులు ఎవరికివారు దోచుకునేవాళ్లే. బటన్లు నొక్కడమే పనిగా పెట్టుకొని రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఎలా?“ అని నిప్పులు చెరిగారు.

నాయకుడికి తీవ్రమైన ధనదాహం ఉండకూడదన్న మేక‌పాటి.. రుషికొండలో భవనాలను సరదాగా కట్టుకున్నట్లు ఉందని దుయ్య‌బ‌ట్టారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని తాను చాలా ద‌గ్గ‌ర‌గా చూశాన‌ని.. ఆయ‌న ద‌గ్గ‌ర కూడా ప‌నిచేశాన‌ని చెప్పుకొచ్చారు. అయితే.. వైఎస్ కు ఉన్న గుణాలేవీ జగన్‌కు రాలేదన్నారు. ఏపీలో అక్రమ కేసులు, అన్యాయాలను ఇక భరించలేమ‌ని వ్యాఖ్యానించారు. జగన్‌ ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరు. జగన్‌ లాంటి వారు రాష్ట్రాన్ని పాలిస్తే ప్రజలు బాగుపడరు. సీఎం పదవి భగవంతుడు ఇచ్చిన వరమని జగన్‌ గ్రహించాలి అని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి రాక‌పోతే.. అంద‌రూ గుండు కొట్టుకోవాల్సిందేన‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on December 25, 2023 8:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

4 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

6 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

6 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

7 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago