సంక్రాంతి సినిమాల గురించి ఇండస్ట్రీలోనే కాదు ప్రేక్షకుల్లోనూ తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఏకంగా అయిదు క్రేజున్న టాలీవుడ్ స్ట్రెయిట్ చిత్రాలు సై అంటే సై అంటూ కవ్వించుకోవడం ఓపెనింగ్స్ పట్ల ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇవి కాకుండా మరో రెండు మూడు డబ్బింగ్ బొమ్మలు బరిలో దిగేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాతల సమాఖ్య ప్రమేయాన్ని కోరుకున్నారు అభిమానులు. ఓ దఫా సమావేశం కూడా జరిగింది. ఇవాళ ఒక ప్రైవేట్ ఈవెంట్ లో అతిథిగా వచ్చిన దిల్ రాజు దానికి సంబంధించి ఒక ముఖ్య విషయాన్ని చెప్పారు.
ఎవరైనా సంక్రాంతి నుంచి తప్పుకునే పనైతే వాళ్ళు తర్వాత ఏ డేట్ అయితే కోరుకుంటారో అప్పుడు పోటీ రాకుండా సోలో రిలీజ్ దక్కేలా ప్రొడ్యూసర్ కౌన్సిల్ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. వినడానికి బాగానే ఉంది కానీ ఎవరూ తగ్గే సూచనలు పది శాతం కూడా కనిపించడం లేదు. గుంటూరు కారం ఎట్టి పరిస్థితుల్లో జనవరి 12 నుంచి తప్పుకోవడం లేదు. అదే డేట్ కి హనుమాన్ వేసే తీరతామని నిర్మాత నొక్కి చెబుతున్నారు. ఈగల్, సైంధవ్ ఒక రోజు అటోఇటో జనవరి 13 కావాలని పంతం పట్టుకుని కూర్చున్నాయి. నా సామిరంగ జనవరి 14 అనౌన్స్ మెంట్ రేపో ఎల్లుండో వస్తుంది.
ఇలాంటి పద్మవ్యూహంలో బయటికి వచ్చేందుకు ఏ నిర్మాతా ఇష్టపడటం లేదు. సోలో రిలీజ్ ఆఫర్ బాగానే ఉంది కానీ దానికి ఎవరు రెస్పాండ్ అవుతారన్నది చెప్పడమా కష్టమే. ఇంకో రెండు మూడు రోజుల్లో చెబుతామని దిల్ రాజు అంటున్నారు కానీ ప్రాక్టికల్ గా జరిగే పనిలా కనిపించడం లేదు. నిజానికి ఈ సమస్య గతంలో చాలా సార్లు వచ్చింది. ఈ ఏడాదే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఒకే బ్యానర్ నుంచి ఒక్క రోజు గ్యాప్ లో రిలీజైతే మిగిలిన వాళ్ళు తప్పుకున్నారు. డబ్బింగ్ వారసుడుని దిల్ రాజు గారు తీసుకొచ్చారు. ఒకవేళ నిజంగా రాజుగారన్నట్టు ఎవరైనా డ్రాప్ అంటే మిగిలినవాళ్ళకు అది పెద్ద గుడ్ న్యూసే
This post was last modified on December 25, 2023 8:39 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…