సంక్రాంతి సినిమాల గురించి ఇండస్ట్రీలోనే కాదు ప్రేక్షకుల్లోనూ తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఏకంగా అయిదు క్రేజున్న టాలీవుడ్ స్ట్రెయిట్ చిత్రాలు సై అంటే సై అంటూ కవ్వించుకోవడం ఓపెనింగ్స్ పట్ల ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇవి కాకుండా మరో రెండు మూడు డబ్బింగ్ బొమ్మలు బరిలో దిగేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాతల సమాఖ్య ప్రమేయాన్ని కోరుకున్నారు అభిమానులు. ఓ దఫా సమావేశం కూడా జరిగింది. ఇవాళ ఒక ప్రైవేట్ ఈవెంట్ లో అతిథిగా వచ్చిన దిల్ రాజు దానికి సంబంధించి ఒక ముఖ్య విషయాన్ని చెప్పారు.
ఎవరైనా సంక్రాంతి నుంచి తప్పుకునే పనైతే వాళ్ళు తర్వాత ఏ డేట్ అయితే కోరుకుంటారో అప్పుడు పోటీ రాకుండా సోలో రిలీజ్ దక్కేలా ప్రొడ్యూసర్ కౌన్సిల్ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. వినడానికి బాగానే ఉంది కానీ ఎవరూ తగ్గే సూచనలు పది శాతం కూడా కనిపించడం లేదు. గుంటూరు కారం ఎట్టి పరిస్థితుల్లో జనవరి 12 నుంచి తప్పుకోవడం లేదు. అదే డేట్ కి హనుమాన్ వేసే తీరతామని నిర్మాత నొక్కి చెబుతున్నారు. ఈగల్, సైంధవ్ ఒక రోజు అటోఇటో జనవరి 13 కావాలని పంతం పట్టుకుని కూర్చున్నాయి. నా సామిరంగ జనవరి 14 అనౌన్స్ మెంట్ రేపో ఎల్లుండో వస్తుంది.
ఇలాంటి పద్మవ్యూహంలో బయటికి వచ్చేందుకు ఏ నిర్మాతా ఇష్టపడటం లేదు. సోలో రిలీజ్ ఆఫర్ బాగానే ఉంది కానీ దానికి ఎవరు రెస్పాండ్ అవుతారన్నది చెప్పడమా కష్టమే. ఇంకో రెండు మూడు రోజుల్లో చెబుతామని దిల్ రాజు అంటున్నారు కానీ ప్రాక్టికల్ గా జరిగే పనిలా కనిపించడం లేదు. నిజానికి ఈ సమస్య గతంలో చాలా సార్లు వచ్చింది. ఈ ఏడాదే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఒకే బ్యానర్ నుంచి ఒక్క రోజు గ్యాప్ లో రిలీజైతే మిగిలిన వాళ్ళు తప్పుకున్నారు. డబ్బింగ్ వారసుడుని దిల్ రాజు గారు తీసుకొచ్చారు. ఒకవేళ నిజంగా రాజుగారన్నట్టు ఎవరైనా డ్రాప్ అంటే మిగిలినవాళ్ళకు అది పెద్ద గుడ్ న్యూసే
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…