ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టలేదు. అర్ధరాత్రి షోలు ఉంటాయని చెబుతున్నారు కానీ వాటికి ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు వదిలిన జిఓ బయట కనిపించడం లేదు. అయినా సరే బెనిఫిట్ షోల టికెట్ల కోసం ఓ రేంజ్ లో పైరవీలు మొదలైపోయాయి. పంపిణి హక్కులు తీసుకున్న మైత్రి ఆఫీస్ దగ్గర డిస్ట్రిబ్యూటర్ల హడావిడే కాకుండా మల్టీప్లెక్సుల మేనేజర్లు, సింగల్ స్క్రీన్ల యజమానులు కనిపించడమే దీనికి సాక్ష్యం. ఏ షోలకు ఎన్నేసి టికెట్లు కావాలనే సమాచారాన్ని ముందుగానే తీసుకుని ఆ మేరకు బ్లాక్ చేసి పెట్టేందుకు రెడీ అవుతున్నారట.
అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. భీమవరంలో స్పెషల్ షో టికెట్ బ్లాక్ లో మూడు వేల రూపాయలపైనే అమ్మోచ్చనే వార్త సంచలనం రేపుతోంది. వైజాగ్, గుంటూరు, విజయవాడలో థియేటర్ ఓనర్లకు ఎమ్మెల్యే, మంత్రి రేంజ్ లో ఫోన్ కాల్స్ వస్తున్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. టికెట్ రేట్ల పెంపు గురించి ధృవీకరణ వచ్చాక ఆన్ లైన్ బుకింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. వీటిలో ప్రీమియర్లు ముందే సోల్డ్ అవుట్ పెట్టేస్తారు కాబట్టి వాటి మీద పెద్దగా ఆశలు పెట్టుకోవడానికి లేదు. అవి కావాలంటే బయట తీసుకోవాల్సిందే.
గంటలు గడిచే కొద్దీ ఈ ట్రెండ్ ఉధృతంగా మారుతోంది. పైగా ప్రీ రిలీజ్ టాక్ పాజిటివ్ గా వినిపించడం, ప్రభాస్ టీమ్ తో రాజమౌళి చేసిన ఇంటర్వ్యూ తాలూకు సంగతులు ఎగ్జైట్ మెంట్ పెంచడం లాంటి కారణాలు హైప్ ని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. రెండో ట్రైలర్ వదలాలా వద్దా అనే విషయంలో హోంబాలే మేకర్స్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆదివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడబోతున్న ప్రశాంత్ నీల్ కొత్తగా ఏం చెబుతాడాని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో స్పెషల్ షోలు టికెట్ దొరకడమంటే అదేదో వరల్డ్ కప్ గెలిచే రేంజ్ లో హడావిడి జరుగుతోంది.
This post was last modified on December 16, 2023 6:51 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…