Political News

ఆ వ‌ర్గాల‌కు 9 సీట్ల‌తో స‌రి.. వైసీపీ స్ట్రాట‌జీ.. !

వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి.. ఏపీ అధికార పార్టీ వైసీపీ చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే అసెంబ్లీ సీట్ల‌పై దృష్టి పెట్టిన వైసీపీ.. మార్పులు చేర్పుల విష‌యంలో ఎలాంటి మొహ‌మాటాలకూ తావు లేకుండా ముందుకు సాగుతోంది. ఇక‌, కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ ఇలాంటి మార్పుల దిశ‌గానే అడుగులు వేస్తోంది. ప్ర‌ధానంగా రాష్ట్రంలో బీసీల‌ను, ఓబీసీల‌ను మ‌చ్చిక చేసుకునే దిశ‌గా వైసీపీ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.

దీనిలో భాగంగా మొత్తం 25 స్థానాల్లో 11 సీట్ల‌ను ఓబీసీలు, బీసీల‌కే కేటాయించ‌నున్న‌ట్టు తాజాగా చ‌ర్చ సాగుతోంది. వీరిలోనూ ఇప్పుడున్న వారిని ప‌క్క‌న పెట్టి ఆయా వ‌ర్గాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల నాయ‌కు ల‌ను పెద్ద‌పీట వేయాల‌ని.. వారికే టికెట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. దీంతో మొత్తం 11 స్థానాలు కూడా దాదాపు ఓబీసీల‌కే రిజ‌ర్వ్ అయిపోయాయ‌ని పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. వీరిని ఎంపిక చేయాల్సి ఉంది.

ఇక‌, మిగిలిన 14 స్థానాల్లో 9 మాత్ర‌మే జ‌న‌ర‌ల్ కు కేటాయించుకునే అవ‌కాశం ఉంది. ఇత‌ర ఐదు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరీలో ఉన్నాయి. అమ‌లాపురం, చిత్తూరు, బాప‌ట్ల‌, తిరుప‌తి ఎస్సీల‌కు, అర‌కు ఎంపీ సీటును ఎస్టీల‌కు ఇవ్వ‌నున్నారు. వీటిలో మార్పులేదు. అయితే, నాయ‌కుల‌ను మాత్రం మార్చ‌నున్నారు. అర‌కు ఎంపీ సీటును గొట్టేటి మాధ‌వికి కాకుండా… ఈసారి పురుష అభ్య‌ర్థికి ఇవ్వ‌నున్న‌ట్టు ఒక ప్ర‌చారం ఉంది. ఆమెను అసెంబ్లీకి తీసుకుంటార‌ని అంటున్నారు.

ఇక‌, మిగిలిన 9 స్థానాల్లోనే రెడ్లు, క‌మ్మ‌, బ్రాహ్మ‌ణ‌, కాపు సామాజిక వ‌ర్గాల‌కు టికెట్లు కేటాయించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యంలోనూ ఒక క్లారిటీ ఉంద‌ని అంటున్నారు. ఈ ద‌పా బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి ఒక ఎంపీ సీటు ఇస్తార‌ని తెలుస్తోంది. అదేవిధంగా రెండు నుంచి మూడు రెడ్లు, మూడు నుంచి రెండు.. క‌మ్మ‌ల‌కు, రెండు కాపుల‌కు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇక‌, మైనారిటీకి ఒక స్థానం రిజ‌ర్వ్ చేశార‌ని స‌మాచారం. మొత్తానికి జ‌న‌ర‌ల్ స్థానాల్లో 9 మాత్ర‌మే ఈ సామాజిక వ‌ర్గాల‌కు ద‌క్కుతాయ‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on December 16, 2023 6:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాజమౌళి తండ్రి

లెజెండ‌రీ రైట‌ర్‌, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్.. ఒక స్టేజ్ మీద త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.…

8 hours ago

ఏఐ లోకి జియో… మరో మ్యాజిక్ చేస్తుందా?

భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…

9 hours ago

నచ్చే పని చేసిన కల్ట్ బ్లాక్ బస్టర్

వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…

10 hours ago

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…

12 hours ago

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ…

12 hours ago

రాజు గారు రెచ్చిపోతున్నారు

నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాక..…

12 hours ago