Political News

ఆ వ‌ర్గాల‌కు 9 సీట్ల‌తో స‌రి.. వైసీపీ స్ట్రాట‌జీ.. !

వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి.. ఏపీ అధికార పార్టీ వైసీపీ చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే అసెంబ్లీ సీట్ల‌పై దృష్టి పెట్టిన వైసీపీ.. మార్పులు చేర్పుల విష‌యంలో ఎలాంటి మొహ‌మాటాలకూ తావు లేకుండా ముందుకు సాగుతోంది. ఇక‌, కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ ఇలాంటి మార్పుల దిశ‌గానే అడుగులు వేస్తోంది. ప్ర‌ధానంగా రాష్ట్రంలో బీసీల‌ను, ఓబీసీల‌ను మ‌చ్చిక చేసుకునే దిశ‌గా వైసీపీ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.

దీనిలో భాగంగా మొత్తం 25 స్థానాల్లో 11 సీట్ల‌ను ఓబీసీలు, బీసీల‌కే కేటాయించ‌నున్న‌ట్టు తాజాగా చ‌ర్చ సాగుతోంది. వీరిలోనూ ఇప్పుడున్న వారిని ప‌క్క‌న పెట్టి ఆయా వ‌ర్గాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల నాయ‌కు ల‌ను పెద్ద‌పీట వేయాల‌ని.. వారికే టికెట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. దీంతో మొత్తం 11 స్థానాలు కూడా దాదాపు ఓబీసీల‌కే రిజ‌ర్వ్ అయిపోయాయ‌ని పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. వీరిని ఎంపిక చేయాల్సి ఉంది.

ఇక‌, మిగిలిన 14 స్థానాల్లో 9 మాత్ర‌మే జ‌న‌ర‌ల్ కు కేటాయించుకునే అవ‌కాశం ఉంది. ఇత‌ర ఐదు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరీలో ఉన్నాయి. అమ‌లాపురం, చిత్తూరు, బాప‌ట్ల‌, తిరుప‌తి ఎస్సీల‌కు, అర‌కు ఎంపీ సీటును ఎస్టీల‌కు ఇవ్వ‌నున్నారు. వీటిలో మార్పులేదు. అయితే, నాయ‌కుల‌ను మాత్రం మార్చ‌నున్నారు. అర‌కు ఎంపీ సీటును గొట్టేటి మాధ‌వికి కాకుండా… ఈసారి పురుష అభ్య‌ర్థికి ఇవ్వ‌నున్న‌ట్టు ఒక ప్ర‌చారం ఉంది. ఆమెను అసెంబ్లీకి తీసుకుంటార‌ని అంటున్నారు.

ఇక‌, మిగిలిన 9 స్థానాల్లోనే రెడ్లు, క‌మ్మ‌, బ్రాహ్మ‌ణ‌, కాపు సామాజిక వ‌ర్గాల‌కు టికెట్లు కేటాయించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యంలోనూ ఒక క్లారిటీ ఉంద‌ని అంటున్నారు. ఈ ద‌పా బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి ఒక ఎంపీ సీటు ఇస్తార‌ని తెలుస్తోంది. అదేవిధంగా రెండు నుంచి మూడు రెడ్లు, మూడు నుంచి రెండు.. క‌మ్మ‌ల‌కు, రెండు కాపుల‌కు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇక‌, మైనారిటీకి ఒక స్థానం రిజ‌ర్వ్ చేశార‌ని స‌మాచారం. మొత్తానికి జ‌న‌ర‌ల్ స్థానాల్లో 9 మాత్ర‌మే ఈ సామాజిక వ‌ర్గాల‌కు ద‌క్కుతాయ‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…

41 minutes ago

పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…

2 hours ago

ఏనుగు ఇంతలా పగబట్టేసిందా

పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…

2 hours ago

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

4 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

4 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

4 hours ago