Political News

ఆ వ‌ర్గాల‌కు 9 సీట్ల‌తో స‌రి.. వైసీపీ స్ట్రాట‌జీ.. !

వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి.. ఏపీ అధికార పార్టీ వైసీపీ చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే అసెంబ్లీ సీట్ల‌పై దృష్టి పెట్టిన వైసీపీ.. మార్పులు చేర్పుల విష‌యంలో ఎలాంటి మొహ‌మాటాలకూ తావు లేకుండా ముందుకు సాగుతోంది. ఇక‌, కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ ఇలాంటి మార్పుల దిశ‌గానే అడుగులు వేస్తోంది. ప్ర‌ధానంగా రాష్ట్రంలో బీసీల‌ను, ఓబీసీల‌ను మ‌చ్చిక చేసుకునే దిశ‌గా వైసీపీ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.

దీనిలో భాగంగా మొత్తం 25 స్థానాల్లో 11 సీట్ల‌ను ఓబీసీలు, బీసీల‌కే కేటాయించ‌నున్న‌ట్టు తాజాగా చ‌ర్చ సాగుతోంది. వీరిలోనూ ఇప్పుడున్న వారిని ప‌క్క‌న పెట్టి ఆయా వ‌ర్గాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల నాయ‌కు ల‌ను పెద్ద‌పీట వేయాల‌ని.. వారికే టికెట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. దీంతో మొత్తం 11 స్థానాలు కూడా దాదాపు ఓబీసీల‌కే రిజ‌ర్వ్ అయిపోయాయ‌ని పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. వీరిని ఎంపిక చేయాల్సి ఉంది.

ఇక‌, మిగిలిన 14 స్థానాల్లో 9 మాత్ర‌మే జ‌న‌ర‌ల్ కు కేటాయించుకునే అవ‌కాశం ఉంది. ఇత‌ర ఐదు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరీలో ఉన్నాయి. అమ‌లాపురం, చిత్తూరు, బాప‌ట్ల‌, తిరుప‌తి ఎస్సీల‌కు, అర‌కు ఎంపీ సీటును ఎస్టీల‌కు ఇవ్వ‌నున్నారు. వీటిలో మార్పులేదు. అయితే, నాయ‌కుల‌ను మాత్రం మార్చ‌నున్నారు. అర‌కు ఎంపీ సీటును గొట్టేటి మాధ‌వికి కాకుండా… ఈసారి పురుష అభ్య‌ర్థికి ఇవ్వ‌నున్న‌ట్టు ఒక ప్ర‌చారం ఉంది. ఆమెను అసెంబ్లీకి తీసుకుంటార‌ని అంటున్నారు.

ఇక‌, మిగిలిన 9 స్థానాల్లోనే రెడ్లు, క‌మ్మ‌, బ్రాహ్మ‌ణ‌, కాపు సామాజిక వ‌ర్గాల‌కు టికెట్లు కేటాయించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యంలోనూ ఒక క్లారిటీ ఉంద‌ని అంటున్నారు. ఈ ద‌పా బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి ఒక ఎంపీ సీటు ఇస్తార‌ని తెలుస్తోంది. అదేవిధంగా రెండు నుంచి మూడు రెడ్లు, మూడు నుంచి రెండు.. క‌మ్మ‌ల‌కు, రెండు కాపుల‌కు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇక‌, మైనారిటీకి ఒక స్థానం రిజ‌ర్వ్ చేశార‌ని స‌మాచారం. మొత్తానికి జ‌న‌ర‌ల్ స్థానాల్లో 9 మాత్ర‌మే ఈ సామాజిక వ‌ర్గాల‌కు ద‌క్కుతాయ‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on December 16, 2023 6:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

3 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

3 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

4 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

4 hours ago

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

5 hours ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

7 hours ago