మాస్ మహారాజా రవితేజ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాని మొన్న అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కు ఎన్నికల వల్ల పెద్ద బ్రేక్ వచ్చేయడంతో ఈ లోగా తన మిరపకాయ్ హీరోతో సెట్ చేసుకున్నాడు హరీష్ శంకర్. అయితే హీరోయిన్ విషయంలో తర్జన భర్జనలు జరిగిన మాట వాస్తవం. పూజా హెగ్డే, రష్మిక మందన్నను అడిగితే వాళ్ళు నో చెప్పారని ఏవేవో కథనాలు సోషల్ మీడియాలో తిరిగాయి. వాటిని స్వయంగా డైరెక్టరే ఖండించాడు. ఫైనల్ గా బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే లాకయ్యిందని టాక్.
అసలు ఇంత కసరత్తు జరగడానికి కారణం ఉంది. ఈ చిత్రం బాలీవుడ్ మూవీ రైడ్ రీమేకనే సంగతి యూనిట్ అధికారికంగా చెప్పకపోయినా నమ్మశక్యంగా లీకుల ద్వారా ఇప్పటికే కన్ఫర్మేషన్ ఉంది. ఒరిజినల్ వెర్షన్ లో అజయ్ దేవగన్ జోడిగా ఇలియానా చేసింది. కథ మొత్తం హీరో విలన్ మధ్య జరుగుతుంది. సో భార్య పాత్రకు ప్రాధాన్యం మరీ ఎక్కువగా ఉండదు. అలాంటప్పుడు ఫామ్ లో ఉన్న భామలు ఓకే చెప్పడం కుదరదు. భాగ్యశ్రీకి ఆ సమస్య లేదు. యారియా 2లో నటించింది కానీ అదేమంత పేరు తీసుకురాలేదు. ఏదో ఒక్క బ్రేక్ దక్కితే టాలీవుడ్ లో అడుగులు పెట్టొచ్చని ఆశ.
త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్న ఈ మనీ థ్రిల్లర్ లో విలన్ గా ఎవరు ఉంటారనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. ఇది చాలా ముఖ్యమైన క్యారెక్టర్. హీరో ఐటి దాడులు చేశాక డ్రామా మొత్తం ఇతనితోనే ముడిపడి ఉంటుంది. అక్కడ సౌరభ్ శుక్లా అద్భుతంగా పండించారు. ఇక్కడెవరు చేస్తారో చూడాలి. ఈగల్ విడుదల కోసం ఎదురు చూస్తున్న రవితేజ దాని విడుదల కాగానే హరీష్ శంకర్ కు వరుసగా డేట్లు ఇవ్వబోతున్నాడు. తక్కువ షెడ్యూల్స్ లో వేగంగా పూర్తి చేసేలా పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. ఏప్రిల్ లోపు గుమ్మడికాయ కొట్టేస్తే హరీష్ తిరిగి భగత్ సింగ్ సెట్స్ లోకి వెళ్ళిపోతాడు
This post was last modified on December 16, 2023 6:51 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…