విపరీతమైన పోటీ ఒత్తిడి ఉన్నప్పటికీ తగ్గేదేలే అంటూ సంక్రాంతి బరిలో దిగుతున్న హనుమాన్ క్రేజ్ భారీగానే ఉన్నట్టు బిజినెస్ లెక్కలు చెబుతున్నాయి. ట్రేడ్ టాక్ ప్రకారం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను 22 కోట్లకు అమ్మినట్టు సమాచారం. తేజ సజ్జ మార్కెట్ కోణంలో చూసుకుంటే ఇది చాలా భారీ మొత్తం. ఎందుకంటే ఇమేజ్ ఉన్న మీడియం రేంజ్ హీరోలకే బయ్యర్లు ఈ ఫిగర్లను కోట్ చేస్తారు. అలాంటిది సరైన హిట్టే లేని ఓ లేత కుర్రాడి మీద ఇంత పెట్టుబడి రిస్కే. అయితే ఇది తేజ గొప్పదనం కాదు. హనుమాన్ బ్రాండ్ మీదున్న సెంటిమెంట్ ప్లస్ నమ్మకం.
అంతర్గతంగా వినిపిస్తున్న వెర్షన్ ప్రకారం హనుమాన్ ట్రైలర్ ని ప్రధాన డిస్ట్రిబ్యూటర్లు చూశాకే వాళ్లకు సినిమా మీద నమ్మకం వచ్చిందట. దీని కన్నా ముందు గుంటూరు కారంతో నేరుగా అదే రోజు తలపడటం గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తే మొదటి రోజు ఓపెనింగ్స్ కన్నా తర్వాత సునామిలాగా పెరిగే వసూళ్ల మీద నమ్మకం పెట్టమని నిర్మాతలు ఒప్పించి మరీ ఫుటేజ్ చూపించారట. దీంతో రెండు రోజులు కలెక్షన్లలో కొంత కోత పడినా ఓ మూడు షోలు పూర్తవ్వడం ఆలస్యం పికప్ అనూహ్యంగా ఉంటుందనే నమ్మకం వచ్చేసిందట. నార్త్ పంపిణీదారులకు ఇదే స్ట్రాటజీ వాడబోతున్నారు.
సో దర్శకుడు ప్రశాంత్ వర్మ ముందు నుంచి చెబుతున్నట్టు హనుమాన్ రచ్చ మాములుగా ఉండేలా లేదు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ ఫాంటసీ డ్రామాలో వినయ్ వర్మ విలన్ కాగా వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. సంక్రాంతి సినిమాల్లో వేగంగా ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకుంది హనుమానే. ఆడియోకు పెద్దగా రీచ్ రానప్పటికీ 19న రిలీజ్ చేయబోయే ట్రైలర్ వచ్చాక ఒక్కసారిగా జనాల్లో అంచనాలు అమాంతం పెరిగిపోతాయని అంటున్నారు. చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకోవచ్చనే వార్త తిరుగుతోంది కానీ నిర్మాతలు మాత్రం వాటిని ఖరాఖండిగా కొట్టి పారేస్తున్నారు.
This post was last modified on December 16, 2023 12:23 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…