ఇద్దరు అతి పెద్ద స్టార్లు స్క్రీన్ షేర్ చేసుకుంటే అంతకంటే కిక్ అభిమానులకు వేరొకటి ఉండదు. కాకపోతే ఫుల్ లెన్త్ సాధ్యపడకపోయినా కనీసం అతిథి రూపంలో తీరితే అయినా సంతోషిస్తారు. 2011లో వచ్చిన షారుఖ్ ఖాన్ ప్యాన్ ఇండియా మూవీ రా వన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో గెటప్ లో అది కొద్ది నిముషాలు మాత్రమే కనిపించే స్పెషల్ క్యామియో చేశారు. నిజానికి ఆ సీన్ ని డూప్ తో చేసినా వర్కౌట్ అయ్యేది కానీ బాద్షా కోరికని మన్నించిన తలైవా అదే పనిగా ఒరిజినల్ గెటప్ వేసుకుని మరీ నటించారు. అంత స్నేహం వీళిద్దరి మధ్య ఉంది. తర్వాత మళ్ళీ సాధ్యపడలేదు.
ఖైదీ, మాస్టర్, లియో ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించబోయే సినిమాలో షారుఖ్ కోసం ఒక ప్రత్యేక పాత్రను డిజైన్ చేశారట. స్టోరీ లైన్ కూడా వినిపించి సానుకూల స్పందన తెచ్చుకున్నట్టు చెన్నై టాక్. అయితే ఫైనల్ వెర్షన్ అయ్యాక నిర్ణయం తీసుకుందామని అనుకోవడంతో ప్రస్తుతానికి కన్ఫర్మ్ గా చెప్పలేం. ఒకవేళ నిజమైతే మాత్రం పదమూడు సంవత్సరాల తర్వాత ఈ కలయికని స్క్రీన్ మీద చూసినట్టు అవుతుంది. జైలర్ బ్లాక్ బస్టర్ తర్వాత హుషారు మీదున్న రజని ప్రస్తుతం వెట్టయన్ (వేటగాడు) చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్నే టీజర్ వచ్చింది.
షారుఖ్ గతంలో కమల్ హాసన్ హే రామ్ లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. మంచి ప్రశంశలు వచ్చాయి. కోలీవుడ్ లెజెండ్ తో నటించిన జ్ఞాపకం ఈ రూపంలో ఉండగా ఇప్పుడు రజినితో చేస్తే ఇంకో మెమరీ శాశ్వతం అయిపోతుంది. అన్నట్టు షారుఖ్ ఈ మధ్య దక్షిణాది హీరోలతో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు. విజయ్ కాంబినేషన్ తో దర్శకుడు ఆట్లీ కనక కథను సిద్ధం చేస్తే వెంటనే చేద్దామని ఆల్రెడీ మాట కూడా ఇచ్చాడు. ఇంకో అయిదారు నెలల్లో దానికి సంబంధించిన క్లారిటీ కూడా వచ్చేస్తుంది. డిసెంబర్ 22 విడుదల కాబోతున్న డంకీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
This post was last modified on December 13, 2023 7:40 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…